అన్వేషించండి

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!

PM Narendra Modi | ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

PM Modi AP Tour Cancelled due to bad Weather | న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన పర్యటన రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ హెచ్చరికలతో మోదీ పర్యటన రద్దు అయినట్లు పీఎంవో తెలిపింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. దాంతో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.

అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపనతో పాటు జాతీయ రహదారుల అంకితం, కొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ స్టేడియంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ సైతం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారుతోంది. అనంతరం అది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు చేసినట్లు ప్రధాని కార్యాలయం సోమవారం వెల్లడించింది.

ప్రధాని మోదీ శంకుస్థాపననలు, కార్యక్రమాలు ఇవీ

విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్‌ ఏర్పాటుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ పార్క్‌ ఏర్పాటుతో రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా  విశాఖలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన జరగనుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పార్క్‌తో పాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు సైతం ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టులతో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. 

Also Read: Total Night Village: వాళ్లకు సూర్యుడు కనిపిస్తే పండగే - చీకట్లేనే మగ్గే విలేజ్ - నార్వేలో ఈ వింత గ్రామం గురించి విన్నారా ? 

విశాఖలోని పూడిమడకలో శంకుస్థాపన చేయనున్న ఎన్టీపీసీ ప్రాజెక్టును మూడు దశలలో పూర్తి చేయనున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్లు, విండ్, సోలార్‌ హైబ్రిడ్‌ పంప్డ్‌ స్టోరేజీకి అవసరమయ్యే 20 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తెలిపారు. ఏపీ జెన్‌కోకు ఈ ప్రాజెక్టులో 50 శాతం భాగస్వామ్యం ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌తో ఒప్పందం గురించి చంద్రబాబు వివరించారు. టాటా గ్రూప్‌ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టబోతోంది. ఎల్‌జీ సంస్థ సైతం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన 227 ఎంవోయూలతో ప్రయోజనం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చర్యల కారణంగా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget