అన్వేషించండి

నాసిరకం బొగ్గుతో పవర్ ప్రాజెక్ట్ ప్రాణం తీశారు:సోమిరెడ్డి

పాలించండి అని ప్రజలు అధికారం ఇస్తే ప్రతిష్టాత్మక ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

పాలించండి అని ప్రజలు అధికారం ఇస్తే ప్రతిష్టాత్మక ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేటుపరం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టును నడపడం చేతకాదని సీఎం జగన్ ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. లాభాలతో నడిపేందుకు ఉద్యోగులే సిద్ధంగా ఉన్నారని, వారికే బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. నష్టాలను సాకుగా చూపి పవర్ ప్రాజెక్ట్ ని, అదానీకి అప్పగించే కుట్రలో భాగంగానే విజయసాయి రెడ్డి కంపెనీలతో 9 లక్షల టన్నుల నాసిరకమైన బొగ్గు సరఫరా చేశారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కంపెనీకి నష్టాలు తెచ్చారని అన్నారు సోమిరెడ్డి.

ప్రైవేటుకు అప్పగించే టెండర్ ప్రక్రియను ఉపసంహరించుకోవడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి. వేలాది మంది త్యాగంతో వచ్చిన ప్రాజెక్టు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళుతుంటే స్థానిక మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి పట్టనట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టును అదానీ గ్రూపుకి అప్పగించడానికి ఈనెల 22వ తేదీన టెండర్లు పిలుస్తున్నారని, ఆన్ లైన్ లో ఎవరు టెండర్ దాఖలు చేసినా ఒక్క అదానీ కంపెనీయే క్వాలిఫై అవుతుందనేది నగ్నసత్యం అని చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి. జగనన్న రాజ్యంలో ఆయన్ని కాదని ఎవరూ ధైర్యం చేసే టెండర్ వేసే ప్రసక్తే లేదని చెప్పారు. అదానీతో జగనన్నకు ఇప్పటికే ఒప్పందం జరిగిపోయిందని సెటైర్లు వేశారు.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రైవేటు చేతుల్లోకి వెళుతుంటే సర్వేపల్లి ఫ్రజల ఓట్లతో గెలిచి మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి పట్టకపోవడం దురదృష్టకరం అని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. వేల మంది నిర్వాసితుల త్యాగం గురించి ఒక్క క్షణం ఆలోచించే తీరికకూడా ఆయనకు లేకుండా పోయిందన్నారు. 22న టెండర్లు పిలవడాన్ని జెన్ కో పరిరక్షణ కమిటీ, ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. 300 రోజులకు పైగా ఉద్యోగులు, కార్మికులు నిరంతర పోరాటం సాగిస్తుంటే జగనన్న మాత్రం అదానీకే అంకితం చేస్తానంటున్నాడని మండిపడ్డారు. నేలటూరు ప్లాంటును అదానీ పరం చేసే టెండర్ల ప్రైవేటు ప్రక్రియను ఉపసంహరించుకోవాలన్నారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇక్కడ జెన్ కో ను ప్రైవేటు పరం చేయడం అన్యాయం అని అన్నారు సోమిరెడ్డి.

350 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఏడేళ్లుగా రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికి  మాట నిలబెట్టుకోలేదని, మళ్లీ ఇప్పుడు 150 ఉద్యోగాలు ఇస్తామని జగన్ అంటున్నారని, అంటే.. ఉండే వాళ్లని రెగ్యులర్ చేస్తారా లేక కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తారో క్లారిటీ లేదని చెప్పారు సోమిరెడ్డి. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన వారిని పక్కనపెట్టి 39 మంది పులివెందుల వాళ్లకి జీఓ 163 ప్రకారం రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులివ్వడం దారుణం అని అన్నారు.

సీఎం జగన్ తీరుతో ఆర్టీపీపీ, వీటీపీఎస్, జెన్ కో ఉద్యోగులందరూ తిరగబడే పరిస్థితి నెలకొందని అన్నారు. రెగ్యులర్ అయిన 39 మంది పులివెందుల వాసులు త్యాగమూర్తులా అన ప్రశ్నించారు. మిగతా వారందర్నీ నిర్లక్ష్యం చేసి వారినెలా రెగ్యులర్ చేస్తారన్నారు. పులివెందుల వారితో పాటు 1100 మందిని రెగ్యులర్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు సోమిరెడ్డి. ఓడరేవుతో పాటు అన్ని వసతులు కలిసిన దేశంలోని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ను నిర్వహించడం చేతకాదని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే తాము ఆదాయం తెచ్చి చూపిస్తామన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget