అన్వేషించండి

Balineni Elections 2024: గిల్లితే గిల్లిచ్చుకునే రకం కాదు! వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని క్లారిటీ

Balineni Srinivasa Reddy: తనపై కొందరు కుట్రలు చేశారు, తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ.. వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేసిన బాలినేని, మరోసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన టాపిక్ తెరపైకి తెచ్చారు.

Balineni Srinivasa Reddy: 'బ్రో' సినిమా విడుదల తర్వాత ఎందుకో పోకిరి సినిమాలో 'గిల్లితే గిల్లిచ్చుకోవాలి'.. అనే డైలాగ్ ఏపీ రాజకీయాల్లో బాగా పాపులర్ అయింది. తనను దొంగచాటుగా గిల్లాలని మంత్రి అంబటి, గిల్లితే ఎవరూ గిల్లిచ్చుకోరు, తిరిగి గిల్లుతారంటూ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు పేల్చారు. ఇప్పుడు వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి కూడా పరోక్షంగా అదే డైలాగ్ కొట్టారు. ఇంతకుముందు తనపై కొందరు కుట్రలు చేశారు, తనపై తప్పుడు ప్రచారం చేశారంటూ.. వైవీ సుబ్బారెడ్డిని టార్గెట్ చేసిన బాలినేని, మరోసారి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన టాపిక్ తెరపైకి తెచ్చారు. ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో పోటీని ప్రస్తావించారు. 

నేను, నాతోపాటు మాగుంట..
"2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి నేనే పోటీ చేస్తాను. అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారు. కొంత మంది ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతున్నారు. వారిని, వారి మాటల్ని న‌మ్మొద్దు" అని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాలినేని అన్నారు. బాలినేని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

మధ్యలో ఎంపీ స్థానం ఎందుకు..?
తన గురించి తాను చెప్పుకుంటే పర్లేదు. మధ్యలో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని చెప్పడమే ఇక్కడ బాలినేని ఇచ్చిన ట్విస్ట్. ఇటీవలే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా తప్పించారు. ఆయన ఢిల్లీలో బిజీ అవుతారని అన్నారంతా. అంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైవీ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశముంది. దీంతో ముందుగానే బాలినేని ట్విస్ట్ ఇచ్చారు. 

మాగుంట సంగతేంటి..?
వాస్తవానికి ఇటీవల మద్యం కుంభకోణంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు అరెస్ట్ కావడంతో ఆయన పార్టీపై అలిగారని సమాచారం. వచ్చే దఫా ఆయన టీడీపీ టికెట్ పై పోటీ చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు టీటీడీ బాధ్యతలనుంచి వైవీని తప్పించడంతో ఆయన్ను ఒంగోలు తీసుకొస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఇష్టంలేని బాలినేని ముందుగానే ఓ మాటవేసి ఉంచారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం మాగుంట ఫ్యామిలీదేనన్నారు. 

తనని ఇబ్బంది పెట్టిన వైవీ సుబ్బారెడ్డిపై ఆగ్రహంతో ఉన్న బాలినేని, ఆయన ఒంగోలు వస్తాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేలా లేరు. అందుకే బాలినేని ముందుగానే ఒంగోలు పార్లమెంట్ స్థానంపై ప్రకటన చేశారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానంపై కూడా బాలినేని అలకతో ఉన్నారు. ఇన్ చార్జ్ పదవులు తనకు వద్దని గతంలోనే తేల్చి చెప్పారు. తాను ఒంగోలు అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతానన్నారు. ఓ దశలో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుతానికి బాలినేని  వైసీపీలోనే ఉన్నారు. ఉన్నారు కానీ ఇలా సొంత పార్టీనే ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. చివరకు సీఎం జగన్, బాలినేని వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో చూడాలి. ఒకవేళ మాగుంట చివరి నిమిషంలో వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరితే.. అక్కడ బాలినేనికి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఎంపీగా కచ్చితంగా వైవీని తీసుకొస్తారు. మాగుంట బయటకు వెళ్లకపోయినా సీఎం జగన్ తలచుకుంటే.. ఒంగోలుకి వైవీ వచ్చి తీరుతారు. ఈ రెండిటిలో ఏది జరిగినా బాలినేనికి ఇబ్బంది తప్పకపోవచ్చు. అందుకే వైవీ రావడం తనకు ఇష్టం లేదని ఆయన ముందుగానే తేల్చి చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget