అన్వేషించండి

Kalva Srinivasulu: కృష్ణా జలాలపై కేంద్ర గెజిట్ జారీ చేసినా జగన్ ఎందుకు నోరెత్తడం లేదు - కాల్వ శ్రీనివాసులు

Kalva Srinivasulu: కృష్ణా జలాల పున:పంపిణీపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నోరు ఎందుకు మెదపడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Kalva Srinivasulu: కృష్ణా జలాల పున:పంపిణీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోరు ఎందుకు మెదపడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. కృష్ణా జలాల పున:పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోట్ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మాయ మాటలతో మభ్య పెట్టడం తప్ప, రైతులకు, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.  స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. 

మిగులు జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్ష చేసే వరకు, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం ఇప్పటికే అప్పర్ భద్రకు నిధులు కేటాయించిందని, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో కృష్ణాజలాల నీటి వాటాను మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకుందని విమర్శించారు.

నీటి పంపిణీలకు సంబంధించిన విషయాలు కోర్టులకు వెళ్తే త్వరగా తెగవని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం కేంద్రాన్ని ఎదిరించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రానికి, రాయలసీమకు ఇంత అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరిగేలా అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ త్వరలో దీనిపై ప్రణాళిక ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలే టీడీపీ ప్రధాన లక్ష్యమన్నారు.

మిగులు జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌కు స్వేచ్చ ఉంటుందని, అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వాటిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. దీనిపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఊర్లలో పంచాయతీలు చేసినా ఇంత అన్యాయంగా పంచరు కదా అని అడిగారు. ప్రజలు, రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు స్పందించడం కనీస బాధ్యత అని, కానీ అధికార  పార్టీ నేతలు ఎవరూ మాట్లాడడం లేదన్నారు. పార్లమెంట్ చేసిన చట్టానికి భిన్నంగా కేంద్ర జల సంఘం చేసిన సిఫార్సు రాయలసీమకు గొడ్డలి పెట్టులాంటిదని నేతలు మండిపడ్డారు. రాష్ట్రం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణం వాటిని అధికారిక ప్రాజెక్టులుగా ప్రకటించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 

గోదావరి నీటిని కృష్ణ డెల్టా అందించడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమకు అందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన హాంద్రీనీవా ప్రాజెక్టు పనులను 2022 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌ఎల్‌సీకి నీరు రాలేదన్నా.. దిగువ తుంగకు నిధుల కేటాయింపులు, కృష్ణా జలలా పంపిణీ పున:సమీక్షించే అంశాలు అన్నీ మసి పూసి మారేడు కాయలు చేసేందుకు పాలకులు చేస్తున్న దుష్ట పన్నాగాలు అన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు జరుగతున్న అన్యాయంపై పెద్దలు, మేధావులు  మాట్లాడాలని అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati pipe burning case: అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
AP Cabinet Meeting: ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
Pemmasani warning to Jagan: ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget