అన్వేషించండి

Crime News: హైదరాబాద్‌లో చిక్కిన కర్నూలు డబుల్ మర్డర్ కేసు నిందితులు

కర్నూలులో హత్య చేశారు. సినిమాటిక్‌గా హత్య చేసి హైదరాబాద్ పారిపోయారు. ఇంకా ఎవరికీ దొరకమేమో అనుకున్నారు. కానీ కథ అక్కడే అడ్డం తిరిగింది.

కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన జంట హత్యల కేసులో 24 గంటల్లో ముద్దాయిలను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడితో సహా సహకరించిన వారిని అరెస్టు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు నిందితులను  కస్టడలోకి తీసుకున్నారు.

కౌతాళం మండలం కామవరం గ్రామంలో భూ వివాదం పరిష్కరించే క్రమంలో శివ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈరన్న అనే వ్యక్తిని కూడా ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ రెండు హత్యలు కర్నూలు జిల్లాలోనే కలకలం రేపాయి. హత్యపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించిన కాసేపటికే హత్య చేసిందెవరో క్లారిటీ వచ్చేసింది. నిందితులను కూడా గంటల్లోనే పట్టుకున్నారు.  

మల్లికార్జున అనే వ్యక్తికి శివకు చాలా ఏళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. చాలా సార్లు వీళ్లిద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కానీ గ్రామస్థుల జోక్యంతో ఎప్పటికప్పుడు వివాదం సద్దుమణిగేది. కానీ శివను ఎలాగైనా లేపేయాలని ప్లాన్ చేశాడు మల్లికార్జున. సమయం కోసం ఎదురు చూసేవాడు. 

ఇద్దరి మధ్య ఉన్న భూతగాదాను పరిష్కరించుకుందామని గ్రామస్థులతో కబురు పెట్టాడు మల్లికార్జున. సమస్య పరిష్కారమైతే మంచిదేకదా అంటూ గ్రామస్తులతో శివ వచ్చాడు. అప్పటికే తన స్నేహితులతో శివ మర్డర్‌కు స్కెచ్‌ గీసిన మల్లికార్జున... ఊరందరు చూస్తుండగానే హత్య చేశాడు. శివప్ప వర్గంపై యాసిడ్ పిచికారి చేసి కళ్లలో కారం కొట్టి విచక్షణారహితంగా నరకేేశారు మల్లికార్జున వర్గం. తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టారు. 

ఈ మారణ కాండలో శివతోపాటు వీరన్న అనే వ్యక్తి కూడా చనిపోయాడు. హత్య చేసిన అనంతరం సంఘటనా స్థలం నుంచి మల్లికార్జునతోపాటు మరో ఆరు మంది పరారయ్యారు. వీరు పారిపోవడానికి రామకృష్ణ పరమహంసతోపాటు మరికొందరు గ్రామస్థులు సహకరించినట్టు తెలుస్తోంది. 

హత్య జరిగిన వెంటనే నిందితులు హైదరాబాద్‌ బస్సు ఎక్కి ఎంజీబీఎస్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి ఎటు వెళ్లాలో అని ఆలోచిస్తున్న టైంలో పోలీసులు అటాక్ చేసి పట్టుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పారిపోవడానికి సహకరించిన గ్రామస్తులను కూడా అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ తెలిపారు. 

కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. 

Also Read: తిట్టాడని తండ్రిని చంపేస్తాడా.. ఆ కుమారుడి నేరం క్షమించరానిది: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Also Read: టోనీ ఎవరెవరి జాతకాలు బయట పెట్టనున్నాడు? ఆ బడాబాబులకు చిక్కులు తప్పవా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP DesamNagoba Jathara Padayathra | ప్రారంభమైన మెస్రం వంశీయుల గంగాజల పాదయాత్ర | ABP DesamPawan Kalyan vs BR Naidu | టీటీడీ ఛైర్మన్ క్షమాపణలు కోరేలా చేసిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti 2025: సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
సంక్రాంతి బండెక్కిన హైదరాబాద్‌- ఊరెళ్లే రహదారులన్నీ జామ్‌
CM Revanth Reddy: 'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'మద్యం సరఫరా కంపెనీల విషయంలో పారదర్శకత' - బీర్ల ధరలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
Pawan Kalyan: 'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
'గ్రీన్ సోలార్ పార్కుతో భారీగా ఉపాధి' - ప్రాజెక్ట్ సైట్‌ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
Telangana News: భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక   
భువనగిరి బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి- మండిపడ్డ నేతలు, రెచ్చగొట్టొద్దని హెచ్చరిక  
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
CM Chandrababu: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Kondapochamma Sagar Dam: సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం - సాగర్ డ్యామ్‌లో పడి ఐదుగురు యువకుల దుర్మరణం, సెల్ఫీ కోసం ఒకరినొకరు పట్టుకుంటూ..
Embed widget