అన్వేషించండి

12 ఏళ్ల కిందట పాలెంలో.. ఇప్పుడు టేకూరులో… బెంగళూరు హైవే బలితీసుకున్న రెండు దుర్ఘటనలు.. బస్సుల వేగమే కారణమా..?

Palem and kurnool bus accidents: కర్నూలు సమీపంలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంలో 20మంది చనిపోయారు. కానీ 12 ఏళ్ల కిందట ఇదే అక్టోబర్‌ లో ఈ ప్రమాదానికి కాస్త దూరంలోనే జరిగిన ఇంకో పెద్ద దుర్ఘటన గుర్తుందా.?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Palem and kurnool bus accidents: శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు నగరానికి సమీపంలోని చిన్న టేకూరు వద్ద జరిగిన వోల్వో బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటనలో 20 నిండుప్రాణాలు పోయాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళుతున్న వోల్వో బస్సు.. వేగంగా వెళుతూ ఓ మోటర్‌బైకును ఢీ కొట్టి..  ఆ క్రమంలో బస్సులో మంటలు రేగి.. అది పూర్తిగా తగులబడిపోయింది. 40మందికిపైగా ఉన్న బస్సులో సగం మందే ప్రాణాలు కాపాడుకోగలిగారు. స్లీపర్‌ బస్సు సీట్లలోనే 20మంది సజీవంగా దహనం అయిపోయారు. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చకు అటెన్షన్‌కు దారి తీసింది. కానీ దీనికి మించిన దుర్ఘటన ఇప్పుడు ప్రమాదం జరిగిన హైవేపైనే.. ఓ గంట దూరంలో మరో భారీ ప్రమాదం 12 ఏళ్ల కిందట జరిగింది.

పాలెం బస్సు ప్రమాదం – Palem Bus Accident

పాలెం బస్సు దుర్ఘటనను జనాలు అంత తేలికగా మర్చిపోలేరు. క్షణాల్లో బస్సు మొత్తం బూడిదైపోయి.. శరీరాలు గుర్తు పట్టడానికి కూడా వీలుకాని విధంగా 45 ప్రాణలు  బూడిద కుప్పలుగా మారిపోయాయి. అక్టోబర్ 30, 2013న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి మహబూబ్ నగర్‌ జిల్లా, ఇప్పటి వనపర్తి జిల్లాలోని పాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4-5 గంటల మధ్యలో జరిగిన ఈ ప్రమాదంలో క్షణాల్లోనే బస్సు మసైపోయింది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అతిపెద్ద రోడ్డు ప్రమాదాల్లో అది ఒకటిగా నిలిచిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. మరో గంటలో హైదరాబాద్‌ చేరుకుంటారనగా తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలచివేసింది.

ఒకే హైవేపై ఒకే రీతిలో ప్రమాదాలు – అతివేగమే అనర్థం

బెంగళూరు హైవేపై జరిగిన ఈ రెండు దుర్ఘటనలు… అత్యంత ఘైరమైన రోడ్డు ప్రమాదాలుగా నిలిచిపోతాయి. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్  బస్సు కర్నూలు దాటిని తర్వాత ప్రమాదానికి గురైతే.. అప్పుడు బెంగళూరు నుంచి వస్తున్న  జబ్బార్ ట్రావెల్స్ బస్సు కొత్తకోట సమీపంలోని పాలెం గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ రెండు ఘటనల్లోనూ అతి వేగమే ప్రమాదానికి కారణంగా అర్థమవుతోంది. టేకూరు వద్ద వేగంగా వెళుతున్న Volvo బస్సు.. మోటర్‌ సైకిల్‌ను ఢీ కొడితే అది బస్సు కిందకు వెళ్లిపోయి మంటలు చెలరేగాయి. అప్పుడు జబ్బార్ ట్రావెల్స్ బస్సు వేగంగా వెళుతున్న మరో కారును ఓవర్‌టేక్ చేస్తూ పక్కకు వెళడంతో బస్సుకు ఉన్న డీజిల్ ట్యాంక్ రోడ్ డివైడర్‌కు గుద్దుకుని మంటలు రేగాయి. క్షణాల్లోనే బస్సును దగ్ధం చేశాయి.  

90 కిలోమీటర్ల పరిధిలో రెండూ బెంగళూరు హైవేపేనే జరిగాయి.

  • వేగం & డ్రైవింగ్‌కి నియంత్రణ లేకపోవడం, అప్రమత్తరాహిత్యమే మూల కారణాలు.
  • ప్రమాదాలు జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడం—ప్రాణాపాయం పెరగడం.
  • రాత్రి టైమ్, ప్రయాణికులు నిద్రలో ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువవడం.

ఈ రెండు ప్రమాదాలు బస్సుల డిజైన్, వేగ నియంత్రణ, ఫిట్‌నెస్, ఎస్కేప్ ప్లాన్ వంటి విషయాలపై చర్చకు దారితీస్తున్నాయి. బస్సుల్లో అగ్ని కీలలు రాగానే క్షణాల్లోనే కాలిపోతున్నాయని బస్సుల తయారీకి వాడుతున్న మెటీరియల్ మంటలను వేగంగా వ్యాప్తి చేస్తోందని దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా వ్యాఖ్యలు చేశారు.


12 ఏళ్ల కిందట పాలెంలో.. ఇప్పుడు టేకూరులో… బెంగళూరు హైవే బలితీసుకున్న రెండు దుర్ఘటనలు.. బస్సుల వేగమే కారణమా..?

ఇంతే కాదు.. రెండేళ్ల కిందట ఇదే హైవే పై ఈ ప్రమదాలకు సమీపంలోనే జడ్చర్ల వద్ద కూడా తెలంగాణ ఆర్టీసి బస్సు కాలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం జరగలేదు. అది ఏసీ బస్సు కాకపోవడం వల్ల ప్రయాణీకులు వేగంగా కిటికీల్లోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

 

Frequently Asked Questions

కర్నూలు వద్ద జరిగిన వోల్వో బస్సు అగ్ని ప్రమాదంలో ఎంతమంది మరణించారు?

కర్నూలు సమీపంలో జరిగిన వోల్వో బస్సు అగ్ని ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.

పాలెం బస్సు ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరిగింది?

పాలెం బస్సు ప్రమాదం అక్టోబర్ 30, 2013న అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి జిల్లాలోని పాలెం గ్రామం వద్ద జరిగింది.

ఈ రెండు ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ రెండు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతి వేగం, డ్రైవింగ్‌లో నియంత్రణ లేకపోవడం, అప్రమత్తరాహిత్యం.

ప్రమాదాలు జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణం ఏమిటి?

బస్సుల డిజైన్, వాటి తయారీలో ఉపయోగించే మెటీరియల్ మంటలను వేగంగా వ్యాప్తి చేస్తాయని, దీనివల్ల ప్రాణాపాయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Advertisement

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget