అన్వేషించండి

Krishna News: నది మధ్యలో ఆగిపోయిన నాటు పడవ... తృటిలో తప్పిన పెనుప్రమాదం...

కృష్ణా నదిలో తృటిలో పడవ ప్రమాదం తప్పింది. గుడిమెట్లలో నాటు పడవ నది మధ్యలో ఆగిపోయింది. చివరికి ఏదోలా కష్టపడి ప్రయాణికులు ఒడ్డుకు చేరుకోగలిగారు.

మంగళవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం కృష్ణా నది నుంచి తాడువాయి గ్రామానికి అనధికారికంగా నాటు పడవల్లో ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. ఈ పడవ నది మధ్యలో ఆగిపోవడంతో కొంతసేపు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే నాటు పడవ నిర్వాహకులు అప్రమత్తమై పడవను ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఇదే ప్రాంతంలో బల్లకట్టు మునిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం లైఫ్ జాకెట్లు కూడా లేకుండా నాటు పడవల్లో ప్రయాణాలు చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల నాటు పడవలను ఆశ్రయిస్తున్నామని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి బల్లకట్టులు ఏర్పాటుచేయాలని, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేసే దానికంటే ప్రమాదం జరగకుండా చూడాలని ప్రభుత్వ అనుమతులు లేకుండా తిరుగుతున్న పడవలను సీజ్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

Also Read: విశాఖ తీరంలో హై టెన్షన్... భగ్గుమన్న రింగ్ వలల వివాదం... బోటు తగలబెట్టిన మత్స్యకారులు

ప్రమాదాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలేవి?

ద‌శాబ్దాలుగా న‌దీ ప్రయాణాలు సాగుతున్నా అవి సుర‌క్షితంగా సాగడానికి పటిష్టమైన చర్యలు లేవనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. గత రెండేళ్లలో ఏపీలో 100 మందికి పైగా పడవ ప్రమాదాల్లో మృతి చెందినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 1992లో దేవీప‌ట్నం మండ‌లంలోని పోచ‌మ్మగండి స‌మీపంలో జరిగిన ప్రమాదంలో లాంచీలో ప్రయాణిస్తున్న దాదాపు వంద మంది ప్రాణాలు మరణించారు. 2017లో కృష్ణా న‌దిలో ఇబ్రహీంప‌ట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 20 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. 2018 మే 15న గోదావ‌రి నదిలో ప్రయాణిస్తున్న లాంచీ ప్రమాదానికి గురై 22 మంది మృతి చెందారు. అప్పట్లో ప‌రిమితికి మించి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎక్కిన బోటు నదిలో మునిగిపోయింది. 2018లోనే జూలై 14న ముమ్మిడివ‌రం మండ‌లం ప‌శువుల్లంక స‌మీపంలో గోదావరి నదిని దాటడానికి వాడే నాటు ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల వ్యవ‌ధిలో నాలుగు ప‌డ‌వ ప్రమాదాల్లో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Also Read: చెత్తపన్ను కట్టకపోతే ఇంటి ముందే చెత్త పోస్తారట... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే హెచ్చరిక !

Also Read:  అమరావతి కార్పొరేషన్ దేని కోసం ? అభివృధ్ది కోసమా ? రాజకీయం కోసమా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget