అన్వేషించండి

Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత

Andhra Pradesh News | రాప్తాడులో చంద్రబాబు హయాంలో జాకీ కంపెనీ తీసుకొస్తే అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు కోట్లు డిమాండ్ చేసి వెళ్లగొట్టారని పరిటాల సునీత ఆరోపించారు.

AP Assembly Sessions | అనంతపురం జిల్లా : రాప్తాడు నియోజకవర్గ ప్రజల వాణిని మరోసారి ఎమ్మెల్యే పరిటాల సునీత అసెంబ్లీలో వినిపించారు. అసెంబ్లీలో జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిన అంశం గురించి బుధవారం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్ల జాకీ సంస్థ రాప్తాడు సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందన్నారు. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా ఉత్తర్వులు ఇచ్చినట్టు గుర్తు చేశారు.

జాకీ సంస్థ వెళ్లిపోవడానికి కారణం అదే

రూ.129 కోట్లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే పరిశ్రమ పనులు కూడా 2018లో ప్రారంభించారని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి.. మిషనరీలను కూడా తీసుకొచ్చిన సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆసమయంలో అప్పటి YSRCP ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపించారు. దీంతో పరిశ్రమ తెలంగాణకు తరలిపోయిందని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ వలన సుమారు 6వేల మందికి ప్రత్యక్షంగా 4వేల మందికి పరోక్షంగా మొత్తం 10వేల మంది ఉపాధి కల్పించే అవకాశాన్ని కోల్పోయామన్నారు.

జాకీ పరిశ్రమ మళ్లీ ప్రారంభించాలని తెలుగుదేశం పార్టీతో పాటు సీపీఐ నాయకులు కూడా ఛలో జాకీ పరిశ్రమ కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. పోలీసులతో నేతల్ని అక్రమంగా అరెస్టులు చేయించారని పేర్కొన్నారు. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో ఆ సమయంలో 40 మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారు. ఇందులో నాతో పాటు పరిటాల శ్రీరామ్, సీపీఐ రామకృష్ణలు కూడా ఉన్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేసిన జాకీని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోగా.. వేరే గార్మెంట్స్ పరిశ్రమలు తీసుకొస్తామని ప్రగల్భాలు పలికారంటూ మండిపడ్డారు. కానీ నేటికీ ఆ భూముల్లో ఒక్క పరిశ్రమ కూడా రాని కారణంగా వృథాగా ఉన్నాయన్నారు. అందుకే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా గతంలో ఇచ్చిన ప్రోత్సాహాకాలు కొనసాగిస్తూ.. జాకీ పరిశ్రమ తిరిగి వచ్చేలా చూడాలన్నారు.

Also Read: AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత

కంపెనీలు వస్తే వేల మందికి ఉపాధి

ప్రస్తుతం రాప్తాడు సమీపంలో విలువైన భూములు అందుబాటులో ఉన్నాయని.. ఆ స్థానంలో జాకీ పరిశ్రమ వస్తే 10వేల మందికి ఉపాధి ఏర్పడుతుందన్నారు. జాకీ పరిశ్రమ రాని పక్షంలో మరేవైనా ఇలాంటి పరిశ్రమలే తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. సభ అనంతరం గౌరవ స్పీకర్ గారి ఛాంబర్లో పరిటాల శ్రీరామ్ తో పాటు వెళ్లి భారీ, చిన్న తరహా పరిశ్రమల శాఖల మంత్రులు టి.జి. భరత్, కొండపల్లి శ్రీనివాస్ కు జాకీ పరిశ్రమను తిరిగి తీసుకురావాలని పరిటాల సునీత వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై మంత్రులు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పరిశ్రమలు నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget