అన్వేషించండి

Janasena News : టోఫెల్ పేరుతో దోచిపెడుతోంది ఏటా రూ.1052 - ఏపీ సర్కార్‌పై జనసేన సంచలన ఆరోపణలు !

టోఫెల్ పేరుతో ఏటా 1052 కోట్లు ఈటీఎస్ కంపెనీకి కట్టబెడుతున్నారని జనసేన ఆరోపించింది. 2027 వరకూ ఒప్పందం చేసుకున్నారని ఇదో పెద్ద స్కామ్ అని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.


Janasena News :   ప్రభుత్వ స్కూళ్లలో ఉపాద్యాయులను నియమించుకుండా టోఫెల్ పేరుతో ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని ఏటా రూ.1052 కోట్లకు ఎసరు పెట్టారని సీఎం జగన్‌పై జనసేన సంచలన ఆరోపణలు చేసంది.  విచిత్రమైన పథకంతో ఖజానాకు కన్నం వేస్తున్నారన్నరాు.  3 నుంచి 10 విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్ పరీక్ష ను బలవంతంగా రుద్ేదందుకు  ఈటీఎస్ వెంటపడి మరి ఒప్పందం కుదుర్చుకున్నారని  ఆరోపించారు.  ఏటా రూ.1052 కోట్లకు ఎసరు పెట్టి ఏకంగా  2027 వరకు పథకం ఎంఓయూ కుదుర్చుకున్నారని ఆరోపించారు.  ఇంటికి వెళ్లిపోయే వైసీపీ సర్కార్ హడావిడి ఒప్పందం వెనుక  భారీ స్కాం ఉందన్నరు.  అంబేడ్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకాన్ని గాడి తప్పించారని..  జగన్ పేరుతో విదేశీ పథకం తెచ్చి ఏం సాధించారని  నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు  తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోఫెల్ పై ప్రభుత్వ ఒప్పందాల వివరాలను బయట పెట్టారు.  

 

 

విదేశాల్లో చదవాలనుకునేవారికి  టోఫెల్ శిక్షణ 

గత మేలో ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు.  విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరీక్షించేందుకు  టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ టోఫెల్ అనే  పరీక్ష నిర్వహిస్తారు. సాధారణంగా విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు డిగ్రీ అయిన తర్వాత ఈ పరీక్ష రాస్తారు. ఒక వేళ ఫెయిలయితే ట్రైనింగ్ తీసుకుంటారు. కేవలం విదేశాలకు వెళ్లి చదువుకోవాలని అనుకునే వారికి మాత్రమే..ఈ టోఫెల్ వల్ల ఉపయోగం ఉంటుంది.  అయితే, ఏపీలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను కూడా టోఫెల్ కు సన్నద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. రభుత్వ విద్యార్థులకు టోఫెల్ శిక్షణ కోసం ఏపీ సర్కారు ఈటీఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గత మేలో  సీఎం జగన్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ అలైన్ డౌమాస్, ఉన్నతాధికారులు, ఈటీఎస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వ విద్యార్థులను టోఫెల్ దిశగా తీర్చిదిద్దడంపై ఈటీఎస్ తో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశారు.  

ఇవీ ఒప్పందంలో వివరాలు

3 నుంచి 5 తరగతుల వారికి టోఫెల్ ప్రైమరీ పరీక్ష... 6 నుంచి 9 తరగతుల వారికి టోఫెల్ జూనియర్ స్టాండర్డ్ పరీక్ష నిర్వహించేలా ఒప్పందం చేసుకుననారు. 10వ తరగతిలో విద్యార్థులు మాట్లాడే నైపుణ్యాలను అంచనా వేసేందుకు స్పీకింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈటీఎస్ తో ఒప్పందంలో భాగంగా టోఫెల్ యంగ్ స్టూడెంట్ సిరీస్, టోఫెల్ ప్రైమరీ ప్యాకేజి, టోఫెల్ స్టాండర్డ్ ప్యాకేజి, టోఫెల్ జూనియర్ స్పీకింగ్ పరీక్ష నిర్వహిస్తారు. టోఫెల్ కు సన్నద్ధం చేసే క్రమంలో 3 నుంచి 9వ తరగతుల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.7.50 చొప్పున ప్రభుత్వం ఈటీఎస్ కు చెల్లిస్తుంది. 5 నుంచి 9వ తరగతుల్లో రీడింగ్, లిజనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే ఒక్కొక్కరికి రూ.600 చెల్లిస్తారు. 9వ తరగతిలో మాట్లాడడంలో ఉత్తీర్ణులైన వారికి ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున ఇస్తారు. ఉత్తమ నైపుణ్యం కనబర్చిన 52 విద్యార్థులు, ఉపాధ్యాయులకు మూడ్రోజులు అమెరికాలో పర్యటించే అవకాశం కల్పిస్తారు. ఈ పర్యటనలో రవాణా చార్జీలు ప్రభుత్వం, అమెరికాలో వసతి ఖర్చులు ఈటీఎస్ భరిస్తాయని ఒప్పందంలో ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget