అన్వేషించండి

PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!

PM Narendra Modi | ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

PM Modi AP Tour Cancelled due to bad Weather | న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన పర్యటన రద్దయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ హెచ్చరికలతో మోదీ పర్యటన రద్దు అయినట్లు పీఎంవో తెలిపింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రధాని మోదీ తొలిసారి ఏపీలో పర్యటించనున్నారు. దాంతో ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది.

అనకాపల్లి పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ శంకుస్థాపనతో పాటు జాతీయ రహదారుల అంకితం, కొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ స్టేడియంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ సైతం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తీవ్ర వాయుగుండంగా మారుతోంది. అనంతరం అది తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు చేసినట్లు ప్రధాని కార్యాలయం సోమవారం వెల్లడించింది.

ప్రధాని మోదీ శంకుస్థాపననలు, కార్యక్రమాలు ఇవీ

విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్‌ ఏర్పాటుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఈ పార్క్‌ ఏర్పాటుతో రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా  విశాఖలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన జరగనుందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పార్క్‌తో పాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు సైతం ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టులతో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. 

Also Read: Total Night Village: వాళ్లకు సూర్యుడు కనిపిస్తే పండగే - చీకట్లేనే మగ్గే విలేజ్ - నార్వేలో ఈ వింత గ్రామం గురించి విన్నారా ? 

విశాఖలోని పూడిమడకలో శంకుస్థాపన చేయనున్న ఎన్టీపీసీ ప్రాజెక్టును మూడు దశలలో పూర్తి చేయనున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్లు, విండ్, సోలార్‌ హైబ్రిడ్‌ పంప్డ్‌ స్టోరేజీకి అవసరమయ్యే 20 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల తెలిపారు. ఏపీ జెన్‌కోకు ఈ ప్రాజెక్టులో 50 శాతం భాగస్వామ్యం ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌తో ఒప్పందం గురించి చంద్రబాబు వివరించారు. టాటా గ్రూప్‌ సైతం విశాఖలో పెట్టుబడులు పెట్టబోతోంది. ఎల్‌జీ సంస్థ సైతం పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. 2014-19 మధ్య కాలంలో జరిగిన 227 ఎంవోయూలతో ప్రయోజనం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చర్యల కారణంగా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టలేదన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget