అన్వేషించండి

Janasena Vs Jagan: హామీలు నిజంగా అమలుచేస్తే, ఆ కార్యక్రమాలు ఎందుకు? సీఎం జగన్ కు జనసేన సూటిప్రశ్న

Janasena Leader Nadendla Manohar: సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 

Janasena Leader Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను దాదాపు 99 శాతం పూర్తి చేశామని చెబుతోంది. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేశామని, కొత్త సంక్షేమ పథకాలు సైతం తీసుకొచ్చామని చెప్పడాన్ని జనసేన నేతలు తప్పుపడుతున్నారు. ఒకవేళ సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 

పరిపాలన అద్భుతంగా చేసి ఉంటే, ఇలాంటి కార్యక్రమాలు అవసరం లేదు అన్నారు. ఎవరికి సురక్షితంగా పరిపాలన అందించారో చెప్పాలన్నారు. స్పందన అయిపోయింది, జగనన్నకు చెబుదాం లాంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జగనన్న సురక్ష ఉద్దేశం ఏంటో తమకు అర్థం కావడం లేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేద్దామంటే, జగనన్న వినడు. అధికారులు వినరు, ఎమ్మెల్యేలు కూడా వినిపించుకోరని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీరును నాదెండ్ల ఎండగట్టారు. గడప గడపలో ఎన్నో చోట్ల ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీయడం నిజం కాదా అని ప్రశ్నించారు. అందువల్లే జనసేన చేపట్టిన కార్యక్రమాలలో వేలాదిగా వినతులు, సమస్యలు వస్తున్నాయని గుర్తుచేశారు. 

మైనింగ్, చెరువులు, స్థలాలు, కాంట్రాక్టులు ఆఖరికి వికలాంగుల పింఛన్ల విషయంలోనూ అవినీతి, అక్రమాలే జరుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్బీకేలలో రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ దారుణాలను, వ్యవస్థలో లోపాలను జనసేన ప్రశ్నిస్తుందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్  ను ప్రశ్నిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమస్యలు, వ్యవస్థలో లోపాలు, అవినీతికి పవన్ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు అని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
Also Read: Byreddy Chalo Delhi: జులై 28న ఛలో ఢిల్లీతో మరో పోరాటం, సీఎం జగన్ సైతం రావాలని బైరెడ్డి పిలుపు 

పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో దిగొచ్చిన జగన్ సర్కార్!
వారాహి యాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం బహిరంగ సభ తరువాత రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచకుపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన నెగ్గిన ఏకైక స్థానం రాజోలు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై స్పందించారు. రాజోలు బైపాస్‌ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందని, 15 రోజుల్లో రోడ్డు వేయించకుంటే తానే శ్రమదానం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ఈనేపథ్యంలో అధికారులు స్పందించారు. రాజోలు ఎల్‌ఐసీ బైపాస్‌ రోడ్డులో ఆదివారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలును జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్‌ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత అధికారంలోకి రాకుండానే ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రజలు మాత్రం ఈ రోడ్డు పక్కాగా పుననిర్మించాలని కోరుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Embed widget