అన్వేషించండి

PM Modi Oath Ceremony: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం - టీడీపీ, జనసేన నేతలకు అగ్రపీఠం

Modi Oath Taking Ceremony: నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే మిత్రపక్ష నేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారికి బీజేపీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

PM Modi Oath Ceremony : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయగా..  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో మోదీతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. 2019లోనూ రెండో సారి ఎన్డీయే ఘన విజయంతో రెండో సారి ప్రధాని అయ్యారు.  2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు.  ఢిల్లీలో మోడీ సహా కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రధాన మంత్రి సహా 72 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, తదితరులు ఉన్నారు.

మిత్రపక్షాలకు ప్రాధాన్యం
18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా.. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకు మొత్తం 293 సీట్లతో మెజారిటీ సాధించింది.  పాత మంత్రివర్గంలోని 22 మంది ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలకు ముందే 10 మంది మంత్రులు వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో కొత్త క్యాబినెట్లో చాలా మంది కొత్త వాళ్లకు చోటు కల్పించారు. సంకీర్ణ సర్కార్‌ క్యాబినెట్‌లో మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు కూడా భాగం అయ్యారు. ఎన్డీయే 3.0లో టీడీపీ, నితీష్ పార్టీ జేడీయూ కీలకంగా మారాయి.

బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఆ పార్టీ ప్రతినిధులకు ప్రాధాన్యత పెరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి క్యాబినెట్లో స్థానం లభించింది.  తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ ఎంపీలు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు క్యాబినెట్ బెర్త్‌ దక్కింది. మోడీ నివాసంలో వీరంతా తేనీటి విందుకు హాజరయ్యారు. 

క్యాబినెట్ లో కొత్త ముఖాలు
ప్రభుత్వంలో కొత్త ముఖాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువమంది బీజేపీ మిత్రపక్షాలకు చెందిన వారే. ఎన్డీయే కూటమి మిత్ర పక్షాలైన టీడీపీకి చెందిన రామ్‌మోహన్‌ నాయుడు, చంద్రశేఖర్‌ పెమ్మసాని, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, జేడీయూ నుంచి లాలన్‌సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, శివసేనకు చెందిన ప్రతాప్‌రావు జాదవ్‌తో పాటు ఎల్‌జేపీకి చెందిన చిరాగ్‌ పాశ్వాన్‌, హెచ్‌ఏఎంకు చెందిన జితన్‌రామ్‌ మాంఝీ, జేడీఎస్‌కు చెందిన హెచ్‌డీ కుమారస్వామి, జయంత్ చౌదరి, ఆర్‌ఎల్‌డీకి చెందిన రాందాస్ అథవాలే, ఆర్‌పీఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నా దళ్‌కు చెందిన అనుప్రియ పటేల్, బీజేపీ కి చెందిన మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్, శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ కుమార్, రవ్‌నీత్ సింగ్ బిట్టు కూడా కేంద్ర మంత్రి మండలిలో కొత్తగా చేరనున్నారు.

PM Modi Oath Ceremony: ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం - టీడీపీ, జనసేన నేతలకు అగ్రపీఠం  
 
ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 
ఇక ప్రధాని ప్రమాణస్వీకార మహోత్సవానికి ఎన్డీయే మిత్రపక్షాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కు, నితీష్ కుమార్‌కు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.  2024 ఎన్నికల్లో ఏపీలో భారీ విజయం సాధించిన చంద్రబాబు.. కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కూడా అత్యంత కీలకంగా మారారు.  బీజేపీ మంత్రి వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను  మోదీ కూర్చొనే లైన్లోనే ఉండటం అందరినీ ఆసక్తిగా చూసేలా చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాళ్ల ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆయా పార్టీలకు చెందిన వారంతా సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టుకుని హల్ చల్ చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Embed widget