అన్వేషించండి

Why Not Lokesh : జెండా సభలో కనిపించని లోకేష్ - అందుకే దూరంగా ఉన్నారా ?

Why Not Lokesh : తాడేపల్లిగూడెం సభకు నారా లోకేష్ హాజరు కాలేదు. ఈ అంశంపై టీడీపీతో పాటు జనసేన వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Nara Lokesh did not attend the Tadepalligudem meeting :   తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా మోగించిన ఎన్నికల ప్రచారభేరి సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. భారీగా జన సమీకరణ చేసి సత్తా చాటారు. ఒక్క స్టేజ్ మీదనే.. ఐదు వందల మంది ఇరు పార్టీల నేతలు ఉండేలా చూసుకున్నారు. అందరూ వచ్చారు కానీ..  నారా లోకేష్ మాత్రం కనిపించలేదు. అసలు సభకు నారా లోకేష్ రాలేదు. ఎందుకు రాలేదన్నది సభ జరుగుతున్నప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు  మాత్రం లోకేష్ ఎందుకు రాలేదన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.    

కావాలనే  లోకేష్ సభకు హాజరు కాలేదంటున్న సన్నిహితులు       

నారా లోకేష్  ఉమ్మడి ప్రచారభేరి సభకు  కావాలనే దూరంగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రసంగాలు మాత్రమే హైలెట్ కావాలని .. తాను మాట్లాడితే బాగుండదని లోకేష్ అనుకున్నారని అంటున్నారు. పైగా అది  ఉమ్మడి ప్రచార భేరీ సభ. సభా ఏర్పాట్లను జనసేన పార్టీ తీసుకుంది. ఆ పార్టీ నేతలు సభ కోసం కష్టపడ్డారు. ఆ పార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అనుకుంది. ఆ ప్రకారం.. చంద్రబాబు మాత్రమే ప్రధానంగా ప్రస్తావించారు. మిగిలిన వారిలో ఎక్కువగా జనసేన నేతలే ప్రసంగించారు. చంద్రబాబు, బాలకృష్ణ లాంటి వారు  మినహా టీడీపీ నేతలు ఎవరూ పెద్దగా  ప్రసంగించలేదని గుర్తు చేస్తున్నారు. 

మంగళగిరిలో విస్తృత పర్యటనలు                  

మరో వైపు నారా లోకేష్ మంగళగిరిలో తీరిక లేకుండా కార్యక్రమాల్లో ఉన్నారు. రోజూ పలు రంగాల ప్రముఖుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. బుధవారం రోజున కూడా.. పెద్ద ఎత్తున చేరికలు.. వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే పాదయాత్ర కోసం దాదాపుగా ఏడాది పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు నుంచి.. ప్రచార బాధ్యతల్ని రాష్ట్రం మొత్తం నిర్వర్తించాల్సి ఉంది. అందుకే  నియోజకవర్గంలో సుడిగాలిలా పర్యటించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. లోకేష్.. మంగళఘరిలో రోజూ  పదికిపైగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ సీనియర్ నేతల ఇళ్లకే కాదు తటస్థుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పలకరిస్తున్నారు. 

చంద్రబాబు, పవన్ మాత్రమే హైలెట్ కావాలనుకుంటున్న లోకేష్                 

ఈ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కోసం పాదయాత్ర చేసినా.. నారా లోకేష్.. ఓ కార్యకర్తగానే తన కృషి ఉంటుందని..అంతకు మించి  క్రెడిట్ తీసుకునేందుకు ఆసక్తిగా లేరని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రమే.. మొత్తంగా హైలెట్ అవుతారని.. అంటున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో చంద్రబాబు తర్వాత లోకేష్ కనిపించినప్పటికీ.. ఉమ్మడి సభల్లో మాత్రం.. చంద్రబాబు మాత్రమే ప్రధానంగా ఉంటారని.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఉంటారని అంటున్నారు.                             

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Divyang Shakti Scheme: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
YS Sharmila fires on Jagan: అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
అన్న అనే పేరుకే కళంకం - జగన్‌పై షర్మిల నిప్పులు - ఎందుకంటే?
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
US Exit Bonus: అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
అమెరికాలోని అక్రమ వలసదారులకు రూ. 2 లక్షల నగదు ఆఫర్.. కానీ ఏం చేయాలంటే!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
Big Relief For Fliers: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఉచిత సీట్లు, ఛార్జీల మోతకు చెక్ - DGCA కొత్త రూల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Free Charging For EVs: మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
మరో 3 ఏళ్లపాటు ఎలక్ట్రిక్ కార్లకు ఉచితంగా ఛార్జింగ్.. కస్టమర్లకు విన్‌ఫాస్ట్ మరిన్ని ఆఫర్లు
BRS MLAs Walk Out: మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
మూసీలో లక్షన్నర కోట్ల దోపిడీ! సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్: కేటీఆర్
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Embed widget