అన్వేషించండి

Ysrcp Mp Avinash Reddy: ఆ మరక పోగొట్టుకునే ప్రయత్నాల్లో ఏపీ బీజేపీ, ఇప్పుడు రైతు సమస్యలపై ఫోకస్

ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు చూసి ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో జోష్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. చేరికలపైనా క్లారిటీతో ఉన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయంతో దేశవ్యాప్తంగా పార్టీ మంచి ఆనందంతో ఉంది. అధికారం లేని రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బలపడే దిశగా వేగంగా అడుగు వేస్తోంది. దీని కోసం స్పెషల్ ప్లాన్‌తో ఉన్నట్టు స్థానిక నాయకత్వం చెబుతోంది. 

దీటుగా సమాధానం

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం కైవసం చేసుకుంటామని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర పథకాలను తమవిగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతోంది ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ. 

మారిన వ్యూహం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వా మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... వైసీపీ ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లాలనే అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తామన్నారు. కేంద్రం పథకాలను వైసీపీ తమ విజయంగా చెప్పుకుంటోందనేది ఆయన ప్రధాన ఆరోపణ. అదే సమయంలో కేంద్రంపై మాత్రం రాష్ట్రం నిందలు వేస్తోందని అన్నారు. రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటోందన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వలసలు పెరిగి పోతున్నాయని విమర్శించారు.

రైతులపై ఫోకస్

రైతాంగ సమస్యలపై కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించబోతున్నట్టు తెలిపారు సోము వీర్రాజు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వచ్చి సమయంలో కేంద్రం వేసే రోడ్లను తామే వేస్తున్నట్లు వైసీపీ తమ సొంత పత్రికలో రాసుకుందని వీర్రాజు ఆరోపించారు. అబద్ధాలతో ఆంధ్ర రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తులు, కుటుంబాలకు బీజేపీ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారాయన. 

అవినాష్ అక్కర్లేదు

ఏపీలోని రాజకీయ పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు జోటు చేసుకున్నాయి. వివేకా కుమార్తె సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అంటూ ప్రముఖంగా కథనాలు వచ్చాయి. వివేకా హత్య కేసుని సీబీఐకి అప్పగిస్తే.. అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతారంటూ వైఎస్ జగన్ సునీతకు చెప్పినట్టు ఆ కథనాల సారాంశం. దీనిపై సోమువీర్రాజు ఘాటుగా స్పందించారు. అసలు అవినాష్ రెడ్డి లాంటి వారు బీజేపీకి అవసరం లేదని అన్నారు సోము వీర్రాజు. అసలాయన బీజేపీలో చేరతారని ఎవరితో అన్నారు, ఎందుకన్నారు, విన్నవారు దాన్ని ఎవరితో చెప్పారంటూ నిలదీశారు. 

మరక చెరిపేందుకు యత్నం

ఇటీవల వైఎస్ వివేకా హత్యకేసుకి సంబంధించి వైఎస్ఆర్ కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినమాట తెలిసిందే. ఈ కేసులో సీఎం జగన్ ని, ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేయాలని చూస్తోంది టీడీపీ. అదే సమయంలో అవినాష్ రెడ్డిపై కేసు పెడితే ఆయన బీజేపీలోకి వెళ్తారని గతంలో జగన్ వివేకా కుమార్తె సునీతతో చెప్పినట్టు కూడా కథనాలొచ్చాయి. అంటే.. కేసులున్నవారంతా బీజేపీ శరణు కోరతారనే అర్థం వచ్చేలా కమలం పార్టీపై మరకపడింది. గతంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన రాజ్యసభ సభ్యులు కూడా అదే తరహాలో బీజేపీలో చేరారనే అపవాదు కూడా ఆ పార్టీపై ఉంది. దీంతో.. అవినాష్ రెడ్డి విషయంలో రాష్ట్ర  బీజేపీ ఎదురుదాడికి దిగింది. అవినాష్ రెడ్డి తమకు అక్కర్లేదని అంటూనే.. వైసీపీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. టీడీపీ, వైసీపీ పరస్పర విమర్శలు చేసుకుంటూంటే అంతిమ ఫలితం ఎలా ఉన్నా.. అది తమకు లాభిస్తుందనది ఆశపడుతోంది బీజేపీ. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Markapuram Road Accident: పడుకున్న చోటే మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు! మార్కాపురం జిల్లా ప్రమాదంపై విస్తుపోయే వాస్తవాలు!
పడుకున్న చోటే మాంసం ముద్దలుగా మారిన ప్రయాణికులు! మార్కాపురం జిల్లా ప్రమాదంపై విస్తుపోయే వాస్తవాలు!
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget