అన్వేషించండి

ఎలక్ట్రిక్ స్కూటర్లు  మాకొద్దు బాబోయ్- ఉద్యోగులు పరార్- 14 మందే దరఖాస్తు

50వేలమంది ఉద్యోగులు ఉండగా, ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు కేవలం 14మాత్రమే. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీపై ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సులభ వాయిదా పద్దతుల్లో ఉద్యోగులందరికీ వాహన యోగం కలిగించాలని సీఎం జగన్ ఆలోచించారు. అనుకున్నదే తడవుగా వివిధ కంపెనీలతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వం తరపున రాయితీ ఇస్తారు, ఈఎంఐలకు భరోసా ఇస్తారు. ఉద్యోగులు కొన్నిసార్లు డౌన్ పేమెంట్ లేకుండానే వాహనం తీసుకుపోయే అవకాశం కూడా కలిగించారు. కానీ ఎక్కడా ఎవరూ ఆసక్తి చూపించడంలేదు.

నెల్లూరు పరిస్థితి చూస్తే..

నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు 50వేల మంది వరకు ఉంటారు. వీరంతా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్టుకు అర్హులే. వీరందరి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. నవంబర్ మొదటి వారంలో అర్హులంతా దరఖాస్తు చేయాలని, సులభ వాయిదా పద్దతుల్లో వాహనాలు ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అంత కనిష్టంగా దరఖాస్తులు రావడంతో అధికారులే షాకవుతున్నారు.

50వేలకు 14 దరఖాస్తులు..

50వేలమంది ఉద్యోగులు ఉండగా, ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు కేవలం 14మాత్రమే. ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఇప్పటికే అందరికీ వాహనాలు ఉన్నాయి. వాటిని పక్కనపెట్టి కొత్తగా ప్రభుత్వం వాహనాలు ఇస్తుంది కదా అని ఈఎంఐ భారం పెంచుకోలేక చాలామంది వెనకడుగేశారని అంటున్నారు.

భద్రత కూడా ప్రశ్నార్థకమే..

మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల చాలా రకాల కంపెనీల వాహనాలు చార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోయిన ఉదాహరణలున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలంటేనే ప్రజల్లో ఒకరకమైన అనాసక్తి ఏర్పడింది. ఈ దశలో ప్రభుత్వం సులభ వాయిదాలు అంటున్నా కూడా ఉద్యోగులెవరూ ముందుకు రావడంలేదు.

పేపర్ లెస్ విధానమే ఇబ్బందిగా మారిందా...?

ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం దరఖాస్తు చేసే ఉద్యోగులు అంతా ఆన్ లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. మోడళ్లను ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి, ఆ శాఖ అధికారి ఆమోదం, ఆ తర్వాత బ్యాంకు రుణం మంజూరు, దాని తర్వాత వాహనం డెలివరీ వరకు అన్ని దశలు పేపర్ లెస్ గా సాగాల్సిందే. దీనివల్లే చాలామంది దరఖాస్తుకి దూరంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మరింత ప్రచారం, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మరికొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా..?

కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, అన్నిటికంటే మించి వినియోగదారులపై ఇంధన కొనుగోలు భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈఎంఐ పద్ధతిలో వాహనాలు అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఏడు వాహన సంస్థలకు సంబంధించిన 17 రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని తీసుకునేందుకు 38 రకాల వాయిదాల పద్ధతిని ప్రభుత్వం డిజైన్ చేసింది. ఒక్కో ఉద్యోగికి వాహన రకాన్ని బట్టి నెలకు రూ. 4329 నుంచి రూ.2321 వరకు ఈఎంఐలు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అయితే ఎవరూ సుముఖత చూపకపోవడమే ఇక్కడ విశేషం.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Embed widget