అన్వేషించండి

Kishan In AP : తలకు గాయం.. జగన్‌తో భేటీ ! కిషన్ రెడ్డి ఏపీ పర్యటన విశేషాలు...

జన అశీర్వాద్ యాత్ర కోసం ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొని కారు ఎక్కుతున్న సమయంలో డోర్ తగిలి తలకు గాయం అయింది.


ఆంధ్రప్రదేశ్‌లో జన ఆశీర్వాద్ యాత్ర చేస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం అయింది.  కారు ఎక్కుతుండగా డోర్ బలంగా తగిలింది.దీంతో నుదుటిపై రక్తం వచ్చేలా దెబ్బతగిలింది. జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దెబ్బ తగిలిన సమయంలో బాధలో విలవిల్లాడిపోవడంతో ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత కోదాడకు బయలుదేరారు. హైకమాండ్ ఆదేశం మేరకు తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర చేస్తారు. కోదాడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఆయన సభను వాయిదా వేసుకునే అవకాశం ఉంది.
 
Kishan In AP : తలకు గాయం.. జగన్‌తో భేటీ ! కిషన్ రెడ్డి ఏపీ పర్యటన విశేషాలు...


గాయం అయిన తర్వాతనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అధికార పర్యటనకు విజయవాడ వచ్చిన కిషన్ రెడ్డిని సీఎం జగన్ తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. సాదరంగా స్వాగతం పలికిన.. అనంతరం కిషన్ రెడ్డితో కలిసి జగన్ భోజనం చేశారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మంత్రి వెల్లంపల్లితో కలిసి సీఎం నివాసానికి వచ్చారు కిషన్ రెడ్డి. భేటీ అయిన తర్వాత సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారని.. ఇందులో రాజకీయం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగువాడికి పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా కేంద్రంలో అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ నరేంద్రమోడీకి రెండు కళ్లులాంటివని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 
 
Kishan In AP : తలకు గాయం.. జగన్‌తో భేటీ ! కిషన్ రెడ్డి ఏపీ పర్యటన విశేషాలు...
ఆంధ్రప్రదేశ్‌ నుంచి కేంద్రమంత్రి వర్గంలో ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరే కేంద్ర మంత్రి ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణతో పాటు ఏపీలోనూ బీజేపీని బలపరిచే  బాధ్యత కిషన్ రెడ్డికే అప్పగించింది. కొత్త మంత్రులందరితో వారి వారి రాష్ట్రాల్లో జన ఆశీర్వాద్ యాత్రలు చేయిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కిషన్ రెడ్డి యాత్ర చేస్తున్నారు. తెలంగాణలో మూజు రోజుల పాటు జన ఆశీర్వాద్ యాత్ర సాగనుంది. అయితే  ఏపీలో యాత్ర ప్రారంభించిన తొలి రోజే తలకు గాయం కావడంతో కిషన్ రెడ్డి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. నదుటికి బలమైన గాయమే అయిందని జన ఆశీర్వాద్ యాత్రను వాయిదా వేసుకుని ..  ఆస్పత్రికి వెళితే బాగుంటుందని అనుచరులు సూచించారు. అయితే కిషన్ రెడ్డి యాత్ర కొనసాగించడానికే ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget