అన్వేషించండి

Janasena Vs Jagan: హామీలు నిజంగా అమలుచేస్తే, ఆ కార్యక్రమాలు ఎందుకు? సీఎం జగన్ కు జనసేన సూటిప్రశ్న

Janasena Leader Nadendla Manohar: సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 

Janasena Leader Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను దాదాపు 99 శాతం పూర్తి చేశామని చెబుతోంది. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేశామని, కొత్త సంక్షేమ పథకాలు సైతం తీసుకొచ్చామని చెప్పడాన్ని జనసేన నేతలు తప్పుపడుతున్నారు. ఒకవేళ సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 

పరిపాలన అద్భుతంగా చేసి ఉంటే, ఇలాంటి కార్యక్రమాలు అవసరం లేదు అన్నారు. ఎవరికి సురక్షితంగా పరిపాలన అందించారో చెప్పాలన్నారు. స్పందన అయిపోయింది, జగనన్నకు చెబుదాం లాంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జగనన్న సురక్ష ఉద్దేశం ఏంటో తమకు అర్థం కావడం లేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేద్దామంటే, జగనన్న వినడు. అధికారులు వినరు, ఎమ్మెల్యేలు కూడా వినిపించుకోరని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీరును నాదెండ్ల ఎండగట్టారు. గడప గడపలో ఎన్నో చోట్ల ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీయడం నిజం కాదా అని ప్రశ్నించారు. అందువల్లే జనసేన చేపట్టిన కార్యక్రమాలలో వేలాదిగా వినతులు, సమస్యలు వస్తున్నాయని గుర్తుచేశారు. 

మైనింగ్, చెరువులు, స్థలాలు, కాంట్రాక్టులు ఆఖరికి వికలాంగుల పింఛన్ల విషయంలోనూ అవినీతి, అక్రమాలే జరుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్బీకేలలో రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ దారుణాలను, వ్యవస్థలో లోపాలను జనసేన ప్రశ్నిస్తుందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్  ను ప్రశ్నిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమస్యలు, వ్యవస్థలో లోపాలు, అవినీతికి పవన్ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు అని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
Also Read: Byreddy Chalo Delhi: జులై 28న ఛలో ఢిల్లీతో మరో పోరాటం, సీఎం జగన్ సైతం రావాలని బైరెడ్డి పిలుపు 

పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో దిగొచ్చిన జగన్ సర్కార్!
వారాహి యాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం బహిరంగ సభ తరువాత రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచకుపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన నెగ్గిన ఏకైక స్థానం రాజోలు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై స్పందించారు. రాజోలు బైపాస్‌ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందని, 15 రోజుల్లో రోడ్డు వేయించకుంటే తానే శ్రమదానం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ఈనేపథ్యంలో అధికారులు స్పందించారు. రాజోలు ఎల్‌ఐసీ బైపాస్‌ రోడ్డులో ఆదివారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలును జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్‌ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత అధికారంలోకి రాకుండానే ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రజలు మాత్రం ఈ రోడ్డు పక్కాగా పుననిర్మించాలని కోరుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Political Graph AP: అటైనా .. ఇటైనా పవనే సెంటర్ పాయింట్ - ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్ - జగన్ టార్గెట్ చేయడమే లాభిస్తోందా?
అటైనా .. ఇటైనా పవనే సెంటర్ పాయింట్ - ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్ - జగన్ టార్గెట్ చేయడమే లాభిస్తోందా?
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Iron And Vitamin B12 Deficiency : మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Embed widget