అన్వేషించండి

Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన

Tirumala Laddu Issue : నెయ్యి కంటే పందికొవ్వు రేటు ఎక్కువ కాబట్టి కల్తీ చేయరని లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఢిల్లీలో ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Lawyer Ponnavolu Sudhakar Reddy : వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేత, లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో పందికొవ్వు కలపలేదని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఎందుకంటే..  నెయ్యి కంటే పంది కొవ్వు రేటు చాలా ఎక్కువ అన్నారు. వైవీ సుబ్బారెడ్డి తరపున సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ వాల్యూ తగ్గిలందంటే .. కల్తీ జరిగిందని అర్థం కానీ.. ఆ కల్తీ  పంది కొవ్వు కాదని ఆయన అంటున్నారు. అంటే కల్తీ జరిగిందని వైసీపీ లాయర్ కూడా నిర్ధారించినట్లయింది. 

నెయ్యి కంటే ఖరీదైనది యానిమల్ ఫ్యాట్           

అదే సమయంలో పందికొవ్వు కేజీ రూ. 1450 వరకూ ఉంటుందని.. కానీ నెయ్యి మాత్రం రూ. నాలుగు వందలు మాత్రమేనన్నారు. ఎవరైనా  రూ. నాలుగు వందలు మాత్రమే ఉన్న నెయ్యిలో రూ. పధ్నాలుగు వందల విలువ చేసే పందికొవ్వును కలుపుతారా అని  ప్రశ్నించారు. రాగి చెంబులో ఎవరైనా బంగారాన్ని కలుపుతారా..  ఇత్తడిలో ఎవరైనా  గోల్డ్ కలుపుతారా అని ప్రశ్నించారు. లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

'శ్రీవారి భక్తులూ ఈ మంత్రం జపించండి' - భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి

రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా ?           

ఆయన మరో పోలిక కూడా తెచ్చారు. రాగిలో ఎవరైనా బంగారం కలుపుతారా అని కూడా ప్రశ్నించారు. అంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రాగి.. పందికొవ్వు బంగారమా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించడం ప్రారంభించారు.  లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలనే తాను వైవీ సుబ్బారెడ్డి తరపున  హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. ఏపీ ప్రభుత్వం  వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదని.. ఆయన  యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారు కాబట్టి చంద్రబాబు కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెబుతాయన్నారు.  దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో  ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును కోరుతున్నామన్నారు.  

Also Read: Tirupati Laddu Row: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు

ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన 10 ట్యాంకులలో నాలుగు ట్యాంకుల్లో కల్తీ ఉందని.. ఈ ట్యాంకులలో  వనస్పతి ఉందని మొదట టీటీడీ ఈవో చెప్పారని పొన్నవోలు చెప్పారు.  ట్యాంకులు ముందుగానే ఒక సర్టిఫికెట్‌తో  తిరుమలకు వస్తాయని, ఆ వచ్చిన ట్యాంకులను టీటీడీ 3 పరీక్షలు నిర్వహిస్తుందని .. ఆ టెస్టుల్లో పాసయితేనే... లడ్డూల తయారీకి వినియోగ్సాతరన్నారు. టెస్టుల్లో ఫెయిల్ అయితే వెనక్కి  పంపిస్తారన్నారు. తిరుమలలో నెయ్యిని  టెస్టు చేసే ల్యాబులు లేవని చెప్పారని..త కానీ ఉన్నాయని పొన్నవోలు వాదించారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget