అన్వేషించండి

Anantapuram TDP : తలలు పగులగొట్టుకున్న ఒకే పార్టీ నేతలు - కల్యాణదర్గం టీడీపీలో రచ్చ !

కల్యాణ దుర్గం టీడీపీ నేతలు సమీక్షా సమావేశంలో ఘర్షణకు దిగారు. తలలు పగులగొట్టుకున్నారు.

Anantapuram TDP :  అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపుల గొడవలు ఘర్షణకు కారణం  అవుతున్నాయి. కల్యాణదుర్గం నియోజకవర్గంపై పార్టీ సమీక్షా సమావేశంలో రెండు వర్గాలు కుర్చీలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన కలకలం రేపింది. సమావేశం ఆర్థాంతరంగా ముగిసింది. కల్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం,  ప్రస్తుత ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వర్గం .. తమకంటే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని వాదులటాకు దిగుతూ ఉంటాయి. గతంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఆయన వయసు కారణంగా టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఉమామహేశ్వర్ నాయుడుకు చంద్రబాబుకు చాన్సిచ్చారు. అయితే ఆయన నెగ్గలేదు. 

కల్యాణదుర్గం టీడీపీలో హనుమంతరాయ చౌదరి వర్సెస్ ఉమా మహేశ్వర్ నాయుడు 

కానీ ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు మాత్రం.. తమకే్ ఇంచార్జ్ పదవి ఇవ్నాలని పట్టుబడుతూ  వస్తున్నారు. కానీ ఉమమహేశ్వర్ నాయుడు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినందున ఆయనే ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. పార్టీ తరపున ఏ కార్యక్రమం చేపట్టినా రెండు వర్గాలు పోటీ పడి వివాదాలు సృష్టిస్తూ ఉంటాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున.. వివాదాలను సద్దుమణిగేలా చేసేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గ సమీక్షా సమావేశం ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు .

ఇంచార్జ్ పదవి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ 

సమావేశం ప్రారంభమైన కాసేటికే ఉమామహేశ్వర్ నాయుడును ఇంచార్జ్ పదవి నుంచి తొలగించి తమకు చాన్సివ్వాలని హనుమంతరాయ చౌదరి వర్గం పట్టుబట్టింది. వారికి ఉమామహేశ్వర్ నాయుడు వర్గీయులు అడ్డుపడటంతో.. మాటా మాటా పెరిగింది. చివరికి అది దాడుకు దారి తీసింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాలను  సముదాయించడానికి చాలా సమయం పట్టింది. వీరి వ్యవహారంపై సమావేశానికి వచ్చిన టీడీపీ ముఖ్య నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోని వర్గాలే ఇలా కొట్లాటకు దిగడం ఏమిటని మండిపడ్డారు. 

పార్టీ నేతల మధ్య గొడవలపై దృష్టి పెట్టని టీడీపీ అధినేత 

అనంతపురం జిల్లాలో టీడీపీకి ముఖ్య నేతలు ఉన్నప్పటికీ వారి మధ్య సమన్యవం లేకపోవడంతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే వీరి మధ్య సయోధ్య కుదర్చడంలో టీడీపీ హైకమాండ్ ఎప్పుడూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంది. దీంతో ఎప్పటికప్పుడు అవి పెరిగిపోతున్నాయి. పార్టీ నేతల ఆధిపత్య పోరాటంతో అధికార పక్షం మీద పోరాడటం కన్నా.. తమలో తాము రాజకీయాలు చేసుకోవడానికే టీడీపీ నేతలకు సమయం సరిపోవడం లేదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

అయన్న పాత్రుడిపై పెట్టిన సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు - సీఐడీ విచారణ కొనసాగింపునకు ఓకే !

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Embed widget