అన్వేషించండి

నాసిరకం బొగ్గుతో పవర్ ప్రాజెక్ట్ ప్రాణం తీశారు:సోమిరెడ్డి

పాలించండి అని ప్రజలు అధికారం ఇస్తే ప్రతిష్టాత్మక ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

పాలించండి అని ప్రజలు అధికారం ఇస్తే ప్రతిష్టాత్మక ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేటుపరం చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టును నడపడం చేతకాదని సీఎం జగన్ ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. లాభాలతో నడిపేందుకు ఉద్యోగులే సిద్ధంగా ఉన్నారని, వారికే బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. నష్టాలను సాకుగా చూపి పవర్ ప్రాజెక్ట్ ని, అదానీకి అప్పగించే కుట్రలో భాగంగానే విజయసాయి రెడ్డి కంపెనీలతో 9 లక్షల టన్నుల నాసిరకమైన బొగ్గు సరఫరా చేశారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే కంపెనీకి నష్టాలు తెచ్చారని అన్నారు సోమిరెడ్డి.

ప్రైవేటుకు అప్పగించే టెండర్ ప్రక్రియను ఉపసంహరించుకోవడంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి. వేలాది మంది త్యాగంతో వచ్చిన ప్రాజెక్టు ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళుతుంటే స్థానిక మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి పట్టనట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టును అదానీ గ్రూపుకి అప్పగించడానికి ఈనెల 22వ తేదీన టెండర్లు పిలుస్తున్నారని, ఆన్ లైన్ లో ఎవరు టెండర్ దాఖలు చేసినా ఒక్క అదానీ కంపెనీయే క్వాలిఫై అవుతుందనేది నగ్నసత్యం అని చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి. జగనన్న రాజ్యంలో ఆయన్ని కాదని ఎవరూ ధైర్యం చేసే టెండర్ వేసే ప్రసక్తే లేదని చెప్పారు. అదానీతో జగనన్నకు ఇప్పటికే ఒప్పందం జరిగిపోయిందని సెటైర్లు వేశారు.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రైవేటు చేతుల్లోకి వెళుతుంటే సర్వేపల్లి ఫ్రజల ఓట్లతో గెలిచి మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి పట్టకపోవడం దురదృష్టకరం అని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. వేల మంది నిర్వాసితుల త్యాగం గురించి ఒక్క క్షణం ఆలోచించే తీరికకూడా ఆయనకు లేకుండా పోయిందన్నారు. 22న టెండర్లు పిలవడాన్ని జెన్ కో పరిరక్షణ కమిటీ, ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. 300 రోజులకు పైగా ఉద్యోగులు, కార్మికులు నిరంతర పోరాటం సాగిస్తుంటే జగనన్న మాత్రం అదానీకే అంకితం చేస్తానంటున్నాడని మండిపడ్డారు. నేలటూరు ప్లాంటును అదానీ పరం చేసే టెండర్ల ప్రైవేటు ప్రక్రియను ఉపసంహరించుకోవాలన్నారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇక్కడ జెన్ కో ను ప్రైవేటు పరం చేయడం అన్యాయం అని అన్నారు సోమిరెడ్డి.

350 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఏడేళ్లుగా రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికి  మాట నిలబెట్టుకోలేదని, మళ్లీ ఇప్పుడు 150 ఉద్యోగాలు ఇస్తామని జగన్ అంటున్నారని, అంటే.. ఉండే వాళ్లని రెగ్యులర్ చేస్తారా లేక కొత్తగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తారో క్లారిటీ లేదని చెప్పారు సోమిరెడ్డి. ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన వారిని పక్కనపెట్టి 39 మంది పులివెందుల వాళ్లకి జీఓ 163 ప్రకారం రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులివ్వడం దారుణం అని అన్నారు.

సీఎం జగన్ తీరుతో ఆర్టీపీపీ, వీటీపీఎస్, జెన్ కో ఉద్యోగులందరూ తిరగబడే పరిస్థితి నెలకొందని అన్నారు. రెగ్యులర్ అయిన 39 మంది పులివెందుల వాసులు త్యాగమూర్తులా అన ప్రశ్నించారు. మిగతా వారందర్నీ నిర్లక్ష్యం చేసి వారినెలా రెగ్యులర్ చేస్తారన్నారు. పులివెందుల వారితో పాటు 1100 మందిని రెగ్యులర్ చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు సోమిరెడ్డి. ఓడరేవుతో పాటు అన్ని వసతులు కలిసిన దేశంలోని సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ ను నిర్వహించడం చేతకాదని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే తాము ఆదాయం తెచ్చి చూపిస్తామన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget