అన్వేషించండి

Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు

People Encounter: ఏపీ ఏజెన్సీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టుల మృతి చెందారు. ప్రచారం జరిగినట్లుగా వారిలో దేవ్ జీ, ఆజాద్ లేరు.

Wednesday morning encounter:  ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో  బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వారిలో దేవ్ జీ, ఆజాద్ తో సహా పలువురు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారన్న ప్రచారం జరిగింది. అయితే చనిపోయిన వారిలో టెక్ శంకర్ ఒక్కరే కీలకమైన నేతల అని ఏపీ ఇంటలిజెన్స్ ఏడీజీ లడ్హా ప్రకటించారు.   

మారేడుమిల్లికి  ఐదు కిలోమీటర్ల దూరంలో  బుధవారం ఉదయం మరో ఎన్ కౌంటర్  

ఈ ఎదురుకాల్పులు రంపచోడవరం మండలం జీఎం వలసా ప్రాంతంలో జరిగాయి. ఏపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), గ్రేహౌండ్స్ మొదలైన భద్రతా బలగాలు కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో మావోయిస్టులు తమ ఆయుధాలతో ఎదురుదాడి చేయడంతో  కాల్పులు జరిగాయి. చివరికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు.  చనిపోయిన వారిలో  మెట్టూరు జోగరావు  అలియాస్ టెక్ శంకర్ ఉన్నారు. : శ్రీకాకుళం జిల్లాకు చెందిన టెక్ శంకర్ ఆంధ్ర-ఒడిశా బార్డర్ (ఏఒబి) ప్లూటూన్ కమాండర్. ఐఈడీలు, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్ నిపుణుడు.         

తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నారని ప్రచారం - కానీ టెక్ శంకర్ హతం                   

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఆయన సెక్యూరిటీ టీం అంతా పట్టుబడటంతో ఆయనను కూడా పట్టుకున్నారని..  ఎన్ కౌంటర్ చేస్తారని కొంత మంది ఆరపణలుచేశారు.  అయితే ఈ ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. కాగా, మృతులు అంతా చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు చెబుతున్నారు. మొత్తం నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఈ ఎన్కౌంటరులో చనిపోయారు. జోగారావు, జ్యోతితో పాటు సురేశ్, గణేష్, వాసు, అనిత, షమ్మిగా మిగిలిన వారిని గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.   ఎదురుకాల్పుల స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, IEDలు, కమ్యూనికేషన్ డివైస్‌లు  స్వాధీనం చేసుకున్నారు.              

షెల్టర్ కోసం చత్తీస్ ఘడ్ నుంచి ఏపీకి వస్తున్న మావోయిస్టులు - లొంగిపోవాలని లడ్హా పిలుపు        
 
ఏపీలో మావోయిస్ట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినా, చత్తీస్‌గఢ్, తెలంగాణ నుంచి వారు రాష్ట్రంలోకి ప్రవేశించి కొత్తగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు  చెబుతున్నారు. . NTR, కృష్ణ, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులు, వారి సహాయకులు అరెస్టయ్యారు. వీరిలో సీనియర్ నేతలు, లాజిస్టిక్స్ హ్యాండ్లర్లు, కమ్యూనికేషన్ ఆపరేటర్లు, ఆర్మ్డ్ ప్లూటూన్ సభ్యులు, పార్టీ క్యాడర్లు ఉన్నారు. మాడ్వీ  హిద్మాతో సన్నిహితంగా ముడిపడినవారే ఎక్కువగా అరెస్టయ్యారు. ఈ ఆపరేషన్లు ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా నిర్వహించామని, మావోయిస్టుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఏడీజీ లడ్డా పేర్కొన్నారు.               


  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Jogi Ramesh Domestic Violence Case: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget