అన్వేషించండి

Minister Savitha: లోకేష్‌పై ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా - జగన్‌కు మంత్రి సవిత సవాల్

TDP : లోకేష్‌పై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని మంత్రి సవిత సవాల్ చేశారు. నిరూపించలేకపోతే రాజీనామా చేయాలన్నారు.

Minister Savita challenges jagan:  తల్లికి వందనం పథకం అమలుతో పేద విద్యార్థుల ఇళ్లలో ఆనందం వ్యక్తమవుతోందని  మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంతో, జగన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులకే ఓర్వలేకపోతున్నారని,  మంత్రి నారా లోకేశ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి లోకేశ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని, లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? అని జగన్ ను మంత్రి సవిత సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమైన తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ముందుగానే చెప్పిన విధంగా పాఠశాలలు ప్రారంభం రోజున ఈ పథకానికి సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన 67,27,164 మంది విద్యార్థులను గుర్తించామన్నారు. వారందరికీ రూ.10,091 కోట్లు వెచ్చించామన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున రూ.8,745 కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాలో జమచేశామన్నారు. మిగిలిన రూ.2 వేలు చొప్పున రూ. రూ.1,346 కోట్లను పాఠశాలల అభివృద్ధికి కేటాయించామన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని మంత్రి సవిత వెల్లడించారు. ఒకరుంటే రూ.13 వేలు, ఇద్దరుంటే రూ.26 వేలు, ముగ్గురుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, అయిదుగురుంటే రూ.65 వేలు తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. 

తల్లి ప్రేమకు జగన్ పరిమితి పెడితే, తమ ప్రభుత్వం తల్లి ప్రేమకు హద్దుల్లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేస్తోందని మంత్రి సవిత వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు అమ్మఒడి పథకం అందజేస్తామని జగన్ రెడ్డి హామీ ఇచ్చి, మాటతప్పారని మండిపడ్డారు. ఇంట్లో ఇద్దరకు ముగ్గురు పిల్లులున్నా కేవలం ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద రూ.13 వేలు అందజేశారన్నారు. 2022-23లో 42,61,965 మంది విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి పథకం కింద వర్తింపజేశారన్నారు. వారందకీ అప్పట్లో రూ.5,540 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో అదనంగా 24,65,199 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తింప జేశామన్నారు. గత ప్రభుత్వం కంటే అదనంగా రూ.3,205 కోట్లు కేటాయించామన్నారు.  

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వాలే వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని మంత్రి సవిత గుర్తు చేశారు. తల్లికి వందనం పథకంతో పాటు పాఠశాలల ప్రారంభం రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర పథకం కింద విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్కో కిట్టు విలువ రూ.2,279లని, ఆ కిట్టులో పాఠ్య పుస్తకాలు, వర్క్, నోట్‌బుక్‌లు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 3 జతల యూనిఫారం, బ్యాగ్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్‌ ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు కడుపు నింపడమే కాదు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామన్నారు. పిల్లలు కూడా సంతోషంగా భోజనం చేస్తున్నారన్నారు. గత వైసీపీ హయాంలో పాఠశాలలు, వసతి గృహాలకు, గోదాముల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉన్న ముతక బియ్యాన్ని సరఫరా చేశారని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం పథకం అమలుచేస్తున్నామన్నారు. 2014-19లోనూ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశామని, జగన్ రెడ్డి ఆ పథకాన్ని నిలిపేసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.  

తల్లికి వందనం పథకం అమలుతో జగన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయ్యిందని, దీంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మంత్రి సవిత మండిపడ్డారు. తల్లికి వందనం పథకంలోని రూ.2 వేలు మంత్రి లోకేశ్ జేబులోకి వెళ్లాయని తప్పుడు ఆరోపణలు చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో మీరు చేసిన అవినీతిని మంత్రి లోకేశ్ పైకి నెట్టడం సరికాదన్నారు. మంత్రి లోకేశ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని, లేకుంటే పులివెందుల ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తావా.. అని జగన్ కు మంత్రి సవాల్ విసిరారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, సానుభూతి పునాదుల మీదే జగన్ రాజకీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నాడన్నారు. 
  
మహిళలంటే జగన్ కు గౌరవం లేదని, తల్లిని, చెల్లెళ్లను, రాష్ట్రంలో ఆడ బిడ్డలను ఏడిపిస్తున్నాడని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతదేహాల దగ్గరికి వెళ్లి నవ్వుతాడని, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి కుళ్లి కుళ్లి ఏడుస్తున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డీఎస్సీని అడ్డుకోడానికి జగన్ కుట్రపన్నాడన్నారు. డీఎస్సీని అడ్డుకోడానికి 24 కేసులు వేశారన్నారు. చివరికి సుప్రీం కోర్టులో కూడా కేసు వేస్తే, దేశ అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసిందని తెలిపారు. ప్రజలు గట్టి గుణపాఠం చెప్పినా జగన్ రెడ్డికి బుద్ధి రాలేదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు. 
  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Andhra Pradesh Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
ఏపీ లిక్కర్ స్కామ్‌లో దూకుడు - జగన్ సన్నిహితుల విచారణ - ఏం జరుగుతోంది?
Chief Minister Chandrababu Naidu: బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బ్లాక్ చైన్ టెక్నాలజీతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు - హార్టికల్చర్ హబ్ సీమ - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget