High tension Penna boat: పెన్నా సంగం బ్యారేజీకు బోటు గండం - సాహసోపేతంగా ప్రమాదం నివారణ - అసలేం జరిగిందంటే ?
Sangam Barrage: నెల్లూరు పెన్నా నది మీద సంగం బ్యారేజీ తృటిలో పెను విపత్తు తప్పించుకుంది. వరదలో కొట్టుకొచ్చిన భారీ బోటును సమర్థవంతంగా అధికారులు ఒడ్డుకు చేర్చారు.

Penna River in Nellore Sangam Barrage: కృష్ణానదికి భారీగా వరదలు వచ్చినప్పుడు కొన్ని బోట్లు కొట్టుకు వచ్చి బ్యారేజీ గేట్లకు అడ్డం పడటం చాలా సార్లు జరిగాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెల్లూరు లోని పెన్నా సంగం బ్యారేజీకి వచ్చింది. ఓ భారీ ఇసుక బోటు లంగర్ తెగిపోయి డ్యాం వైపు దూసుకు వచ్చింది. ఆ బోటు డ్యాం గేట్లకు తాకి ఉన్నట్లయితే పెను ప్రమాదం జరిగి ఉండేది. కానీ అధికారులు ఈ ప్రమాదాన్ని గుర్తించి వెంటే..బోటును ఒడ్డుకు చేర్చారు.
నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద బోటు ప్రజల్ని, రైతుల్ని టెన్షన్ పెట్టింది. మోంథా తుపాను వల్ల అత్యధిక వర్షం పడిన ప్రాంతాల్లో నెల్లూరు ఒకటి. ఈ కారణంగా పెన్నా నదిలో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో, 30 టన్నుల బరువున్న ఇసుక బోటు, లంగరు తెగిపోయి, నేరుగా బ్యారేజీ గేట్లను ఢీకొట్టడానికి దూసుకొచ్చింది.
పోటెత్తే వరద ఉద్ధృతికి, ఒకవేళ ఆ భారీ బోటు బ్యారేజీకి తగిలి ఉంటే 85 గేట్లతో నిర్మితమైన సంగం బ్యారేజీ భారీగా దెబ్బతినేది. దాదాపుగా నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు దెబ్బతింటే ఎంత నష్టం జరిగేదో అంచనా వేయాల్సిన పని లేదు. రాబోయే సీజన్లో రైతులు కన్నీరు కార్చేవారు. పొదలకూరు, సంగం వంటి కీలక గ్రామాల మధ్య రాకపోకలకు వారధిగా నిలిచే ఈ బ్యారేజీ దెబ్బతింటే పునరుద్ధరణ కూడా చాలా సమస్య అయ్యేది.
*సంగం బ్యారేజ్ కు తప్పిన ముప్పు*
— MC RAJ🕊️ (@BeingMcking_) October 30, 2025
హ్యాట్సాఫ్ టు టీమ్ ఏపీ.
‘మొంథా' ప్రకోపం: సుడులు తిరిగిన పెన్నా... సంగం బ్యారేజీ రెస్క్యూ కథనం!
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సంగం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన యావత్ జిల్లా రైతాంగాన్ని, ప్రజలను ఉత్కంఠలో ముంచెత్తింది. మోంతా తుఫాను (1/n) pic.twitter.com/ATw4c2o1T8
బోటు గురించి తెలియగానే, జిల్లా యంత్రాంగం క్షణం కూడా ఆలస్యం చేయలేదు. కలెక్టర్ హిమాన్షు శుక్లా , ఎస్పీ అజిత వజ్రేంద్ర ఆఘమేఘాలపై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి 30 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని.. 30 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించారు. పెన్నా నది ప్రవాహానికి ఎదురొడ్డి, ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. ఆ బోటు బ్యారేజీ వైపుకు దూసుకెళ్లే సమయంలోనే అడ్డుకుని చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు!
అధికారుల సమయస్ఫూర్తిని నారా లోకేష్ కూడా అభినందించారు.
#TeamAPInAction #CycloneMontha
— Lokesh Nara (@naralokesh) October 30, 2025
నెల్లూరు జిల్లా, సంగం బ్యారేజీ వద్దకు లంగరు తెగిపోయిన 30 టన్నుల బరువున్న ఇసుక బోటు గేట్ల వరకూ వచ్చింది. బ్యారేజీ నీటి నిల్వకు తోడు మొంథా తుఫాన్ వరద పోటెత్తింది. భారీ బోటు బ్యారేజీ గేట్లకు తగిలి ఉంటే భారీ డ్యామేజీ జరిగేది. సమాచారం అందుకున్న… pic.twitter.com/Qow7NMd0aY
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















