అన్వేషించండి

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి మరో షాక్, త్వరలో టీడీపీ గూటికి ఎంపీ మాగుంట! కారణం ఏంటంటే!

Telugu Desam Party: ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

Ongole Parliament Constituency: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారని వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే వైసీపీ అధిష్టానం తేల్చేసింది. దీంతో టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. నేడో, రేపో చంద్రబాబుతో మాగుంట భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. అనంతరం టీడీపీలో చేరికపై అధికారిక ప్రకటన చేయనున్నారు. దీంతో వైసీపీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేనలో చేరగా.. ఇప్పుడు మాగుంట కూడా జగన్‌కు హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒంగోలు ఎంపీ సీటును వేరే వారికి కేటాయించేందుకు వైసీపీ సిద్దమవ్వడంతో..  ఆ పార్టీలో గత కొద్దిరోజులుగా మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో సైకిలెక్కేందుకు టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

టీడీపీలో చేరికపై చంద్రబాబుతో చర్చలు! 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇటీవల మాగుంట ఢిల్లీ వెళ్లారు.  సమావేశాలు ముగియడంతో మాగుంట ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం లేదా బుధవారం  హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో మాగుంట భేటీ కానున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరే విషయంపై చంద్రబాబుతో చర్చలు జరుపనున్నారని సమాచారం. ఎంపీ టికెట్‌పై హామీ ఇస్తే పసుపు కండువా కప్పుకోవాలనే ఆలోచనలో మాగుంట ఉన్నారు. టికెట్‌పై క్లారిటీ వస్తే టీడీపీలో చేరికపై ఒంగోలులో మాగుంట అధికారిక ప్రకటన చేయనున్నారు.  గత ఎన్నికల ముందు మాగుంట టీడీపీలోనే ఉన్నారు. కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా గెలిచారు. లిక్కర్ స్కాంలో మాగుంట చిక్కుకోవడం, వైసీపీ అధిష్టానం ఆయనకు అండగా నిలబడకపోవడంతో  గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. చివరికి ఎంపీ టికెట్‌ కూడా ఇవ్వనని సీఎం జగన్ చెప్పడంతో టీడీపీ గూటికి చేరేందుకు మాగుంట సిద్దమవుతున్నారు.

ఒంగోలు ఎంపీ టికెట్‌ ఎవరికో!
మాగుంటకు టికెట్ ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కోరారు. మాగుంటకు ఇవ్వకపోతే తాను కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. అయినా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రీజినల్ కో ఆర్డినేటర్‌గా జగన్ నియమించారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇప్పటివరకు వైసీపీ అధిష్టానం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఒంగోలు ఎంపీ టికెట్‌ను వైసీపీ అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందనేది సస్పెన్స్‌గా మారింది. 

మాగుంట కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1998, 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అనంతరం 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  2019లో మార్చి 16న టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget