అన్వేషించండి

YSRCP MLAs : సీఎం సమీక్షకు 10 మందికిపైగా ఎమ్మెల్యేల గైర్హాజర్ - పుకార్లకు ఊతమిస్తున్నట్టేనా?

సీఎం జగన్ సమీక్షా సమావేశానికి పది మందికిపైగా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వారంతా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.


YSRCP MLAs :    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గడప గడపకూ  మన ప్రభుత్వం సమీక్షా సమవేశానికి పది మందికిపైగా ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. ఇప్పటిేక నలుగురు పార్టీకి దూరం కాగా మిగిలిన వారిలో పది మందికిపైగా సమాచారం లేకుండా డుమ్మా కొట్టడం వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డి తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున హాజరు కావడం లేదని సమాచారం పంపారు. మిగతా ఎవరూ ముందస్తు సమాచారం ఇవ్వలేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు ఉన్నారు. సీఎం జగన్ ఈ సమీక్షా సమావేశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అందరకీ దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అయితే ఇలా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం వైసీపీ పెద్దలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. 

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్‌సీపీలో ఒక్క సారిగా అలజడి రేగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడమే కాకుండా ఇంకా నలభై మందికిపైగా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వాలంటీర్లకు ఉన్నంత గౌరవం కూడా లేదని కనీస అధికారాలు కూడా కరువయ్యాయని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఐ ప్యాక్ సిబ్బంది తమ రాజకీయ  భవిష్యత్ ను నిర్ణయించే  శక్తులగా మారడం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను అసహనానికి గురి చేస్తోంది. అసలు పార్టీలో స్వేచ్చ లేదని బాధపడుతూంటే.. తమపై ఐ ప్యాక్ సిబ్బంది స్వారీ చేయడం ఏమిటని వారి వాదన. 

ఐ ప్యాక్ సిబ్బంది ఇస్తున్న ఫీడ్ బ్యాక్‌తోనే ఎమ్మెల్యేల పనితీరును సీఎం జగన్ నిర్ధారిస్తున్నారు. తాము కష్టపడుతున్నప్పటికీ కొంత మంది ఐ ప్యాక్ సిబ్బంది తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని..  తమ పనితీరు తెలుసుకోవడానికి ఎన్నో రకాల సోర్సులు ఉండగా.. ఈ ఐ ప్యాక్ మీద ఆధారపడటం ఏమిటన్న అసహనం ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.  ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు గీత దాటకుండా చూడటానికి వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రత్యేకమైన వ్యూహం అవలంభిస్తున్నరు. కఠినమైన నిర్ణయాలు ఏమీ ఉండవని .. సమీక్షకు ముందే మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందు ప్రకటించారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. 

గైర్హాజర్ అయిన ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ప్రత్యేక  దృష్టి పెట్టే అవకాశం ఉంది. వారు నిజంగా అసంతృప్తికి గురై ఉంటే.. కారణాలేమిటో కనుక్కుని పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. గైర్హజర్ అయిన వారిలో దాదాపుగా ఐదారుగురుకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఉండవని ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. విచిత్రంగా వైసీపీలో సీఎం జగన్ అత్యంత సన్నిహితంగా ఉండే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  

ధర్మాన లాంటి వాళ్లు మాత్రం అసంతృప్త వార్తలను కొట్టిపారేస్తున్నారు. తాము ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని అందుకే సమీక్షకు హాజరుకాలేకపోయామంటున్నారు. ఈ విషయాన్ని ముందే అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. వారి అనుమతితోనే సమీక్షకు హాజరుకాలేదని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Embed widget