అన్వేషించండి

నిఘా నీడలో కర్నూలు, వినాయక శోభాయాత్ర కోసం విస్తృత ఏర్పాట్లు!

Kurnool News: వినాయక నిమజ్జనోత్సవాల్లో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తెలిపారు. అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు. 

Kurnool News: కర్నూలు నగరంలో వినాయక చవితి వారోత్సవాలు 8 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా సాగాయి. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగను జరుపుకున్నారు. నగరంలో గణనాథులు నిమజ్జనానికి తరలింపు పూర్తైంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఎవరూ సరిగ్గా జరుపుకోలేకపోయారు. అందుకే ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించిన గణేష్ నిమజ్జనం మహోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కర్నూలు నగరంలో 2000 వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ప్రతి వాడలో ఉన్నటువంటి విగ్రహాలకు ఐడీ నెంబర్ ను కేటాయించారు. ఆయా ప్రాంతాలలో ఉన్న విగ్రహాల సంఖ్యను బట్టి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 

మొదటి ప్రారంభమయ్యే నిమజ్జన యాత్ర ఎక్కడంటే?

కర్నూలు నగరంలో ఉదయం 9 గంటలకు రాంబట్ల దేవాలయం నుంచి వినాయక నిమజ్జన యాత్ర  ప్రారంభం అవుతుంది. చాలా ఏళ్లుగా వస్తున్న ఆచార, సాంప్రదాయాల ప్రకారం మొదటగా ఆ వినాయకుడిని నిమజ్జనం చేశాకే.. మిగతా విగ్రహాలకు నిమర్జనం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదటగా ఆ విఘ్నేశ్వరుడు పూజలు అందుకున్నాకే..  రాంబట్ల దేవాలయ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనానికి బయలుదేరుతారు. తర్వాత కర్నూల్ లో ఉన్నటువంటి అన్ని వినాయకులు నాలుగు దిక్కుల నుండి నిమజ్జన ఘాటుకు వస్తాయి. ముఖ్యంగా పాత బస్టాండ్, ఆర్ఎస్ రోడ్డు, కొత్త బస్టాండ్, బిర్లాగేట్, నంద్యాల చెక్ పోస్ట్, గుత్తి పెట్రోల్ బంక్ నుండి రూట్ మ్యాప్ ద్వారా నిమజ్జనానికి గణనాథులు తరలివస్తారు.

పోలీసు సూచనలు తప్పక పాటించాలి...!

నగరంలో ఈరోజు జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమంలో పోలీసులతో మర్యాద పూర్వకంగా మెలగాలని, అధికారులతో అస్సలే గొడవ పడకూడదని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సూచించారు. ఊరేగింపులో శబ్దాలు, కాలుష్యం తగ్గించుకోవాలని ఎక్కడ పడితే అక్కడ నిలబడకుండా ఇతరులకు హాని కలిగించకుండా చూడాలని అన్నారు. అదే విధంగా లేనిపోని సమస్యలు సృష్టించరాదని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న విగ్రహ కమిటీ సభ్యులు వారి గణేష్ విగ్రహం వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలని.. ఊరేగింపులో కెమికల్స్ లాంటి రంగులు చల్లుకోరాదని, పోలీసులకు సహకరించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. భారతీయ సంప్రదాయ సంస్కృతిక పద్ధతిలో వచ్చిన వారికి పోలీసులు బహుమతుల ప్రధానం జరుగుతుందని తెలియజేశారు. 

మద్యం దుకాణాలను మూసేయాలని.. నగర పరిధిలో బ్లాక్ లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో కొత్త వ్యక్తులపై రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేయకుండా ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలన్నారు. డీజేలు అనుమతి ఉన్నప్పటికీ... రాత్రి 12 గంటల వరకు మాత్రమే డీజేలు ఉపయోగించాలని గుర్తు చేశారు. డీజేలను నిలిపివేయాలని పైన సూచించిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఎస్పీ తెలిపారు. 

పోలీసుల వలయంలో కర్నూలు నగరం..!

నగరంలో 2000 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,  గొడవలకు తావివ్వకుండా భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకోవడం కోసం పోలీసులు పహారా కాస్తున్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకూ దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలతో ఏ విధంగా మెలగాలనే అంశాలపై సూచనలు చేశారు. 

కేసీ కెనాల్ చుట్టూ 7 క్రేన్ల ఏర్పాటు...!

కేసీ కెనాల్ పరిసర ప్రాంతాలలో 7 క్రేన్లను ఏర్పాటు చేశారు. విగ్రహాల ఎత్తు వాటి ప్రాధాన్యతను బట్టి పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చూడబోతున్నారు. గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడు క్రేన్ల సంఖ్యను పెంచారు. గతంలో మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిమర్జనం జరిగేది. కానీ ఇప్పుడు అది పునరావృతం కాకుండా చూడాలని.. ప్రస్తుత రోజుల్లో నగరంలో ఎక్కువ విగ్రహాలు ఉండటం వల్ల నిమర్జనం కార్యక్రమం త్వరగా ముగించాలని క్రేన్ల సంఖ్యను కూడా పెంచారు. నిమజ్జనాన్ని పురస్కరించుకొని దాదాపుగా 600 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అలాగే నిమజ్జనానికి ప్రభుత్వ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలియజేశారు. ఈ నిమజ్జనం ఉదయం 9 గంటలకు మొదలుకుని నిర్విరామంగా జరుగుతుందని పోలీసులు వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
YSRCP DSC Protests: ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!
ఏపీలో డీఎస్సీ సెగ!అక్రమాలు జరిగాయని  వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలు! తాడిపత్రిసహా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget