అన్వేషించండి

AP Weather News: ఏపీలో ఆదివారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, IMD అలర్ట్

Rains In Andhra Pradesh | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల అధికారులు, ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Heavy Rain alert for Andhra Pradesh | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అల్పపీడనం ప్రభావం, నైరుతి రుతుపవనాలు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దాని ప్రభావంలో ఏపీలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరంలో గోపాల్ పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీల దూరంలో, నైరుతి దిశగా 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. వాయువ్యం దిశగా కదులుతూ ఒడిశా, ఛత్తీస్ గఢ్ వైపు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. 

అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం  
ఏపీలో ఆదివారం నాడు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు, భారీవర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం చేరుతోంది. ముందస్తుగా ప్రభావితం చూపే జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ ఆపరేషన్, రిలీఫ్ ఆపరేషన్స్ కోసం రూ. 21.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. సహాయక చర్యలకు మాడు ఎన్డీఆర్ఎఫ్ ( 1 కోనసీమ, 1 తూర్పు గోదావరి, 1 అల్లూరి జిల్లా), మూడు ఎస్డీఆర్ఎఫ్ ( 2 ఏలూరు, 1 అల్లూరి) బృందాలు పంపినట్లు  వెల్లడించారు.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు

ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి ప్రభావం చూపే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమన్వయ పరుచుకుని పనిచేయాలని సీఎం ఇదివరకే సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఓబియమ్  బోట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, రోప్స్, ఆస్కా లైట్ ఇతర రక్షణా పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సహాయక చర్యల్లో అధికారులు అన్ని శాఖలవారు సహకరించుకోవాలని సీఎం చంద్రబాబు ఇదివరకే సూచించారు.
Also Read: క్రమంగా పెరుగుతున్న కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద - శ్రీశైలం ఎప్పటికి నిండుతుందంటే ?

చేపల వేటకు వెళ్లకూడదు, ఈ పనులు చేయొద్దు
వరదలతో వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, రెండు మూడు రోజులపాటు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం కూడా చేయవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా సూచించారు. ఏమైనా అవసరం అయితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Toxic Telugu Ticket Price: ఏపీలో యష్ 'టాక్సిక్' రేట్లు... సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో ఎంతో తెలుసా?
ఏపీలో యష్ 'టాక్సిక్' రేట్లు... సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో ఎంతో తెలుసా?
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Embed widget