అన్వేషించండి

Nellore News : ఎవరైనా జగన్ ఫొటో పెట్టుకునే గెలవాలి : మాజీ మంత్రి అనిల్ కుమార్

Nellore News : నెల్లూరు జిల్లాలో తాజా, మాజీ మంత్రుల బలప్రదర్శన ప్రశాంతంగానే ముగిసింది. అయితే మాజీ మంత్రి అనిల్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆ ఇద్దరి ఎమ్మెల్యేల పేర్లు తన సభలో ప్రస్తావించలేదని తెలుస్తోంది.

Nellore News : నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచీ టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజా, మాజీ మంత్రుల సభలతో ఇరువర్గాల్లో ఏం జరుగుతోందన్న చర్చ జోరుగా సాగింది. అధిష్టానం జోక్యంతో కాస్త తగ్గిన నేతలు పరస్పర విమర్శలకు దూరంగా ఉన్నారు. ఇద్దరూ నేతలు తమ అనుచరులు, కార్యకర్తలతో ప్రశాంతంగానే సభలు నిర్వహించారు. 

నాకు నేనే పోటీ : మాజీ మంత్రి అనిల్ 

నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అంటూనే మరోసారి ఉద్దేశ పూర్వకంగానే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు పక్కనపెట్టారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను మంత్రి పదవిలో ఉండగా సహకరించిన జిల్లా ఎమ్మెల్యేలందరికీ థ్యాంక్స్ అంటూనే కాకాణి గోవర్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి పేరెత్తలేదు. మిగతా అందరి పేర్లు చెప్పి మరీ వారికి ధన్యవాదాలు చెప్పారు. తాను మళ్లీ పూర్తి స్థాయిలో జనంలోకి వస్తానని, గడపగడపకీ వెళ్తానని చెప్పారు. తనకు అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతతో ఉంటానన్నారు. సీఎం జగన్ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పారు అనిల్. తాను బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకటే వర్గం అని, ఎవరైనా జగన్ ఫొటో పెట్టుకుని గెలవాల్సిందేనన్నారు అనిల్. నాకు నేనే పోటీ అని స్పష్టం చేశారు అనిల్. 2024లో గెలిచి తిరిగి మంత్రి పదవిలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు అనిల్. 

అనిల్ సభపై కాకాణి ఫస్ట్ రియాక్షన్ 

అందరూ అనుకున్నట్టుగానే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి ఎంట్రీ అదిరిపోయింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సభ, మంత్రి కాకాణి అభినందన ర్యాలీ ఒకేరోజు ఉండటం, ఇటీవల కాకాణిపై అనిల్ మాటల తూటాలు పేల్చడంతో ఈ వ్యవహారం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓ దశలో పార్టీ హైకమాండ్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందనే వార్తలొచ్చాయి. అయితే మంత్రిగా తొలిసారి జిల్లాలో అడుగు పెట్టిన కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ సభపై క్లారిటీ ఇచ్చారు. అది తనకు పోటీ సభ ఎంతమాత్రం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా స్థానికంగా సభ పెట్టుకోవడం పార్టీకోసమేనన్నారు. మీడియా దాన్ని పోటీసభగా చిత్రీకరించడం సరికాదన్నారు కాకాణి. కావలిలో తనకు లభించిన స్వాగతాన్ని తాను మరచిపోలేనని చెప్పారు కాకాణి.

Also Read : Nellore: నెల్లూరు రాజకీయ రచ్చపై వైసీపీ దృష్టి - వారిద్దరి మధ్య రాజీకి మార్గం ఇదే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
Embed widget