అన్వేషించండి

TDP Mahanadu:నెల్లూరు నుంచి మంగళగిరికి మహానాడు షిఫ్ట్‌... బాబు ప్లాన్ రివర్స్‌? టీడీపీలో వర్గపోరుకు చెక్ పడేనా!

TDP Mahanadu:ప్రధాని ఇచ్చిన పొదుపు చర్యల పిలుపులో భాగంగా నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇది నెల్లూరు జిల్లాలో అమలు చేయాల్సిన వ్యూహానికి దెబ్బ తగిలింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు రద్దు, మంగళగిరిలో హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహణ.
  • నెల్లూరు టీడీపీలో వర్గపోరు, నేతల మధ్య సయోధ్య లేకపోవడం సమస్యగా మారింది.
  • లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తొలి మహానాడు, గత రికార్డులను బద్దలుకొట్టే ప్రణాళిక.

TDP Mahanadu: నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు  ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యల్లో భాగంగా  క్యాన్సిల్ అయిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే మహానాడును  హైబ్రిడ్ పద్ధతుల్లో  మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో తక్కువ మంది సభ్యులతో జరుపబోతున్నారు. మరీ విపరీతమైన ఆర్భాటాలు లేకుండా ఈసారి మహానాడు జరగబోతోంది. అంతా ఓకే కానీ నెల్లూరులో జరగాల్సిన మహానాడు క్యాన్సిల్ కావడం మాత్రం  అక్కడ టిడిపిలో నెలకొన్న వర్గ పోరును  పరిష్కరించే ఛాన్స్ లేకుండా చేసింది అనే వాదన వినబడుతోంది.

నెల్లూరు టీడీపీలో ఎవరి వర్గం వారిదే..!

చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూటమి రాష్ట్రవ్యాప్తంగా బలంగానే ఉంది. కొన్నిచోట్ల టిడిపి జనసేన  నేతల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ చెయ్యి దాటిపోయి పరిస్థితి అయితే లేదు. కానీ నెల్లూరులో పరిస్థితి వేరు. అక్కడ టీడీపీ నేతల్లోనే సామరస్యం చాలా తక్కువ. కారణం చాలా శక్తివంతమైన లీడర్లందరూ ఆ జిల్లాలోనే ఉండడం. మంత్రి నారాయణ, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, అనం ఫ్యామిలీ, వేమూరి కుటుంబం, సోమిరెడ్డి ఇలా బలమైన లీడర్లు అందరూ అక్కడే ఉండడం  కూటమి అబ్స్ ల్యూట్ మెజారిటీలో ఉండడంతో  అక్కడ పైచేయి కోసం ఎవరికి వారు  తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న నేతలు 

  • పి. నారాయణ- మంత్రి
  • ఆనం రామనారాయణ రెడ్డి ఫ్యామిలి
  • కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 
  • వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం 
  • సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి  

నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా వారి వారి అనుచరుల ముద్రతో కుర్ర కారు చేస్తున్న హల్చల్  సోషల్ మీడియా పోస్టుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికీ సీఎం చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టి ఒకటికి  రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు. గతంలో నెల్లూరులో పదికి పది సీట్లు సాధించిన వైసిపి 2024 ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో తమకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం టిడిపి అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా స్థానిక అగ్రనేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టడం కోసం, నేతల మధ్య సామరస్యం తేవడం కోసం మహానాడును శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి షిఫ్ట్ చేశారు అనే ప్రచారం ఉంది.

మహానాడు ఏర్పాట్లలో కచ్చితంగా అక్కడ స్థానిక నేతలు అందరూ కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వారందరినీ ఒకే తాటిపైకి  తేవడానికి ఇదో మంచి అవకాశం అని టిడిపి అధిష్టానం భావించింది. కానీ ఇప్పుడు సడన్‌గా  మహానాడుని మంగళగిరికి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో  టోటల్ సీన్ మారిపోయింది. 

లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతోన్న తొలిమహానాడు 

టిడిపిలో నాయకత్వ మార్పు నెమ్మదిగా జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఒక్కో విభాగం నారా లోకేష్ టీమ్ చేతిలోకి వచ్చేస్తోంది.  ఇప్పుడాయన ఏకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. అందుకే ఈసారి జరిగే మహానాడు సూపర్ సక్సెస్ కావాలని టిడిపి ప్లాన్ చేసింది. గతంలో జరిగిన కడప మహానాడులో ఏకంగా 5 లక్షల మందితో  బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈసారి ఆ రికార్డు బద్దలు కొట్టాలని భావించింది టిడిపి .

అందుకే మహానాడును నెల్లూరుని వేదికగా ఎంచుకుంది. కీలక నేతలు అందరూ అక్కడే ఉండడంతో సభ సక్సెస్ చేయడం ఈజీ అలానే వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించడమూ ఈజీ అని టిడిపి అధిష్టానం అనుకుంది. కానీ మోదీ పొదుపు పిలుపు కారణంగా మహానాడు నెల్లూరు నుంచి మంగళగిరికి షిఫ్ట్ కావడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మరి నెల్లూరులో సీనియర్ నేతల మధ్య నెలకొన్న వర్గ పోరును టిడిపి ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

Frequently Asked Questions

టీడీపీ మహానాడు ఎందుకు రద్దు చేయబడింది?

ప్రధాని మోదీ ఇచ్చిన పొదుపు చర్యల కారణంగా నెల్లూరులో జరగాల్సిన టీడీపీ మహానాడు రద్దు చేయబడింది.

కొత్త మహానాడు ఎక్కడ, ఎలా జరగనుంది?

ప్రస్తుతం మహానాడును మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో హైబ్రిడ్ పద్ధతుల్లో, తక్కువ మంది సభ్యులతో జరుపబోతున్నారు.

నెల్లూరులో మహానాడు రద్దు అవ్వడం వల్ల ఏమైంది?

నెల్లూరులో మహానాడు రద్దు అవ్వడం వల్ల అక్కడ టీడీపీలో నెలకొన్న వర్గ పోరును పరిష్కరించే అవకాశం లేకుండా పోయింది.

నెల్లూరు టీడీపీలో వర్గ పోరుకు కారణమేంటి?

నెల్లూరులో చాలా శక్తివంతమైన నాయకులందరూ ఉండటం, పైచేయి కోసం తీవ్ర ప్రయత్నాలు చేయడం వల్ల టీడీపీ నేతల్లో సామరస్యం తక్కువగా ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget