అన్వేషించండి

NGT : సీమ ఎత్తిపోతలపై సెప్టెంబర్ 8న ఎన్జీటీ తీర్పు

సీమ ఎత్తిపోతల అంశంపై సెప్టెంబర్ 8న నిర్ణయం ప్రకటిస్తామని ఎన్జీటీ తెలిపింది. మరో వైపు ఏపీలోని వెలుగొండ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వవద్దని తెలంగాణ లేఖ రాసింది.


రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందో లేదో సెప్టెంబర్ 8వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ చెన్నై బెంచ్ తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నై NGT ధర్మాసనం విచారణ జరిపింది. ప్రాజెక్టు పనులపై స్టే ఉన్పన్పటికీ ఎపీ ప్రభుత్వం నిర్మిస్తోందని శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ శాఖతో పాటు కృష్ణాబోర్డును ఎన్జీటీ ఆదేశించింది. అనేక వాయిదాల తర్వాత ఇటీవల ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి ఎన్జీటీకి కేఆర్ఎంబీ కమిటీ నివేదిక సమర్పించింది. 

కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత తీర్పు 

అదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో జరిగిన పనుల వల్ల ఎలాంటి పర్యావరణ ప్రభావం ఉంటుందో చెప్పాలని కేంద్ర పర్యావరణ శాఖను కేంద్రం ఆదేశించింది.   నివేదిక ఇచ్చేందుకు సమయం కావాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు సెప్టెంబర్ 8వ తేదీ వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీటీ తెలిపింది. సెప్టెంబర్ 8వ తేదీన అన్ని అంశాలు పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. పనులు జరిగినట్లుగా ఉంటే ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామని గతంలోనే ఎన్జీటీ హెచ్చరించింది. గతంలో కోర్టు ధిక్కరణ కింద ఎవరికైనా శిక్షలు వేశారా అన్న అంశంపై వివరాలు సమర్పించాలని ఎన్జీటీ పిటిషనర్లను ఆదేశించింది. 

పనులు చేపట్టలేదని మరోసారి ఏపీ సర్కార్ అఫిడవిట్ 

అయితే ఈ లోపు ఏపీ ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. అక్కడ జరిగిన పనులు  సెంట్రల్ వాటర్ కమిషన్ అనుతుల కోసం అవసరమైనవి మాత్రమేనని తెలిపింది.ఆ ప్రదేశంలో యంత్రాలు లేవని, కార్మికులు కూడా లేరని పనులేమీ జరగడం లేదనితెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రధాన ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు జాయింట్‌ కమిటీ పేర్కొనలేదని ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ట్రైబ్యునల్‌ను ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరపు న్యాయవాది తోసిపుచ్చారు. నివేదికను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. 

వెలుగొండకు నిధులివ్వవద్దని తెలంగాణ లేఖ

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోని వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులు కేటాయింపుపై పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగా ప్రభుత్వం లేఖ రాసింది.  వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవనితె...కేంద్రం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో కూడ ఈ ప్రాజెక్టును నోటిఫై చేయలేదని కూడ తెలంగాణ సర్కార్ గుర్తు చేసింది.  అనుమతి లేని ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడం సరైంది కాదని  కూడ తెలంగాణ సర్కార్ అభిప్రాయపడింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అంతకంతూ పెరుగుతున్నాయి. పదే పదే కేంద్రానికి రెండు రాష్ట్రాలు లేఖలు రాస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget