అన్వేషించండి

YSRCP: చంద్రబాబు భవిష్యత్ భయంకరంగా ఉంటుంది- వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక 

YSRCP :ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మారకపోతే భవిష్యత్ భయంకరంగా ఉంటుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీన్ని చంద్రబాబే మొదలు పెట్టారని ఆరోపించారు. 

YSRCP Leader Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రశ్నించే వారందర్నీ జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని సజ్జల రామకృష్ణరెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని సజ్జల ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. రాజకీయ పగతోనే నేతలపై వరుస పెట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా కల్పిత కథనాలతో అలాంటి కేసే కాకాణిపై పెట్టారని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన ఎవరూ భయపడిపోరని సజ్జల చెప్పుకొచ్చారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా మరింత రాటుతేలుతారని చెప్పుకొచ్చారు. 

వైఎస్సార్‌సీపీలో ఉండే సీనియర్‌ నేతలను టార్గెట్‌ చేస్తారని తమకు ముందే తెలుసుఅన్నారు సజ్జల. తాము కూడా అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని జైలుకు వెళ్లడానికి రెడీ అన్నారు. ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసి సిస్టమ్‌ను తప్పుదారి పట్టించి చేపట్టే ప్రక్రియ బాగాలేదన్నారు. అరెస్టు అనేది అల్టిమేట్‌ అని అన్నారు సజ్జల. కానీ అరెస్టు చేసిన తర్వాత కేసును పుటప్ చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు చేస్తున్న చర్యలు తిరిగి ఆయన మెడకు చుట్టుకుంటాయని హెచ్చరించారు సజ్జల. కచ్చితంగా దీనికి ఫలితం భయంకరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి సిస్టమ్ దారి తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చట్టాన్ని ఎవరూ చేతులోకి తీసుకోలేదని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు అందర్నీ సాక్ష్యాలతోనే అరెస్టు చేశామని గుర్తు చేశారు. ఇలా చేయాలనుకుంటే గెలిచిన మూడు నెలలకే చంద్రబాబును జైల్లో పెట్టే వాళ్లమని వ్యాఖ్యానించారు.  

మొదటి నుంచి చెబుతున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు సజ్జల. తమకు సపోర్ట్ చేసే మీడియాలో కథనాలు రాయించడం, తర్వాత వాటి ఆధారంగా కేసులు పెట్టి ఎవరితోనో చెప్పించి కీలక నేతలను అరెస్టు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్‌గానే పోలీసులు ప్రజలను కొడుతున్నారని తెలిపారు. సామాన్యులు భయపడిపోతున్నారని వివరించారు.  

చంద్రబాబు తన రాజకీయ ఉనికి లేకుండా చేసుకుంటున్నారని అన్నారు సజ్జల. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వంపై చూడలేదని అన్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
Advertisement

వీడియోలు

Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DCC Presidents: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు 6 నెలలే పదవి కాలం - పని చేయకపోతే ఊస్టింగ్ - రేవంత్ రెడ్డి వ్యూహం
Lok Bhavan: రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
రాజ్ భవన్ కాదు లోక్ భవన్.. పీఎంవో కాదు ఇక సేవా తీర్థ్ - పేర్లు మార్చిన కేంద్రం
Pakistan:శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
శ్రీలంకకు సాయంగా గడువు తీరిన ఆహారపు పొట్లాలు - పాకిస్తాన్ కక్కుర్తి - పరువు తీస్తున్న నెటిజన్లు
HILTP Land Scam: హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హిల్ట్‌ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
8th Pay Commission: 8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
8వ పే కమిషన్‌ అమలుకు ముందే DA, DR విలీనంపై కేంద్ర కీలక ప్రకటన..
Kantara Chapter 1 Review : 'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
'కాంతార'పై కామెడీ కామెంట్స్ - ఎట్టకేలకు సారీ చెప్పిన బాలీవుడ్ హీరో రణవీర్
Ravi Teja: రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
రవితేజ సినిమాలో హీరోయిన్స్ గోల... క్లారిటీ ఇచ్చిన మాస్‌ మహారాజా టీమ్
Eluru Railway Station: ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
ఫొటో చూసి గుడి అనుకున్నారా.. ఇది ఏలూరు రైల్వే స్టేషన్, వినూత్న డిజైన్‌తో నిర్మాణం
Embed widget