Pawan Kalyan: మంచి ప్రభుత్వమే కానీ మెతక కాదు - మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం - పవన్ కల్యాణ్ హెచ్చరిక
Janasena: కూటమి ఐక్యత కొనసాగుతుందని మరో పదిహేను,ఇరవై ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan : కూటమి ఐక్యత చెడకొట్టే పరిస్థితి లో నేను లేను.. 15 నుంచి 20 ఏళ్ళు ఉండే కూటమి ఇది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కూటమి పాలన ఏడాది అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు విధ్వంస పాలన సాగిందని గుర్తు చేశారు. 2014 నుంచి అభివృద్ధి కోరుకుంటున్నామన్నారు. కష్టాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ జరిగిందని డిప్యుటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయన్నారు.
వైసీపీ హయాంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని ..ఆ ప్రభుత్వం వస్తే ఏంటి అని కొంత మంది అనుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మరో పదిహేను..ఇరవై ఏళ్లు ఉంటుందని..ఈ ఐక్యతను తాను చెడగొట్టే పరిస్థితుల్లో లేననని స్పష్టం చేశారు. అసాంఘిక చర్యలను ఏమాత్రం సహించమని హెచ్చరించారు. గొంతులు కోస్తాం అనే నినాదాలకు భయపడేవారెవరూ లేరని హెచ్చరించారు. పనికిమాలిన బెదిరింపులు చేయకండి.. సంస్కారం ఉంది కాబట్టే పద్ధతిగా మాట్లాడుతున్నామని ... అధికారంలో లేకున్నా గత పాలకుల నియంత పోకడలు మారలేదు.. పోలీసులను వెంటాడుతాం అనే స్టేట్మెంట్లు ఇబ్బందిగా ఉన్నాయని..గొంతులు కోస్తాం.. కుత్తుకలు కోస్తాం అంటే ఊరుకునేది లేదన్నారు.
2019 నుంచి 2024 వరకు YSRCP పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని, శాంతిభద్రతలు క్షీణించాయని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి శూన్యమైందని, ఐదేళ్లలో రాష్ట్రానికి అభివృద్ధి అనవసరంగా దూరమైందని తెలిపారు. YSRCP పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్కు మళ్లీ వెలుగు వస్తుందా అని అనుమానించినట్లు, కానీ కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తోందని పేర్కొన్నారు తాను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నానని, దీని వల్ల ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో కూడా నమ్మకం పెరిగిందని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, శాస్త్ర, అటవీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నివేదిక రూపంలో ప్రజలకు అందించామని తెలిపారు.
అమరావతి : సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై సదస్సు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.
— Telugu Stride (@TeluguStride) June 23, 2025
జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్, పురందేశ్వరి. సదస్సులో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు. #Suparipalana #AndhraPradesh #Chandrababu… pic.twitter.com/uSrSf9ve6n
వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, రావట్లేదు.గొంతులు కొసేస్తాం అని పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం.అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నేను కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాడినేనని గుర్తు చేశారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు ఇక్కడ సరదాగా ఎవరూ లేరన్నారు. చాలా దెబ్బలు తిని ఇక్కడికి వచ్చాం.. రాజ్యాంగబద్ధంగా ఉన్నాం.. ఉంటామన్నారు.కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు.. పిచ్చి వేషాలు వేస్తే నార తీస్తాం.. గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.





















