అన్వేషించండి

Fact Check: శ్రీశైలం ప్రసాదంలో మిడత ఓ పక్కా కుట్ర - సీసీ కెమెరా దృశ్యాలతో బట్టబయలు - కేసులు ఖాయం !

Srisailam: శ్రీశైలం ఆలయ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని జరిగిన ప్రచారం కుట్ర అని ఆధారాలతో సహా దేవస్థానం అధికారులు తేల్చారు. కుట్ర చేసిన వారిని గుర్తించి కేసులు పెడుతున్నారు.

Srisailam temple prasad: శ్రీశైల దేవస్థానం ప్రసాద విక్రయ కేంద్రంలో ఒక భక్తుడు కొన్న లడ్డూ ప్రసాదంలో  మిడుత వచ్చిందని కొందరు చేస్తున్న ప్రచారం అంతా కుట్ర పూరితమని ఆలయ అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ఆలయ అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలించారు.  ప్రసాదం కౌంటర్ దగ్గరున్న సీసీ ఫుటేజీ ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. సదరు భక్తుడు 6వ కౌంటర్ దగ్గర కాసేపు ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిలుచున్నాడు. అంతకు ముందే 15 నిమిషాల క్రితం లడ్డూలు కొనుక్కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ భక్తుడికి ఒక కవర్ ను ఇచ్చారు.  వారు కావాలనే ఒక కీటకాన్ని తెచ్చి లడ్డూకి అంటించి వాగ్వాదానికి  దిగారని ఆ సీసీ టీవీ దృశ్యాల్లో స్పష్టమయింది. 

ఇదంతా జరుగుతున్నప్పుడు వారిలో ఒకరు ఈ తతంగాన్నంతా సెల్ ఫోనులో వీడియో తీసి ఒక టీవీ వాళ్లకు అందించాడు. ఆ  టీవీ వారు వెంటనే ఎక్స్ ఖాతాలో దీన్ని జూన్ 29వ తేదీ మధ్యాహ్నం  3.58 గంటలకు పోస్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే... దర్శనానికి వచ్చే భక్తుల వద్ద మొబైల్ ఫోన్ లు ఉండవు. బయటే భద్రపరచుకుని వస్తారు కాబట్టి దర్శనం అయ్యాక ప్రసాదం కొనాలనుకుంటే కొనుక్కుని బయటకు వెళ్ళాక మాత్రమే మొబైల్ ని తీసుకునే వీలు ఉంది. కానీ వీళ్ళు కావాలనే బయటకు వెళ్లి మొబైల్ ఫోన్లు తెచ్చుకుని మళ్ళీ ప్రసాదాల కౌంటర్ దగ్గరకు వచ్చి ఈ గొడవను వీడియో తీశారు. అంటే ఇదంతా పకడ్బందీగా కావాలనే ప్లాన్  చేసినట్లుగా గుర్తించారు. 

ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి కావలికి చెందిన కె. శరత్ చంద్ర గా గుర్తించారు.  ఇతను నేరెళ్ల సాయి మనోజ్ తో పాటు  మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి దేవాలయానికి వచ్చారు.  పనిగట్టుకుని శ్రీశైల క్షేత్ర ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు చేస్తున్న ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. స్వామివారి ప్రసాదాల నాణ్యత విషయంలో భక్తులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోనవసరంలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే విధంగా కుట్రలకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.  కుట్రలకు పాల్పడిన వారినే కాకుండా.. వారి వెనుక ఎవరున్నారనే అంశం పైనా ఆరా తీయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిది. 
 
శ్రీశైలంలో స్వామి వారి ప్రసాదాల తయారీలో అన్ని దశల్లోనూ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆలయవర్గాలు చెబుతున్నాయి. ప్రసాదాల తయారీకి ఉపయోగించే సరకుల నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. లడ్డూ విషయానికి వస్తే బూందీ తయారీ నుంచి లడ్డూ కట్టే వరకు శుచి శుభ్రత పాటించడం జరుగుతుంది. సిబ్బంది కూడా తలపై క్యాప్, చేతికి తొడుగులు ధరించి పనిచేస్తారు. పైగా ఈ లడ్డూ తయారీ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు చేయడం జరుగుతుంది. మొత్తం సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి లడ్డూలో ఇటువంటివి వచ్చే అవకాశమే లేదని ఆలయవర్గాలు చెబుతున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Embed widget