అన్వేషించండి

Pawan Kalyan : సీఎం స్పందించకపోవడంతోనే రైతులకు ఇబ్బందులు - న్యాయం జరిగే వరకూ పోరాడతామన్న పవన్ !

రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రిలో పార్టీ కార్యాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

Pawan Kalyan :  రైతులపై కేసులు పెడితే ఊరుకునేది లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాజమండ్రిలో  జనసేన నూతన కార్యాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.  అకాల క్షేత్ర స్తాయి పర్యటనలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటం, వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించకపోవటం, ముఖ్యమంత్రి స్పందించకపోవటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. రుణమాఫీ వద్దని... పావలా వడ్డీకి ఎకరానికి 25 వేలు రుణం ఇస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారని తెలిపారు. గోనె సంచులు ఇవ్వకపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.                                      

 

 

ప్రతీ గింజ కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. జనసేనకు ఆవేదన చెప్పిన రైతులను వేదిస్తే వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందన్నారు. ‘‘రాజమండ్రి నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా... రైతులపై లాఠీచార్జీలు చేసినా, బైండోవర్ కేసులు పెట్టినా వైసీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.                                                  

వర్షాల కారణంగా పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాల పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం అంతా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కళ్లాల్లో నిలువ ఉన్న, మొలకెత్తిన, తడిసిన ధాన్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. అధికారులు తమ గోడు వినిపించుకోవడంలేదని, రైస్‌ మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే భారీగా కోతలు విధిస్తున్నారని పలువురు రైతులు ఆయన వద్ద వాపోయారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టపోయాని తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రైతులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.                                    

రైతుల పట్ల పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగు మారిన, మొలకెత్తిన ప్రతి గింజనూ మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. వేమగిరి నుంచి కొత్తపేట వరకూ పవన్‌కు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యమధ్యలో రైతులు తీసుకొచ్చిన మొలకెత్తిన వరి కంకులను పరిశీలించారు.  పవన్ కల్యాణ్ వస్తున్నారని చెప్పి హడావుడిగా కొన్న ప్రాంతాల్లో ధాన్యాన్ని రైతులు కనుగోలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget