అన్వేషించండి

NGT : సీమ ఎత్తిపోతలపై సెప్టెంబర్ 8న ఎన్జీటీ తీర్పు

సీమ ఎత్తిపోతల అంశంపై సెప్టెంబర్ 8న నిర్ణయం ప్రకటిస్తామని ఎన్జీటీ తెలిపింది. మరో వైపు ఏపీలోని వెలుగొండ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వవద్దని తెలంగాణ లేఖ రాసింది.


రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందో లేదో సెప్టెంబర్ 8వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై బెంచ్ తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నై NGT ధర్మాసనం విచారణ జరిపింది. ప్రాజెక్టు పనులపై స్టే ఉన్పన్పటికీ ఎపీ ప్రభుత్వం నిర్మిస్తోందని శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖతో పాటు కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. అనేక వాయిదాల తర్వాత ఇటీవల ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి ఎన్జీటీకి కేఆర్ఎంబీ కమిటీ నివేదిక సమర్పించింది. 

కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత తీర్పు 

అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో జరిగిన పనుల వల్ల ఎలాంటి పర్యావరణ ప్రభావం ఉంటుందో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను కేంద్రం ఆదేశించింది.   నివేదిక ఇచ్చేందుకు సమయం కావాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 8వ తేదీ వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీటీ తెలిపింది. సెప్టెంబర్ 8వ తేదీన అన్ని అంశాలు పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పనులు జరిగినట్లుగా ఉంటే ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలోనే ఎన్జీటీ హెచ్చరించింది. గతంలో కోర్టు ధిక్కరణ కింద ఎవరికైనా శిక్షలు వేశారా అన్న అంశంపై వివరాలు సమర్పించాలని ఎన్జీటీ పిటిషనర్లను ఆదేశించింది. 

పనులు చేపట్టలేదని మరోసారి ఏపీ సర్కార్ అఫిడవిట్ 

అయితే ఈ లోపు ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ జరిగిన పనులు  సెంట్రల్ వాటర్ కమిషన్ అనుతుల కోసం అవసరమైనవి మాత్రమేనని తెలిపింది.ఆ ప్రదేశంలో యంత్రాలు లేవని, కార్మికులు కూడా లేరని పనులేమీ జరగడం లేదనితెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు జాయింట్‌ కమిటీ పేర్కొనలేదని ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ను ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. నివేదికను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. 

వెలుగొండకు నిధులివ్వవద్దని తెలంగాణ లేఖ

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులు కేటాయింపుపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగా ప్రభుత్వం లేఖ రాసింది.  వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవనితె...కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో కూడ ఈ ప్రాజెక్టును నోటిఫై చేయలేదని కూడ తెలంగాణ సర్కార్ గుర్తు చేసింది.  అనుమతి లేని ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం సరైంది కాదని  కూడ తెలంగాణ సర్కార్ అభిప్రాయపడింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అంతకంతూ పెరుగుతున్నాయి. పదే పదే కేంద్రానికి రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Embed widget