అన్వేషించండి

CM Jagan News : సీఎం జగన్ విదేశీ పర్యటనపై ఉత్కంఠ - రద్దయినట్లేనా ?

సీఎం జగన్ విదేశీ పర్యటన రద్దయినట్లేనా ? రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారా?

 

CM Jagan News :  ఏపీ సీఎం  జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్లాలనుకున్నారు. అందు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడు పర్యటన రద్దయిందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మారుతున్న పరిణామాలతో తాను విదేశీ పర్యటనకు వెళ్లడం కరెక్ట్ కాదన్న అభిప్రాయంలో సీఎం జగన్ ఉన్నారంటున్నారు. షెడ్యూల్ ప్రకారం 21వ తేదీన  లండన్ వెళ్లాల్సి ఉంది. 

వివేకా కేసు పరిణామాలపై కీలక నేతలతో వరుసగా చర్చలు

 తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ముఖ్య నేతలతో వరుసగా రెండు రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మరోసారి ఢిల్లి పెద్దల దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండు, మూడు రోజుల్లో ఢిల్లి వెళ్లి కేంద్ర పెద్దలతో సీఎం జగన్‌ సమావేశం అవుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే లండన్‌ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా  విదేశీ పర్యటన రద్దు... జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. 

పరిస్థితిని చక్కదిద్దేందుకు జగన్ ప్రయత్నాలు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి  ప్రస్తుతం జగన్ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. అన్ని పనులు వీరే చక్క బెడుతున్నారు.  భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయండతో సీఎం జగన్‌ అనంతపురం పర్యటనను  రద్దు చేసుకున్నారు.  కేసు వ్యవహారంపైనే ముఖ్య నేతలతో పాటు న్యాయ నిపుణులతో చర్చించినట్లు చెబుతున్నారు.   సీబీఐ కేసు వ్యవహారంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న అంశాన్ని కూడా తెలుగుదేశం ఇతర పార్టీలన్ని రాజకీయం చేస్తున్నాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని జగన్ పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లుగా చెబుతున్నారు.  ఈ అంశంపై ఎవరూ, ఎక్కడ మాట్లాడవద్దని, ఒక వేళ మాట్లాడాల్సి వస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో సమాచారం తీసుకుని మాట్లాడేలా ఉండాలని, అస్పష్టతతో ఎవరూ మాట్లాడకుండా చూడాలని ముఖ్య నేతలకు జగన్‌ సూచించినట్లు తెలుస్తోంది. 

కర్ణాటక ఎన్నికల బిజీలో బీజేపీ పెద్దలు - అపాయింట్‌మెంట్లు ఇస్తారా ?                 

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అంతా కర్ణాటక ఎన్నికలపై దృష్టి పెట్టి ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు అక్కడ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తారా అన్నది క్లిష్టమైన విషయమే. అయితే మోదీ, అమిత్ షాల అపాయింట్‌మెంట్  కోసం .. వైసీపీ ముఖ్య నేతలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సమయం దొరికితే.. రెండు రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. విదేశీ పర్యటన రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ అనధికారికంగా క్లారిటి వచ్చిందని.. అందుకే విద్యా దీవెన పథకానికి 26న బటన్ నొక్కుతారని ప్రకటించారని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget