అన్వేషించండి

Jagan meeting with MLCs : ఎమ్మెల్సీలతో జగన్ భేటీ - మండలిలో టీడీపీకి చుక్కలు చూపించాలని సూచన !

Andhra Politics : వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం అయ్యారు. మండలిలో టీడీపీని ముప్పుతిప్పలు పెట్టాలని సూచనలు చేశారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని జగన్ వారికి హామీ ఇచ్చారు.

Jagan had a meeting with MLCs :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో సమవేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సి ఉందన్నారు. అదే సమయంలో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రానందున మన వాయిస్ వినిపించకుండా అధికారపక్షం కుట్ర చేసే అవకాశం ఉందని .. అందుకే మనకు  బలం ఉన్న శాసనమండలిలో గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు సూచించారు. 

ప్రభత్వ పరంగా బటన్ నొక్కిన పథకాలకు ఇంకా నిధులు ఇవ్వలేదని  జగన్ ఎమ్మెల్సీలకు చెప్పారు. చంద్రబాబు చేసే తప్పులు శిశుపాలుడి తప్పుల్లా లెక్కిద్దామన్నారు. కొంత సమయం ఇచ్చి పోరాడదామని సూచించరు. సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ నలభై శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అవసరం అయితే రాను త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తానన్నారు. మనం చేసిన మంచి ప్రజలకు గుర్తు ఉందన్నారు. 

శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ 

శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ కారణంగా వారికి అసెంబ్లీలో మాట్లాడే సమయం కూడా పెద్దగా రాదు. అయితే శాసనమండలిలో మాత్రం వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58 కాగా వైఎస్ఆర్సీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకే కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మంచి మెజార్టీ ఉన్నందున శాసనమండలిలో ప్రభుత్వాన్ని అడ్డుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 

పవన్ కల్యాణ్‌ చదివింది పదో తరగతి- పుట్టింది చీరాలలో - ఇదిగో క్లారిటీ!

గతంలో టీడీపీకి మెజార్టీ - ఇప్పుడు రివర్స్ 

2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ లేదు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకే ఎక్కువ మెజార్టీ ఉంది. ఈ కారణంగా రాజధాని బిల్లులను పాస్ చేయించుకోలేకపోయారు. ఆ బిల్లు సలెక్ట్ కమిటీకి వెళ్లింది. రాను రాను టీడీపీ సభ్యులు  పదవి విరమణ చేయడంతో.. ఆ స్థానాలను అసెంబ్లీ, స్తానిక సంస్థలు, గవర్నర్ కోటాలతో తమ పార్టీ నేతలను నియమించారు. ఫలితంగా  వైసీపీకి మెజార్టీ వచ్చింది.                                                                       

టీడీపీ కేబినెట్‌లో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గిందా ? సీనియర్ నేతలకు పదవుల యోగం లేదా ?

ఈ సారి పదవి విరమణ చేసే ఎమ్మెల్సీ సీట్లన్నీ టీడీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో కూడా ఒకటి, రెండు ఎమ్మెల్సీలు వైసీపీకి దక్కే అవకాశాలు లేవు.                              

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Pawan Kalyan Meets Devendra Fadnavis : రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
రాష్ట్రానికి రెండు ఆడపులులను సాధించిన కొమరం పులి! మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక భేటీ
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget