అన్వేషించండి

Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?

Karedu Farmers Protests: కరేడు గ్రామం లో ఏం జరుగుతోంది.. అక్కడి ప్రజలు ఎందుకు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ విషయాలు ఎందుకు అంతగా బయటకు రావడం లేదు.

Karedu Farmers Protests: కందుకూరు, సింగరాయకొండ సమీపంలోని కరేడు గ్రామం మండుతోంది. సారవంతమైన భూములు ఒక కంపెనీకి కట్టబెడతామంటే ఊరుకోబోమంటూ అక్కడి రైతులు రోడ్డెక్కారు. బంగారం పండే తమ భూములను వదిలి తామెక్కడకి పోవాలనేది వారి ప్రశ్న. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆక్కడి ప్రజలు ఇటీవల హైవే దిగ్బంధం చేయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, BYC పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు.

అసలు వివాదం ఏమిటి?
"కరేడు" గ్రామం ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పలువురు ఎనలిస్ట్‌లు, గ్రామ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం గత వైసీపీ హయాంలో ఇండిసోల్ అనే కంపెనీ కోసం పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 5000 ఎకరాల భూమిని రామాయపట్నం పోర్టు సమీపంలో కేటాయించింది. అది జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ అని ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పజెబుతున్నారు అంటూ వామపక్షాలు, ప్రజలు ఆరోపించారు. 2024 ఎన్నికల ముందు ఆ భూ కేటాయింపులను మరింత పెంచారు. 


Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?

యువగళం పాదయాత్రలో భాగంగా పర్యటనకు వచ్చిన లోకేష్ ఆ సంస్థ జగన్ సన్నిహితులదే అని విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ భూసేకరణ ఆపేస్తారని అనుకున్నామని కానీ ఆలా జరగలేదు అని గ్రామస్తులు అంటున్నారు. రామాయపట్నం సమీపంలో జగన్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బీపీసీయెల్ రిఫైనరీ కోసం వెనక్కి తీసుకున్నారు. దానికి బదులు 'కరేడు' గ్రామం దగ్గర 8000 ఎకరాలపైగా భూమిని ఇండో సోల్ కంపెనీకి కేటాయించడం వివాదాస్పదమైందని అంటున్నారు వామపక్షాల నేతలు. 


Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?

"అప్పుడు జగన్, ఇప్పుడు కూటమి కేటాయించిన భూములు అత్యంత విలువైనవని చెబుతున్నారు రైతులు. "రెండేసి పంటలు పండించే భూమి. కాస్త లోతుగా తవ్వితే చాలు నీరు పడే సారవంతమైన భూములు. ప్రైవేటు కంపెనీకి కేటాయించడం ఏంటి. ఇదే ప్రాంతంలో ఎన్నో అప్‌ల్యాండ్ లేదా డ్రైల్యాండ్‌ను పరిశ్రమకు కేటాయించాలి. తమ భూముల్ని మాత్రం వదిలేయాలి" అని కరేడు గ్రామస్తుడు వెంకటేశ్వర్లు అంటున్నారు. 

కరేడు గ్రామానికి చెందిన భూములు వదిలేయాలని నేషనల్ హైవేని దిగ్బంధించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పి తాత్కాలికంగా ఆందోళన అదుపు చేయగలిగారు. ప్రస్తుతానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ రైతులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. "ఈ భూ కేటాయింపు వల్ల అటు ఇటుగా పదివేల మందికిపైగానే ప్రభావితం అవుతారు. ముందస్తుగా 4వేల ఎకరాల సేకరణకు రాత్రికి రాత్రి నోటిఫికేషన్ ఇచ్చారు" అని ఉద్యమ నాయకుడు మిరియం శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?

ఇలా రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఇవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ భూ సేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆందోళన ప్రభావం కందుకూరు నియోజకవర్గంతోపాటు కొండేపి,కావలి లాంటి కీలక నియోజకవర్గాలపైనా పడే అవకాశం ఉందని ఎనలిస్ట్‌లు అంటున్నారు.


Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?

అప్పట్లో భూకేటాయింపులు చేసిన వైసిపిగానీ, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్న కూటమిగాని ఈ వివాదంపై నోరుమెదకపోవడం ఏంటని వైఎస్ షర్మిల, రామచంద్ర యాదవ్ లాంటి రాజకీయవేత్తలు విమర్శలు చేస్తున్నారు.


Karedu Farmers Protests: నెల్లూరు జిల్లా కరేడులో ఏం జరుగుతోంది? రైతుల ఆందోళనలు ఎందుకు బయటకు రావడంలేదు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!  
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Telangana DCA: ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే ఇంత ప్రమాదమా! ఈ వార్త చదివితే మీరు ఆ తప్పు చేయరు!
India vs New Zealand First T20: న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టీ 20 మ్యాచ్‌లో భారత్ విజయం, 48 పరుగుల తేడాతో విక్టరీ!
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Abhishek Sharma : అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
అభిషేక్‌ శర్మ ధమాకా! యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్‌! భారత్ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ ఇవే!
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
Embed widget