అన్వేషించండి

Janasena Vs Jagan: హామీలు నిజంగా అమలుచేస్తే, ఆ కార్యక్రమాలు ఎందుకు? సీఎం జగన్ కు జనసేన సూటిప్రశ్న

Janasena Leader Nadendla Manohar: సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 

Janasena Leader Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను దాదాపు 99 శాతం పూర్తి చేశామని చెబుతోంది. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేశామని, కొత్త సంక్షేమ పథకాలు సైతం తీసుకొచ్చామని చెప్పడాన్ని జనసేన నేతలు తప్పుపడుతున్నారు. ఒకవేళ సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 

పరిపాలన అద్భుతంగా చేసి ఉంటే, ఇలాంటి కార్యక్రమాలు అవసరం లేదు అన్నారు. ఎవరికి సురక్షితంగా పరిపాలన అందించారో చెప్పాలన్నారు. స్పందన అయిపోయింది, జగనన్నకు చెబుదాం లాంటి కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జగనన్న సురక్ష ఉద్దేశం ఏంటో తమకు అర్థం కావడం లేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేద్దామంటే, జగనన్న వినడు. అధికారులు వినరు, ఎమ్మెల్యేలు కూడా వినిపించుకోరని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తీరును నాదెండ్ల ఎండగట్టారు. గడప గడపలో ఎన్నో చోట్ల ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీయడం నిజం కాదా అని ప్రశ్నించారు. అందువల్లే జనసేన చేపట్టిన కార్యక్రమాలలో వేలాదిగా వినతులు, సమస్యలు వస్తున్నాయని గుర్తుచేశారు. 

మైనింగ్, చెరువులు, స్థలాలు, కాంట్రాక్టులు ఆఖరికి వికలాంగుల పింఛన్ల విషయంలోనూ అవినీతి, అక్రమాలే జరుగుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్బీకేలలో రైతుల వద్ద లంచాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ దారుణాలను, వ్యవస్థలో లోపాలను జనసేన ప్రశ్నిస్తుందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్  ను ప్రశ్నిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర సమస్యలు, వ్యవస్థలో లోపాలు, అవినీతికి పవన్ వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేటు అని నాదెండ్ల వ్యాఖ్యానించారు.
Also Read: Byreddy Chalo Delhi: జులై 28న ఛలో ఢిల్లీతో మరో పోరాటం, సీఎం జగన్ సైతం రావాలని బైరెడ్డి పిలుపు 

పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో దిగొచ్చిన జగన్ సర్కార్!
వారాహి యాత్రలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం బహిరంగ సభ తరువాత రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విరుచకుపడ్డారు. ఈ క్రమంలోనే జనసేన నెగ్గిన ఏకైక స్థానం రాజోలు నియోజకవర్గంలోని స్థానిక సమస్యలపై స్పందించారు. రాజోలు బైపాస్‌ రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉందని, 15 రోజుల్లో రోడ్డు వేయించకుంటే తానే శ్రమదానం చేసి రోడ్డు వేస్తానని హెచ్చరించారు. ఈనేపథ్యంలో అధికారులు స్పందించారు. రాజోలు ఎల్‌ఐసీ బైపాస్‌ రోడ్డులో ఆదివారం నుంచి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలును జనసేన కార్యకర్తలు, వీర మహిళలు సోషల్‌ మీడియా వేదికగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. జనసేన అధినేత అధికారంలోకి రాకుండానే ఒక్క పిలుపుతో ప్రభుత్వం మెడలు వంచుతున్నారని జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.. ప్రజలు మాత్రం ఈ రోడ్డు పక్కాగా పుననిర్మించాలని కోరుతున్నారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget