అన్వేషించండి

Anil Kumar Yadav: ఒక్కరోజు బతికినా మగోడిలా బతకాల, బొమ్మిడాయిల పులుసు తీసుకోవడం కాదు - అనిల్ ఘాటు వ్యాఖ్యలు

నెల్లూరు సిటీలో అభివృద్ధి కుంటుపడిందని కొంత మంది జర్నలిస్టులు రాస్తున్నారని, అలాంటి వారు తన వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు.

ఆదివారం, ఆదివారం బొమ్మిడాయిల పులుసు తీసుకొచ్చి ఇస్తే చాలు, తనపై వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకరులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారికి, వారి వెనక ఉన్న వారికి తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. నెల్లూరు సిటీలో అభివృద్ధి కుంటుపడిందని కొంత మంది జర్నలిస్టులు రాస్తున్నారని, అలాంటి వారు తన వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. తన వెనక సీఎం జగన్ ఉన్నారని చెప్పారు. పదేళ్లుగా కుమ్ముతున్నారని, పొడుస్తున్నారని అయినా భయపడేది లేదని అనిల్ కుమార్ యాదవ్ తేల్చి చెప్పారు. తాను ఎప్పటికీ తలవంచేది లేదని చెప్పారు. ఒకరోజు బతికినా మగోడిలాగా బతకాలని సలహా ఇచ్చారు. ప్యాకేజీలు తీసుకుని వార్తలు రాసేవారికి తాను భయపడబోనని అన్నారు. 

ఏం పీక్కుంటారో పీక్కోండని అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరారు. ఇటీవల అయ్యప్ప మాలలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఆ సమయంలో ప్రతిపక్షాలని కానీ, మీడియాని కానీ ఎక్కడా పల్లెత్తు మాట అనలేదు. తాజాగా మాల తీసేసిన తర్వాత ఇప్పుడు ఫుల్ డోస్ ‌లో ఘాటుగా మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గడపగడపకు..

గురువారం నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ రైల్వే వీధి, జాఫర్ సాహెబ్ కాలువ కట్ట, పెద్దతోట, తదితర ప్రాంతాలలో అనీల్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. 72వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి  వివరిస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు బాగుండాలని నగర నియోజకవర్గంలోని డివిజన్ లలో దాదాపు 4 వేలకు పైగా చీరలు, దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు, అలాగే 200 మందికి పైగా రక్తదానం ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

రక్తదాన శిబిరం

రెండు రోజుల క్రితం సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్ వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులతో కలిసి కోటమిట్ట నుండి గాంధీ బొమ్మ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ వున్న దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజన్న భవన్ లో ఏర్పాటు చేసిన కేకు కటింగ్ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారితో కలిసి పాల్గొని కేకు కటింగ్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
Autonomous shipbuilding: నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
నెల్లూరులో డ్రైవర్లు అవసరం లేని నౌకల తయారీ కేంద్రం -అటానమస్ షిప్‌బిల్డింగ్ సెంటర్‌ ప్రత్యేకత ఇదే !
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget