అన్వేషించండి

Free bus for Women: ఆగస్టు 15 నుండి మహిళలకు ఫ్రీ బస్ : మంత్రి నారా లోకేష్

Nara Lokesh News : ఆగస్టు 15 నుండి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

అమరావతి: జూన్ 4 రాష్ట్ర చరిత్రను మార్చిన రోజు, ప్రజాస్వామ్యం గెలిచిన రోజు. గెలిచింది కూటమి కాదు రాష్ట్ర ప్రజలు అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. బి.ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం గొప్పతనం ఏంటో మరోసారి తెలిసిన రోజు అన్నారు. ఆగష్టు 15న మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అమలుచేస్తామని ప్రకటించారు. సుపరిపాలన- తొలిఅడుగు సందర్భంగా ఏపీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొని మాట్లాడారు. గెలిచింది టీడీపీ, బీజేపీ, జనసేన కాదు.. గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో 175 స్థానాల్లో ఏకంగా 164 నెలిపించి ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాసారు కనుక ఇది ప్రజా విజయమని అన్నారు.

ఆగస్టు 15నుంచి మహిళలకు ఫ్రీబస్
‘గత ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లు మూసేస్తే.. ప్రజా ప్రభుత్వం 203 అన్న క్యాంటిన్లు తిరిగి ప్రారంభించింది. దీపం పథకం ద్వారా కోటి సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందజేశాం. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి పోస్టు కూడా భర్తీ చెయ్యలేదు.  కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తూ మెగా డిఎస్సి నిర్వహిస్తోంది.  త్వరలోనే అన్నదాత సుఖీభవ అమలు చేస్తాం. ఆగష్టు 15న మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం అమలుచేస్తాం. గత ప్రభుత్వంలో పాలకులు ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే దానిని మన ప్రభుత్వం రద్దు చేసింది.  గత ప్రభుత్వం చెత్త మీద పన్ను వేస్తే చంద్రబాబు ప్రభుత్వం చెత్త పన్ను ఎత్తేసింది. 

5 ఏళ్లలో సాధించలేనిది ఏడాదిలోనే!
వైసీపీ పాలనలో ఐదేళ్లలో సాధించలేనిది మేం ఏడాదిలో సాధించాం. అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది.  గత ప్రభుత్వానికి 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టింది. సీఎం చంద్రబాబు కేవలం ఒకే ఒక్క సంతకంతో పెన్షన్ 1000 రూపాయలు పెంచారు. దేశంలో 4 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దివ్యాంగులకు 6 వేలు, పూర్తిగా బెడ్ కే పరిమితం అయితే 15 వేలు ఇస్తున్నాం. 67,27,164 మంది విద్యార్థులకు ఇటీవల తల్లికి వందనం పథకం అమలు చేసాం.  8745 కోట్లు తల్లుల ఖాతాల్లో వేసాం. మొదటి తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరే  విద్యార్థులకు త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. 

పేదరికంలేని సమాజం చంద్రబాబు లక్ష్యం
పేదరికం లేని సమాజం చూడాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యం. అందుకే  పీ4 కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడమే పీ4 విధానం. బంగారు కుటుంబాలకు చేయూత అందిస్తున్న మార్గదర్శులకు నా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ అన్న ఆధ్వర్యంలో పంచాయతీలకు స్వాతంత్య్రం వచ్చింది. పంచాయితీలకు వెయ్యి కోట్లు నిధులు విడుదల చేసాం.  రైతుల నుండి 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడంతో పాటు 13,600 కోట్లు చెల్లించాం. గత వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పెట్టిన 1700 కోట్ల బకాయిలు పెడితే మనం అధికారంలోకి వచ్చాక తీర్చాము.  పొగాకు, మిర్చి, కోకో రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటుంది చంద్రబాబు‘ అన్నారు మంత్రి నారా లోకేష్. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Balakrishna : సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!
సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!
Year Ended 2025: ప్రజల విశ్వాసానికి కేంద్రంగా మారిన ప్రయాగ, గూగుల్‌లో ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన అంశం ఇదే!
ప్రజల విశ్వాసానికి కేంద్రంగా మారిన ప్రయాగ, గూగుల్‌లో ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన అంశం ఇదే!
Lionel Messi India Tour: మెస్సీ హైదరాబాద్‌లో ఆడకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు! అతని కాళ్ల విలువ ఎంతో తెలుసా?
మెస్సీ పాదాల విలువ 9వేల కోట్లు..! అతను హైదరాబాద్‌ మ్యాచ్ ఆడకపోవడానికి అసలు రీజన్ అదే..!

వీడియోలు

India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucky Draw Sarpanchs in Telangana: రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
రెండో విడత ఫలితాల్లో చిత్ర విచిత్రాలు.. సమానంగా ఓట్లు, లక్కీ డ్రా సర్పంచ్ లు..!
Balakrishna : సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!
సింగర్‌గా మారనున్న బాలయ్య - 'NBK111'లో సాంగ్ కన్ఫర్మ్ చేసిన తమన్!
Year Ended 2025: ప్రజల విశ్వాసానికి కేంద్రంగా మారిన ప్రయాగ, గూగుల్‌లో ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన అంశం ఇదే!
ప్రజల విశ్వాసానికి కేంద్రంగా మారిన ప్రయాగ, గూగుల్‌లో ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన అంశం ఇదే!
Lionel Messi India Tour: మెస్సీ హైదరాబాద్‌లో ఆడకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు! అతని కాళ్ల విలువ ఎంతో తెలుసా?
మెస్సీ పాదాల విలువ 9వేల కోట్లు..! అతను హైదరాబాద్‌ మ్యాచ్ ఆడకపోవడానికి అసలు రీజన్ అదే..!
PV Sunil Kumar: రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్
రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్
Bigg Boss Telugu Day 99 Promo : లాస్ట్ వీక్​లో కూడా వదల్లేదుగా.. టాస్క్​తో డిమోన్ పవన్, ఇమ్మాన్యుల్ ర్యాంపేజ్
లాస్ట్ వీక్​లో కూడా వదల్లేదుగా.. టాస్క్​తో డిమోన్ పవన్, ఇమ్మాన్యుల్ ర్యాంపేజ్
Investment Tips: వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
వెండి లేదా గోల్డ్ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి ? ఏది లాభదాయకం, బెనిఫిట్స్ ఎక్కువ
Dekhlenge Saala Song : పవన్ 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ న్యూ హిస్టరీ - 24 గంటల్లోనే యూట్యూబ్ షేక్
పవన్ 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ న్యూ హిస్టరీ - 24 గంటల్లోనే యూట్యూబ్ షేక్
Embed widget