అన్వేషించండి

YS Jagan: దాడులు ఇక్కడితో ఆపండి, లేకపోతే రేపు మీ వాళ్లకు ఇదే గతి!: చంద్రబాబుకు వైఎస్ జగన్ వార్నింగ్

Andhra Pradesh | టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన అజయ్ కుమార్ రెడ్డి అనే యువకుడ్ని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును హెచ్చరించారు.

YS Jagan Mohan Reddy warns AP CM Chandrababu over attack of YSRCP leaders | పులివెందుల: దాడుల సంప్రదాయాన్ని ఆపాలని, లేకపోతే రేపు మీకు ఇలాంటే గతి పడుతుందని వైఎస్సా్ర్ సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ శనివారం కడప జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో కడప రిమ్స్‌కు వెళ్లి వెంపల్లిలో ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త అజయ్‌కుమార్ రెడ్డిని వైఎస్ జగన్ పరామర్శించారు. బాధితుడికి తాము అండగా ఉంటామని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. బాధితుడి గాయాలు, మెడికల్ కండీషన్ పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

టీడీపీ శ్రేణుల దారుణాలు.. 
అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘25 ఏళ్ల యువకుడు అజయ్ కుమార్ రెడ్డిని టీడీపీ శ్రేణులు దారుణంగా కొట్టాయి. ఎందుకంటే తను వైఎస్సార్ సీపీ పార్టీకి ఓటు వేశాడని, అదే పనిగా కావాలని వాహనాల్లో వెంపల్లెకు వచ్చి అతడి బైక్ అడ్డుకుని దాడికి పాల్పడ్డారని వైఎస్ జగన్ ఆరోపించారు. పాతికేళ్ల యువకుడిపై ఎందుకంత కోపం, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కనిపిస్తే ఇలాగే దాడులు చేస్తారా అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఇలా దాడులు చేసి అమాయకులపై నిర్ధాక్షిణ్యంగా దాడులు చేసి ఆసుపత్రి పాలు చేస్తే మీకు కలిగే ప్రయోజనం ఏముంది, ఏం సాధిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. 

ఎన్నో ఎన్నికలు జరిగాయి, కానీ పులివెందులలో తొలిసారి తమకు ఓటు వేయని వారిపై ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి భయాందోళన కలిగించే చర్యలకు దిగుతున్నారు. ఇప్పుడు మీరు వేస్తున్న బీజం, చేసే పనులు రేపు పొద్దున టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది. ఇలా భయందోళన కల్పిస్తే తనకు ప్రయోజనం ఉందని భావిస్తున్నారు. కానీ చంద్రబాబు దయచేసి ఈ చెడు సంప్రదాయాన్ని తప్పకుండా ఆపేయండి. ఎప్పటికీ మీరే అధికారంలో ఉండరు. శిశుపాలుడి పాపాల్లా పెరిగిపోతున్నాయి. వీటిని గమనిస్తున్న ప్రజలు, ఇప్పుడు దెబ్బతిన్న వారు రేపు అటువైపు ఇలాంటి దాడులు చేయడానికి చంద్రబాబు బీజం వేస్తున్నారు. నాయకులుగా మేం ఇలాంటి చర్యలకు దిగకూడదు. దయచేసి వీటిని ఇక్కడితో ఆపేయాలి. లేకపోతే భవిష్యత్తులో టీడీపీ శ్రేణులపై దాడులకు ఇవి ప్రేరేపిస్తున్నాయని’ వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హామీలు అమలు చేయడం లేదని విమర్శలు 
మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలు కావడం లేదని వైఎస్ జగన్ ఆరోపించారు. 90 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వారికి బ్యాగులు, కిట్లు సైతం సరిగ్గా పంపిణీ చేయడం లేదని విమర్శించారు. మాకు రావాల్సిన 10 శాతం ఓట్లు మీకు ఎందుకు పడ్డాయంటే, చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలే కారణం. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. కానీ అమ్మ ఒడి డబ్బులు ఇంకా అకౌంట్లో వేయడం లేదన్నారు. ప్రతి ఇంటికి రూ.3 వేల నిరుద్యోగ భృతి కోసం జాబ్స్ లేని యువత ఆశగా ఎదురుచూస్తోంది. కావాలంటే ఇలాంటి హామీలు నెరవేర్చాలి కానీ తమకు ఓటు వేయలేదనన కక్షతో దాడులు చేయడం సరికాదని వైఎస్ జగన్ హితవు పలికారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Thalliki Vandanam Cybercrime: తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే
తల్లికి వందనం పథకంలో సైబర్ మోసం.. 28 మంది అకౌంట్లలో నగదు మాయం, ట్విస్ట్ ఏంటంటే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget