అన్వేషించండి

JC Prabhakar: కాంప్లెక్స్ ను కూల్చేస్తానంటూ జేసీ ప్రభాకర్ మాస్ వార్నింగ్!

JC Prabhakar: తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో దేవాలయానికి అడ్డుగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని జేసీ ప్రభాకర్ అడ్డుకున్నారు. ఒకవేళ నిర్మిస్తే కూల్చేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. 

JC Prabhakar: సంచలనాలకు కేంద్ర బిందువు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి తన వార్నింగుల పదును చూపించారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలోని ప్రసిద్ధ ఆలయం ఎదురుగా  షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణాన్ని ఆయన అడ్డుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం కారణంగా దేవాలయం కనిపించకుండా పోతోందని ఆయన  వ్యాఖ్యానించారు. ధ్వజ స్తంభానికి దగ్గరగా ఈ నిర్మాణాలు చేపడుతుండటంతో ఏడాదికి ఒకసారి జరిగే రథోత్సవంలో తేరు లాగడానికి ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. దేవాదాయ శాఖ నుంచి అనుమతులు కూడా పొందకుండా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. 

షాపింగ్ కాంప్లెక్స్ కూల్చేస్తానంటూ వార్నింగ్..

కాదు కూడదు అని నిర్మాణాలు చేపడితే కూల్చేస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు .ఆలయ  పరిసర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రజల అవసరాల దృష్ట్యా సానుకూల దృక్పథంతో ఆలోచించాలని లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఆలయం ఎదుట రోడ్లకు ఇరు వైపులా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకుని దేవాలయ ఆదాయాన్ని పెంచితే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. అలా కాకుండా భక్తులను, ప్రజలను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయన అభిమానులు బాస్ ఇస్ బ్యాక్ అంటూ తెగ సంబరపడిపోతున్నారు. 

వరద బాధితులకు ఇంకా సాయం అందలేదు..

అలాగే వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్యకర్తలను గాలికొదిలేశారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గడపగడపకు కార్యక్రమంలో వార్డు వాలంటీర్లు తప్ప.. ఒక్క కార్యక్త కూడా ఎమ్మెల్యేల వెంట లేరన్నారు. అలాగే ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా ఏర్పడ్డ సమస్యలను ఏమాత్రం తగ్గించలేరని అన్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చి కార్యకర్తల కంటే వాలంటీర్లే వైకాపా ఎమ్మెల్యేలకు ఎక్కువ అయ్యారని చెప్పారు. తెలుగు దేశం పార్టీలో పదువులు అనుభవించిన వారంతా కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు త్యాగాలు చేయాలని ఓవైపు చెబుతున్నప్పటికీ.. తమ నాయకులు సిద్ధం కాలేదన్నారు. తెదేపా కార్యకర్తలను జైళ్లకు పంపుతుంటే కూడా తమ పార్టీ నాయకులు కనీసం స్పందించడం లేదని అందుకే తమ పార్టీ మాదిరిగానే వైకాపా కూడా తయారైందన్నారు. 

కొంత కాలం క్రితం జేసీ సోదరుల ఇంట్లో ఈడి దాడులు జరిగాయి. దాడుల తర్వాత సోదరులు ఇద్దరు సైలెంట్ అయిపోయారు. కనీసం మీడియా ముందు కూడా రాలేదు. దీంతో ఆయన అభిమానులు కూడా ఒకింత మౌనం వహించారు. చాలా రోజుల తర్వాత యాడికి దేవాలయం అంశంలో ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ తో మీడియా ముందుకు రావడంతో ఆయన అభిమానులలో ఆనందం నెలకొంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget