అన్వేషించండి

 Nara Lokesh: రోడ్ల పై కత్తులు పట్టుకొని మహిళల్ని వెంటాడుతున్నారు.. కనిపించట్లేదా? ఒక్క నిందితుడికైనా శిక్ష పడిందా?

ఆంధ్రప్రదేశ్ లో 500 మంది మహిళలపై దాడి జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారని విమర్శించారు.

 

నారా లోకేశ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఎర్రబాడుకు చేరుకొని ఏడాది క్రితం హత్యకు గురైన హజీరా కుటుంబాన్ని పరామర్శించారు. చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఇతరులకేం చేస్తారని మండిపడ్డారు. వివేకా కుమార్తెకు రాష్ట్రంలో భద్రత లేదని అన్నారు.

ఎర్రబాడులో హజీరాను హత్య చేసి ఏడాది అయ్యిందని నారా లోకేశ్ అన్నారు. 21 రోజుల దిశ చట్టం ఎక్కడ? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. పొలంకి వెళ్ళొస్తానని తల్లికి చెప్పి వెళ్లిన అమ్మాయిని దారుణంగా చంపేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు లోకేశ్ తెలిపారు. తల్లి బాధ మీకు పట్టదా జగన్ రెడ్డి గారు?తాడేపల్లి కొంపలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ రావడం లేదు గన్ను రావడం లేదు. జగన్ ఒక బుల్లెట్ లేని గన్ అని తేలిపోయింది. జగన్ రెడ్డి గారి ప్యాలస్ పక్కన మహిళ పై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకూ నిందితులను పట్టుకోలేకపోయారు.   సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ ని అత్యంత కిరాతకంగా చంపేస్తే ఈ రోజు వరకూ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు.
                                                                                                                           - నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
 
అంతకుముందు కోడుమూరులో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి లోకేశ్ నివాళులర్పించారు. టీడీపీ నేతల పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారు. కర్నూలు నగరం బళ్లారి చౌరస్తాలో లోకేశ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లోకేశ్ ఇంకా ఏమన్నారంటే..

  • హోంమంత్రి గారు మహిళల్ని హత్య చేసే హక్కు ఎవరిచ్చారు.. అని అమాయకంగా అడుగుతున్నారు. ఆ మాట విన్న తరువాత నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు. మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి గారే ఇచ్చారు.
  • నేను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతున్నా రెండేళ్ల మీ పరిపాలనలో ఒక్క మహిళకైనా న్యాయం జరిగిందా? ఒక్క నిందితుడికైనా శిక్ష పడిందా?
  • దిశ చట్టం అన్నారు,21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు?ఇప్పటి వరకూ ఎంత మందికి శిక్ష పడిందో చెప్పే ధైర్యం ఉందా?
  • దిశ చట్టం,దిశ యాప్ అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారు.కేంద్రమేమో అసలు ఆ చట్టమే లేదంటుంది. 
  • విచిత్రం ఏంటంటే వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. 
  • దిశ చట్టం పై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది.

 

Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట

టాప్ హెడ్ లైన్స్

Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Breaking News: కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
కర్ణాటక ప్రజలకు కొడంగల్ నియోజకవర్గంలో ఓట్లున్నాయి: కవిత సంచలన ఆరోపణలు
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget