అన్వేషించండి

Pawan Varahi Vijaya Yatra: పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ రిలీజ్- ఆ 4 నియోజకవర్గాలే టార్గెట్

Pawan Varahi Vijaya Yatra: పవన్ నాలుగో విడత వారాహి విజయ యాత్ర షెడ్యూల్ రిలీజ్ అయింది. కృష్ణా జిల్లాలో ఈ నెల 21 నుంచి పవన్ యాత్ర మొదలుకానుంది.

Pawan Varahi Vijaya Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి పవన్ నాలుగో విడత వారాహి యాత్ర చేపట్టనున్నారు.  కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.  జిల్లాల్లో  ఐదు రోజుల పాటు యాత్ర కొనసాగనుండగా.. నాలుగు నియోజకవర్గాలను జనసేనాని కవర్ చేయనున్నారు. యాత్రలో భాగంగా అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. 21న అవనిగడ్డ నుంచి యాత్ర ప్రారంభం కానుండగా.. 26వ తేదీ వరకు నాలుగు నియోజకవర్గాల్లో నిర్విరామంగా జరగనుంది.

నాలుగో విడత యాత్రలో భాగంగా మూడు బహిరంగ సభలు, రెండో ఇండోర్ మీటింగ్‌లు పవన్ నిర్వహించనున్నారు. అవనిగడ్డ, గుడివాడ, పెడన నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఈ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాల్లోని ప్రజల సమస్యలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను లేవనెత్తనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిణామలు, జనసేన కార్యాచరణపై నేతలతో చర్చించారు.

ఈ సమావేశంలో నాలుగో విడత వారాహి యాత్రపై చర్చించగా.. అనంతరం షెడ్యూల్‌ను జనసేన పార్టీ విడుదల చేసింది. పవన్ అధ్యక్షతన జరిగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీతో పొత్తు గురించి నేతలకు పవన్ వివరించారు. టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందనే విషయంపై శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్‌ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  సమావేశం ముగిసిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటుందని టీడీపీ గురించి ప్రస్తావించారు. సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నామంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని వ్యాఖ్యానించారు. రూల్ బుక్‌ను ప్రజలంతా గుర్తుంచుకోవాలని సూచించారు. ఇండియా, భారత్ పేర్లపై దేశమంతా చర్చించుకుంటున్నారని, ఇండియా దట్ ఈజ్ భారత్ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందని తెలిపారు.

బ్రిటిష్ వారికి భారత్ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చని, తాను ఎప్పుడూ భారతీయుడిగానే మాట్లాడుతున్నానని పవన్ చెప్పారు. 380 మంది మేథోమథనం చేయడం వల్ల రాజ్యాంగం వచ్చిందన్నారు. సనాతన ధర్మం తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుందన్నారు. అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని, అందరినీ కలుపుకుపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడిందన్నారు. ద్వేషం, దోపిడీ ఎల్లకాలం ఉండదని,  మార్పును అంగీకరించి ధర్మాన్ని పాటించినవారే దేశాన్ని నడపగలరని పేర్కొన్నారు.

అయితే ఉభయగోదావరి జిల్లాలో రెండు విడతలుగా వారాహి విజయయాత్ర చేపట్టగా.. మూడో విడత యాత్ర విశాఖపట్నంలో జరిగింది. ఇప్పుడు నాలుగో విడత యాత్రను కృష్ణా జిల్లాలో పవన్ నిర్వహిస్తున్నారు. వారాహి యాత్రలో వాలంటీర్లను పవన్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ సారి యాత్రలో కూడా వాలంటీర్లను పవన్ టార్గెట్ చేస్తారా..? లేదా వ్యూహం మారుస్తారా? అనేది కీలకంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget