అన్వేషించండి

Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన

Tirumala Laddu Issue : నెయ్యి కంటే పందికొవ్వు రేటు ఎక్కువ కాబట్టి కల్తీ చేయరని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఢిల్లీలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Lawyer Ponnavolu Sudhakar Reddy : వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేత, లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో పందికొవ్వు కలపలేదని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఎందుకంటే..  నెయ్యి కంటే పంది కొవ్వు రేటు చాలా ఎక్కువ అన్నారు. వైవీ సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ వాల్యూ తగ్గిలందంటే .. కల్తీ జరిగిందని అర్థం కానీ.. ఆ కల్తీ  పంది కొవ్వు కాదని ఆయన అంటున్నారు. అంటే కల్తీ జరిగిందని వైసీపీ లాయర్ కూడా నిర్ధారించినట్లయింది. 

నెయ్యి కంటే ఖరీదైనది యానిమల్ ఫ్యాట్           

అదే సమయంలో పందికొవ్వు కేజీ రూ. 1450 వరకూ ఉంటుందని.. కానీ నెయ్యి మాత్రం రూ. నాలుగు వందలు మాత్రమేనన్నారు. ఎవరైనా  రూ. నాలుగు వందలు మాత్రమే ఉన్న నెయ్యిలో రూ. పధ్నాలుగు వందల విలువ చేసే పందికొవ్వును కలుపుతారా అని  ప్రశ్నించారు. రాగి చెంబులో ఎవరైనా బంగారాన్ని కలుపుతారా..  ఇత్తడిలో ఎవరైనా  గోల్డ్ కలుపుతారా అని ప్రశ్నించారు. లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా ?           

ఆయన మరో పోలిక కూడా తెచ్చారు. రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా అని కూడా ప్రశ్నించారు. అంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాగి.. పందికొవ్వు బంగారమా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు.  లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలనే తాను వైవీ సుబ్బారెడ్డి తరపున  హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. ఏపీ ప్రభుత్వం  వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని.. ఆయన  యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు కాబట్టి చంద్రబాబు కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెబుతాయన్నారు.  దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో  ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును కోరుతున్నామన్నారు.  

Also Read: Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు

ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకుల్లో కల్తీ ఉందని.. ఈ ట్యాంకులలో  వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని పొన్నవోలు చెప్పారు.  ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్‌తో  తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని .. ఆ టెస్టుల్లో పాసయితేనే... లడ్డూల తయారీకి వినియోగ్సాతరన్నారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వెనక్కి  పంపిస్తారన్నారు. తిరుమలలో నెయ్యిని  టెస్టు చేసే ల్యాబులు లేవని చెప్పారని..త కానీ ఉన్నాయని పొన్నవోలు వాదించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP DesamChiranjeevi Guinness Book of Records | గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి | ABPRishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABPInd vs Ban First Test Result | బంగ్లా పులులను పరుగులుపెట్టించిన చెన్నై చిరుత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
SC Verdict: చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
RRB Notification 2024: ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలివే
ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలివే
Best 7 Seater Car in India: సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
Embed widget