అన్వేషించండి

Mithun Reddy granted interim bail: లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి ఊరట - మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏసీబీ కోర్టు !

Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి మళ్లీ ఆయన జైల్లో సరెండర్ కావాల్సి ఉంది.

Mithun Reddy granted interim bail in AP liquor scam:  ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి  ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన A-4 నిందితుడిగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కావాలని ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు పదకొండో తేదీ వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తొమ్మిదో తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. పదకొండో తేదీ సాయంత్రం5 గంటలకు మళ్లీ జైల్లో సరెండర్ కావాల్సి ఉంది. యాభై వేల ష్యూరిటీ, ఇద్దరు పూచికత్తులు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. 

2019-2024 మధ్య YSRCP ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆరోపిస్తోంది. సిట్ రిమాండ్ రిపోర్టు ప్రకారం, ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి) నాయకత్వంలో నెలకు రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేశారు.  ఈ సొమ్ము విజయసాయి రెడ్డి (A-5), పీ కృష్ణమోహన్ రెడ్డి (A-32), కె ధనుంజయ రెడ్డి (A-31), బాలాజీ గోవిందప్ప (A-33) మరియు మిథున్ రెడ్డి ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేరినట్లు సిట్ ఆరోపణలు చేసింది. 

మిథున్ రెడ్డి జులై 19, 2025న విజయవాడలో సిట్ విచారణ కోసం హాజరైన తర్వాత అరెస్టయ్యారు. ఏసీబీ కోర్టు  రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. సిట్ రిమాండ్ రిపోర్టులో మిథున్ రెడ్డిని "ప్రధాన కుట్రదారుడు"గా పేర్కొంది, ఆ యన ఎక్సైజ్ పాలసీలో మార్పులు, డిస్టిలరీల నుంచి లంచాల సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించింది.                   

మిథున్ రెడ్డి సెప్టెంబర్ 9, 2025న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఏసీబీ కోర్టు జడ్జి  సెప్టెంబర్ 11, 2025 సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.  మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు, ఆయన ఎంపీగా రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం అవసరమని వాదించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, తాత్కాలిక ఉపశమనం కల్పించింది.             

మిథున్ రెడ్డి గతంలో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 3, 2025న హైకోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. సిట్ సమర్పించిన సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని, బెయిల్ మంజూరు చేయడం విచారణకు ఆటంకం కలిగిస్తుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత, జులై 18, 2025న సుప్రీం కోర్టు కూడా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది, విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది. అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన అరెస్టు కావాల్సి వచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

Anant Ambani: తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
తిరుమల శ్రీవారికి అనంత్ అంబానీ 27.5 కోట్ల విలువైన భారీ విరాళం, గోశాల ఆధునీకరణకు నిర్ణయం
YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget