అన్వేషించండి

AP Weather News: ఏపీలో ఆదివారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, IMD అలర్ట్

Rains In Andhra Pradesh | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల అధికారులు, ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Heavy Rain alert for Andhra Pradesh | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అల్పపీడనం ప్రభావం, నైరుతి రుతుపవనాలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దాని ప్రభావంలో ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరంలో గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీల దూరంలో, నైరుతి దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. వాయువ్యం దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 

అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం  
ఏపీలో ఆదివారం నాడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు, భారీవర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం చేరుతోంది. ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ ఆపరేషన్, రిలీఫ్ ఆపరేషన్స్ కోసం రూ. 21.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. సహాయక చర్యలకు మాడు ఎన్డీఆర్ఎఫ్ ( 1 కోనసీమ, 1 తూర్పు గోదావరి, 1 అల్లూరి జిల్లా), మూడు ఎస్డీఆర్ఎఫ్ ( 2 ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు  వెల్లడించారు.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు

ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమన్వయ పరుచుకుని పనిచేయాలని సీఎం ఇదివరకే సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఓబియమ్  బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో అధికారులు అన్ని శాఖలవారు సహకరించుకోవాలని సీఎం చంద్రబాబు ఇదివరకే సూచించారు.
Also Read: క్రమంగా పెరుగుతున్న కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద - శ్రీశైలం ఎప్పటికి నిండుతుందంటే ?

చేపల వేటకు వెళ్లకూడదు, ఈ పనులు చేయొద్దు
వరదలతో వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రెండు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం కూడా చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా సూచించారు. ఏమైనా అవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
స్టీల్ ప్లాంట్ కాదు.. కాబోయే స్టీల్ సిటీ - మిట్టల్ పరిశ్రమ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Police complaint about uncooked mutton: మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!
మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. అనంతపురంలో వింత ఫిర్యాదు!

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget