Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో కారును ఢీకొట్టి లాక్కెళ్లిన టిప్పర్.. చిన్నారి సహా ఏడుగురు మృతి
నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ రాంగ్ రూట్ లో దూసుకొచ్చి కారును ఢీకొట్టి లాక్కెళ్లిన ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు మృతిచెందారు.

Road Accident on national High way in Nellore district | సంగం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఓ టిప్పర్ వేగంగా దూసుకువచ్చి ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. టిప్పర్ రాంగ్ రూట్లో వేగంగా దూసుకురావడంతో పాటు కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లింది. ఈ క్రమంలో కారు టిప్పర్ కింద చిక్కుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారి మృతదేహాలు తీవ్రంగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ కారు నెల్లూరు నుండి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసులు చేరుకొని స్థానికుల సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా పెరమన ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి: నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఒక టిప్పర్ కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.బాధిత కుటుంబాలకు తమ అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించడానికి అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ ప్రమాదంపై స్పందించిన చంద్రబాబు, ఇది దురదృష్టకరమైన సంఘటన అన్నారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. భగవంతుడు ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యం కలిగించాలని ప్రార్థించారు. ఈ విధంగా, రోడ్డు ప్రమాదాలకు కారణమైన వ్యక్తులకు న్యాయపరమైన చర్యలు తప్పనిసరి అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల భద్రత పై మరింత శ్రద్ధ పెట్టాలని, రోడ్డు రక్షణ వ్యవస్థలు, సురక్షిత వాహన మార్గాలు, రహదారులలో ఏర్పడే ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Before You Go
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
ట్రెండింగ్ వార్తలు























