అన్వేషించండి

MLA Roja: చంద్రబాబు మీద లోకేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై నగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు చేశారు. కుప్పం ఎన్నికల నేపథ్యంలో ఆమె మాట్లాడారు.

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా ఉందని ఆమె విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీని ప్రజలు తుంగలో తొక్కారని, మున్సిపల్ ఎన్నికల్లో మురికి కాలువలో ముంచెత్తారు అని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తరిమి.. తరిమి కొట్టారని ఆ దెబ్బకి భయపడి ఎన్నికలకి దూరంగా ఉన్నామని ప్రకటించుకోవాల్సి వచ్చిందన్నారు. మొన్న బద్వేలు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఏజెంట్ గా పని చేసి ఓట్లు వేయించుకోవాలన్న టీడీపీ కుతంత్రాలకి డిపాజిట్ గల్లంతు అయిందని రోజా వ్యాఖ్యానించారు. 

తిరుపతి ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పినా.. ఇంకా బుద్ధి రాని చంద్రబాబు నాయుడు,లోకేష్ దమ్ముంటే రండి అని మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగానే హాస్యాస్పదంగా ఉందన్నారు. లోకేశ్ మాట్లాడే మాటలు చూస్తుంటే తనకు నిజంగానే అనుమానంగా ఉందన్నారు. మంగళగిరిలో తనను ఓడించిన నాన్న మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి వాళ్ల నాన్న రాజకీయ భవిష్యత్తుని లోకేశ్ సమాధి చేసే ప్రయత్నం చేస్తున్నాడేమో అని అనిపిస్తుందని రోజా ఎద్దేవా చేశారు. 

కుప్పం ప్రజల సుఖ దుఃఖాల్లో పాలు పంచుకోవడానికి లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని అక్కడ లేరు అన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు, అతనిని ఓట్లు వేయించి గెలిపించుకున్న కుప్పం ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు.  జగన్మోహన్ రెడ్డి మాత్రమే వారిని తమ సొంత నియోజకవర్గ ప్రజలు లాగా చొరవ తీసుకుని అభివృద్ధి చేశారన్నారు. కుప్పం ప్రజల ఓట్లు వేసినా.. వేయకపోయినా.. సంక్షేమ పథకాలను అందేటట్లు జగన్ చూస్తున్నారన్నారు.

జగన్ చేస్తున్న అభివృద్ధికి కానుకగా.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి చంద్రబాబు, లోకేశ్  కు బుద్ధి చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలకి, డబ్బులతో ప్రలోభ పెట్టే రాజకీయాలకి, మద్యంతో ప్రలోభ పెట్టే రాజకీయాలకి తెర లేపింది చంద్రబాబు నాయుడేనని విమర్శించారు. ఆ విషయం కుప్పం ప్రజలతో సహా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసునన్నారు.

Also Read: AIded Students : బడులను కాపాడుకున్న విద్యార్థులు ... ఎయిడెడ్ ఉద్యమంలో లాఠీ దెబ్బలకూ భయపడని స్టూడెంట్స్ !

Also Read: Maoist Ravi: బాంబు ప్రమాదంలో మావోయిస్టు రవి మృతి... ఏడాదిన్నర తర్వాత ధ్రువీకరించిన మావోయిస్టు పార్టీ

Also Read: Nellore News: వానలు వెలిశాయి.. వ్యాధులు పొంచి ఉన్నాయి... జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

తెలంగాణ రైల్వే రూపురేఖలు మారుతున్నాయా? కొత్త ప్రాజెక్టులు, వందే భారత్ విస్తరణతో రవాణా రంగంలో విప్లవం!
తెలంగాణ రైల్వే రూపురేఖలు మారుతున్నాయా? కొత్త ప్రాజెక్టులు, వందే భారత్ విస్తరణతో రవాణా రంగంలో విప్లవం!
Pawan Kalyan: సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
Machine Learning: తెలుగు యువత భవిష్యత్తుకు దారి చూపే AI టెక్నాలజీ! అవకాశాలు, కోర్సులు, నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే !
మీరు తెలుసుకోవలసిన మెషిన్ లెర్నింగ్ రహస్యాలు: AIతో అద్భుత అవకాశాలు
MLC Ananthababu case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
Advertisement

వీడియోలు

Pawan Kalyan on Hindi Big Mother | ఉత్తరాది ప్రజలు దక్షిణాది భాషలు నేర్చుకుంటే బాగుంటుంది | ABP
Pawan Kalyan on Santhana Dharma | సనాతన ధర్మం గురించి ఏబీపీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Pawan Kalyan Interview on Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుపై పవన్ కళ్యాణ్ Exclusive ఇంటర్వ్యూ
Jagdeep Dhankhar resigned as Vice President | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా
Anshul Kamboj in India vs England 4th Test | టీం ఇండియాలోకి ధోనీ శిష్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ రైల్వే రూపురేఖలు మారుతున్నాయా? కొత్త ప్రాజెక్టులు, వందే భారత్ విస్తరణతో రవాణా రంగంలో విప్లవం!
తెలంగాణ రైల్వే రూపురేఖలు మారుతున్నాయా? కొత్త ప్రాజెక్టులు, వందే భారత్ విస్తరణతో రవాణా రంగంలో విప్లవం!
Pawan Kalyan: సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
సనాతన ధర్మం అవసరం, ఎవరినీ వీరమల్లు కించపరచదు - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్
Machine Learning: తెలుగు యువత భవిష్యత్తుకు దారి చూపే AI టెక్నాలజీ! అవకాశాలు, కోర్సులు, నేర్చుకోవాల్సిన విషయాలు ఇవే !
మీరు తెలుసుకోవలసిన మెషిన్ లెర్నింగ్ రహస్యాలు: AIతో అద్భుత అవకాశాలు
MLC Ananthababu case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
హైదరాబాద్‌లో 24/7 EV ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి! తక్షణమే ఛార్జ్ చేసుకోండి!
హైదరాబాద్‌లో 24/7 EV ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి! తక్షణమే ఛార్జ్ చేసుకోండి!
Karnataka: యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై - లక్షల్లో ట్యాక్స్ నోటీసులు - మరేం చేస్తారు?
యూపీఐ పేమెంట్లకు కర్ణాటక చిన్న వ్యాపారుల గుడ్ బై - లక్షల్లో ట్యాక్స్ నోటీసులు - మరేం చేస్తారు?
Andhra Pradesh Districts Names: ఏపీలో జిల్లాల పేర్లు మార్పు - ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
ఏపీలో జిల్లాల పేర్లు మార్పు - ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు
Pawan Kalyan Chit Chat: సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం  - చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్
సినిమాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం - చిట్ చాట్‌లో పవన్ కల్యాణ్
Embed widget