త్రివేండ్రం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో అగ్నిప్రమాదానికి గురైంది.
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Srikakulam News | మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఓ బోగీలో మంటలు చెలరేగాయి. మరోచోట శ్రీకాకుళం జిల్లాల్లో కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు బోల్తా పడింది.

- రత్లాం జిల్లాలో రాజధాని ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో అగ్నిప్రమాదం.
- షార్ట్ సర్క్యూట్తో మంటలు, గార్డ్తో ప్రయాణికుల తరలింపు.
- శ్రీకాకుళం జిల్లాలో కాశీ యాత్ర బస్సు బోల్తా, స్వల్ప గాయాలు.
- రెండు ఘటనల్లోనూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
భోపాల్: త్రివేండ్రం నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో రైలులోని ఒక ఏసీ కోచ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు కోచ్లో పొగలు, మంటలు రావడాన్ని గమనించి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
అయితే, రైలు గార్డ్ అత్యంత సమయస్ఫూర్తితో, అప్రమత్తతతో వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ (RPF) సిబ్బంది రంగంలోకి దిగి, మంటలు వ్యాపించిన ఏసీ బోగీలో ఉన్న 68 మంది ప్రయాణికులను అత్యంత వేగంగా, సురక్షితంగా కిందకు దించేశారు. అనంతరం రైల్వే సిబ్బంది మంటలు అంటుకున్న ఆ బోగీని మిగతా రైలు నుంచి వేరు చేసి, అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. గార్డ్, ఆర్పీఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఈ తీవ్రమైన అగ్నిప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

కాశీ యాత్రలో ప్రమాదం.. శ్రీకాకుళం జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తా..
కంచిలి : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగం గ్రామ సమీప నేషనల్ హైవేపై శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో కాశి తీర్థయాత్రకు వెళ్తున్న ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు ట్రావెల్ ఏజెంట్కు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా పెద్దకోడూరు మండలం మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఎమ్మిదినూరు గ్రామం నుంచి సుమారు 40 మంది భక్తులు పవిత్ర కాశీ యాత్రకు బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలంలో వీరు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కంచిలి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చెక్ చేశారు. గాయపడిన వారిని సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం ఎక్కడ జరిగింది?
రాజధాని ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదానికి కారణం ఏమిటి?
ప్రాథమిక సమాచారం ప్రకారం, రైలులోని ఒక ఏసీ కోచ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.
కాశీ యాత్రకు వెళ్తున్న బస్సు ఎక్కడ బోల్తా పడింది?
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగంపల్లె గ్రామ సమీపంలో కాశి యాత్రకు వెళ్తున్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది.
కాశీ యాత్ర బస్సు ప్రమాదంలో ఎవరికి గాయాలయ్యాయి?
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు ట్రావెల్ ఏజెంట్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ట్రెండింగ్ వార్తలు






















