అన్వేషించండి

AP Weather News: ఏపీలో ఆదివారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, IMD అలర్ట్

Rains In Andhra Pradesh | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల అధికారులు, ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Heavy Rain alert for Andhra Pradesh | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అల్పపీడనం ప్రభావం, నైరుతి రుతుపవనాలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దాని ప్రభావంలో ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరంలో గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీల దూరంలో, నైరుతి దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. వాయువ్యం దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 

అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం  
ఏపీలో ఆదివారం నాడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు, భారీవర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం చేరుతోంది. ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ ఆపరేషన్, రిలీఫ్ ఆపరేషన్స్ కోసం రూ. 21.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. సహాయక చర్యలకు మాడు ఎన్డీఆర్ఎఫ్ ( 1 కోనసీమ, 1 తూర్పు గోదావరి, 1 అల్లూరి జిల్లా), మూడు ఎస్డీఆర్ఎఫ్ ( 2 ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు  వెల్లడించారు.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు

ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమన్వయ పరుచుకుని పనిచేయాలని సీఎం ఇదివరకే సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఓబియమ్  బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో అధికారులు అన్ని శాఖలవారు సహకరించుకోవాలని సీఎం చంద్రబాబు ఇదివరకే సూచించారు.
Also Read: క్రమంగా పెరుగుతున్న కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద - శ్రీశైలం ఎప్పటికి నిండుతుందంటే ?

చేపల వేటకు వెళ్లకూడదు, ఈ పనులు చేయొద్దు
వరదలతో వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రెండు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం కూడా చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా సూచించారు. ఏమైనా అవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget