అన్వేషించండి

Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!

Andhrapradesh News: అనుమానాస్పదంగా ఇద్దరు మరణించడంతో అక్కడి గ్రామస్థుల్లో భయం పట్టుకుంది. మా ఊరికి దెయ్యాలతో ప్రమాదం పొంచి ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. అల్లూరి జిల్లాలో ఓ గ్రామం మిస్టరీ కథ ఇదీ!

Mysterious Deaths In Chuttumetta In Alluri District: దాదాపు 50 గడపలు.. 350 మంది నివాసం.. పల్లె వాతావరణం. ఎప్పుడూ ఐకమత్యంగా ఉండే గ్రామస్థులు. ఇదీ ఆ గ్రామంలో ఒకప్పటి పరిస్థితి. కానీ, ఇప్పుడు ఎవరి కళ్లల్లో చూసినా భయం. ఎవరిని కదిలించినా ఏదో ఆందోళన. 'అమ్మో మా ఊరికి దోషం పట్టింది. దెయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉంది.' అంటూ అక్కడి గ్రామస్థులు భయాందోళనలతో చెబుతున్నారు. ఇటీవలే కొందరు గ్రామస్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పాటు జరిగిన కొన్ని సంఘటనలు వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో రాత్రీ పగలూ అనే తేడా లేకుండా అందరూ కలిసి గుంపులుగా సంచరిస్తున్నారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుముట్ట గ్రామంలోని మిస్టరీ మరణాలు, దెయ్యం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

ఇదీ జరిగింది

చుట్టుమెట్ట గ్రామంలో జూన్ 19న ముగ్గురు మహిళలు అడవికి కట్టెల కోసం వెళ్లారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో అనసమ్మ అనే మహిళ అటు చూడగా ఓ వింత ఆకారం కనిపించిందని చెబుతున్నారు. దాన్ని చూసిన ఆమె భయంతో పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి వెంటనే స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు త్రినాద్ అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడికి విషయం చెప్పాడు. గొరవడుగా పిలవబడే బూతవైద్యుడు కిముడు సహదేవ్ అనసమ్మకు మంత్రోచ్చారణ చేస్తూ విభూది జల్లాడు. ఈ క్రమంలో మంత్రాలు చదువుతున్న సహదేవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వాంతులు విరేచనాలతో మృతి చెందాడు. ఇది చూసిన గ్రామస్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అనసమ్మకు సపర్యలు చేస్తోన్న ఆమె తమ్ముడు త్రినాథ్ మృతి చెందాడు. క్షణాల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థుల భయం రెట్టింపైంది.

'మీ తొడ భాగం కావాలి'

అనంతరం మృతి చెందిన ఇద్దరికి దహన సంస్కారాల కోసం శ్మశానానికి తీసుకెళ్లగా.. కొందరు చితి ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒకరి నోటి నుంచి 'ఏయ్ మీరెందుకు వచ్చారు. ఇప్పటికే ఇద్దరి పని అయిపోయింది. నీ తొడ భాగం కావాలి.' అంటూ కోరారని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో మరింత ఆందోళన చెందుతున్నారు. మిస్టరీ మరణాలు, ఈ ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. తమ ఊరికి ఏదో దోషం పట్టిందని గ్రామస్థులు భయాందోళనలతో మీడియా ప్రతినిధులతో చెప్పారు. వరుస ఘటనలతో గ్రామస్థులు ఏ పనికి వెళ్లాలన్నా గుంపులుగానే వెళ్తున్నారు. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. మరోవైపు, వైద్య శాఖకు చెందిన ఏఎన్ఎం గ్రామానికి చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు చొరవ చూపి గ్రామస్థులకు అవగాహన కల్పించాలని.. పలువురు కోరుతున్నారు. 

పల్నాడులోనూ..

మరోవైపు, పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చిన్నతురకపాలెంలోనూ క్షుద్రపూజలు కలకలం రేపాయి. 15 రోజుల క్రితం ఓ వ్యక్తి ఇంటి ముందు గోడకు మేకులు కొట్టి కనిపించాయి. ఆ తర్వాత రోజు చెట్టుకు సైతం మేకులు కొట్టి కనిపించాయి. మొదటి గ్రామస్థులు అంతగా పట్టించుకోలేదు. అయితే, ప్రతిరోజూ అలానే మేకులు కొట్టి కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా, ఇప్పుడు పసుపు, కుంకుమ సైతం కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థులు కంటి మీద కునుకు లేకుండా నిరంతరం భయంతో వణుకుతున్నారు. ఊరిలో ఎవరో చేతబడి చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
Hyderabad Gun Firing News: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Hyderabad Gun Firing News:ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌
ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 17వేల కోట్ల ప్యాకేజీ - ప్రైవేటీకరణ లేనట్లేనని చేతలతో చెప్పిన కేంద్రం !
Hyderabad Gun Firing News: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Hyderabad Gun Firing News:ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌
ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌
KTR News: జరగని అవినీతిపై కోట్లు ఖర్చు ఎందుకు?- 7 గంటల ఈడీ  విచారణపై కేటీఆర్ కామెంట్స్
జరగని అవినీతిపై కోట్లు ఖర్చు ఎందుకు?- 7 గంటల ఈడీ విచారణపై కేటీఆర్ కామెంట్స్
Hyderabad Gun Firing News: సినీఫక్కీలో హైదరాబాద్‌ పోలీసుల సెర్చ్ ఆపరేషన్- బీదర్ గ్యాంగ్ కోసం విస్తృతంగా గాలింపు
సినీఫక్కీలో హైదరాబాద్‌ పోలీసుల సెర్చ్ ఆపరేషన్- బీదర్ గ్యాంగ్ కోసం విస్తృతంగా గాలింపు
BCCI Vs Gambhir: గంభీర్ కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ నజర్..! డేంజర్లో వారిద్దరూ.. త్వరలో బ్యాటింగ్ కోచ్ నియమించనున్న బోర్డు!!
గంభీర్ కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ నజర్..! డేంజర్లో వారిద్దరూ.. త్వరలో బ్యాటింగ్ కోచ్ నియమించనున్న బోర్డు!!
Hyderabad Firing: హైదరాబాద్ నడిబొడ్డున బీదర్ దొంగల కాల్పులు - ఆఫ్జల్ గంజ్‌లో హైవోల్టేజ్ ఆపరేషన్
హైదరాబాద్ నడిబొడ్డున బీదర్ దొంగల కాల్పులు - ఆఫ్జల్ గంజ్‌లో హైవోల్టేజ్ ఆపరేషన్
Embed widget