By: ABP Desam | Updated at : 28 Apr 2022 02:52 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు శైలజానాథ్
Congress Sailajanath : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దివాలా తీస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. కర్నూలులో మాట్లాడిన ఆయన... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పుల అప్పారావుగా అప్పులు చేస్తున్నారని విమర్శి్ంచారు. సీఎం జగన్ ఏ మొహం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దిల్లీకి వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గనను బయటకు పంపి ప్రిన్సిపల్ సెక్రెటరీకి చివాట్లు పెట్టారన్నారు. వైసీపీ నేతలు దిల్లీలో మర్యాద పోగొట్టుకొని రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. విద్యా దీవెన, అమ్మ ఒడి ఏ పథకమైనా సరే రాష్ట్ర ప్రజలను బిక్షగాళ్లు చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
మంత్రులు భజనగాళ్లు!
రూ.లక్ష కోట్లు ప్రజలకు ఇచ్చామన్న సీఎం జగన్, రూ.75 వేల కోట్లకు లెక్కలు చెప్పడంలేదని శైలజానాథ్ ఆరోపించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో మందులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆక్షేపించారు. రాష్ట్ర మంత్రులు భజనగాళ్లుగా మారారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
అత్యాచార ఘటనలకు రేటు!
రాష్ట్రంలో ఎక్కడ అత్యాచార ఘటన జరిగినా వాటిని రేటు కడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. పరిపాలన ఎలా చేయాలో చంద్రబాబుతో సహా మిగతా పార్టీ నాయకులతో సలహాలు తీసుకుంటే మంచిదని హితవు పలికారు. ఈసారి ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని సీఎం జగన్ అంటున్నారని, ఒక్కసారి అధికారానికే వైసీపీ పరిమితం అవుతుందని ఆరోపించారు.
ఒక్క ఛాన్స్-ఒక్కసారి అధికారానికే పరిమితం : కన్నా లక్ష్మీనారాయణ
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్కసారికే పరిమితమవ్వడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గుంటూరులో లైవ్ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలనా నడుస్తుందన్నారు. విద్యుత్, ఇసుక, ఆర్టీసీ బస్సు ఛార్జీలు, నిత్యావసర ధరలు విచ్చలవిడిగా పెంచారని మండిపడ్డారు. గడిచిన మూడు సంవత్సరాలలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది తప్ప మరొకటి లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఒక్క ఛాన్స్ కే పరిమితం అవ్వడం ఖాయమన్నారు.
Chittoor News : రూ. ఐదు నాణెం మింగేసిన బాలుడు, తల్లిదండ్రులకు వైద్యుల నిర్లక్ష్య సలహా!
Breaking News Live Updates: విజయనగరంలో భారీ వర్షం, మంత్రుల బస్ యాత్ర రద్దు
Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు
CRDA Innar Ring Road CID Case : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో జూన్ 9 వరకూ చర్యలొద్దు - సీఐడీని ఆదేశించిన హైకోర్టు
Kodali Nani : చిన్న పిల్లల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి పంపారు, పవన్ కల్యాణ్ పై కొడాలి నాని హాట్ కామెంట్స్
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!