అన్వేషించండి

JC Prabhakar : కేసులో అర్టీఓ, పోలీసు అధికారులూ ఇరుక్కుంటారు - ఈడీ కేసు తీసుకోవడం సంతోషమన్న జేసీ ప్రభాకర్ రెడ్డి !

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆర్టీఓ, పోలీసులు కూడా ఇరుక్కుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈడీ ఆస్తుల జప్తు చేసిన తరువాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

JC Prabhakar :  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్.. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన ఆస్తులను అటాచ్ చేయడంపై ఆయన భిన్నంగా స్పందించారు. ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు  ఈడి రూపంలోనే దేవుడు ఉన్నాడని తాడిపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇందులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్ కంపెనీ అని.... వారిని ముందు విచారణ చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పటి వరకూ  మాకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ ని విచారణ చేయలేదన్నారు.  నాగాలాండ్ అధికారులను ఎంక్వైరీ చేయాలన్నారు.  సుమారు 38 కోట్ల స్కామ్ అంటున్నారు.. అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని జేసీ ప్రభాకర్ రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. నాకు ఈడీ కేసు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. ఈ కేసులో ఆర్టీఓ, పోలీసు అధికారులు కూడా ఇరుక్కుంటారని జోస్యం  చెప్పారు. 


బీఎస్‌-4 వాహనాల కుంభకోణంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సహచరులు, కంపెనీలకు చెందిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.అశోక్ లేలాండ్ లిమిటెడ్ నుండి బిఎస్-3 వాహనాలను తగ్గింపు ధరకు కొనుగోలు చేసి, ఇన్‌వాయిస్ కాపీలను రూపొందించి బిఎస్-4 వాహనాలుగా నమోదు చేశారనే ఆరోపణలపై జెసి ప్రభాకర్ రెడ్డిపై ఇడి అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసిన ఈడీ ఈరోజు జేసీ ప్రభాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కుంభకోణంలో అశోక్ లేలాండ్ పాత్రపై కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

బిఎస్‌-3 వాహనాలను 2017 ఏప్రిల్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ చేయకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అశోక్‌ లైలాండ్‌కు సంబంధించిన 153 వాహనాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి రెండు వేర్వేరు కంపెనీల పేరుతో తుక్కు కింద కొనుగోలు చేసి 2018లో నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ వాహనాలను తరువాత ఆంధ్రప్రదేశ్‌కు బదిలీపై తెచ్చారు. ఇక్కడా రిజిస్ట్రేషన్‌ చేశారు. 2019లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ చేపట్టింది.  తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేసిన వారిపై రవాణా శాఖ అప్పట్లో కేసులు నమోదు చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడ్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 

ఈ కేసుల విచారణ జరుగుతున్న క్రమంలోనే ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ కూడా  వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ అంశంపై విచారణ చేపట్టింది. మాజీ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి, జెసి.ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలోనూ అప్పట్లో సోదాలు నిర్వహించింది. ఆ తరువాత రెండు సార్లు పిలిచి ప్రశ్నించింది.  రూ.38.36 కోట్ల విలువైన వాహనాల అమ్మకాలు జరిగినట్టు ఇడి గుర్తించినట్టు ఈడీ చెబుతోంది. జేసీ కుటుంబానికి దివాకర్ ట్రావెల్స్ పేరుతో బస్సు సర్వీసులు ఉన్నాయి.గతంలో పెద్ద ఎత్తున నడిచేవి. అయితే ఇప్పుడు ఏపీ నుంచి ఆ బస్సుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్టీఏ అధికారులు టార్గెట్ చేయడంతోనే వ్యాపారాన్ని ఏపీలో ఆపాల్సి వచ్చిందని జేసీ వర్గీయులు ఆరోపిస్తూ ఉంటారు. 

టాప్ హెడ్ లైన్స్

CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Gade Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం- సిట్ అదుపులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ 
గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం- సిట్ అదుపులో ఇద్దరు కానిస్టేబుల్స్‌ 
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget