అన్వేషించండి

JC Prabhakar Reddy : ఈడీ ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, మనిలాండరింగ్ ఆరోపణలపై విచారణ!

JC Prabhakar Reddy : బీఎస్-3 వాహనాల ఫోర్జరీ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.

JC Prabhakar Reddy : బీఎస్-3 వాహనాలను బీఎస్-4 పేరిట విక్రయించిన కేసులో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఈడీ ముందు హాజరయ్యారు. ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఈడీ విచారణకు వచ్చారు.  వాహనాల కొనుగోలు కుంభకోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. 126 బస్సులను స్క్రాప్ కింద అశోక్ లైలాండ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కొనుగోలు చేశారు. నాగలాండ్ లో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ఏపీలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారని సమాచారం. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. భారీగా నగదు బదిలీ, మనిలాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తుంది. జేసీ కంపెనీ BS-3 వాహనాలను BS-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ, తాజాగా విచారణకు హాజరవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇవాళ వారిద్దరూ విచారణకు హాజరయ్యారు.  

అసలేం జరిగింది? 

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి ఫేక్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. గడువు తీరి విక్రయం కాకుండా ఉండిపోయిన 154 లారీలను నాగాలాండ్ లో స్క్రాప్ కింద జేసీ కంపెనీ కోనుగోలు చేసింది. 2018లో  నాగాలాండ్ లో 154 లారీలను  రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని విక్రయించగా, మరికొన్నింటిని  జేసీ కంపెనీ సొంతంగా నిర్వహిస్తుంది. ఈ వాహనాల కొనుగోలు చేసిన వ్యక్తులు నకిలీ పత్రాలతో వాహనాలను కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదైంది.  ఈ కేసు విషయంలో ఇటీవల ఈడీ అధికారులు జేసీ ఇంటిలో సోదాలు నిర్వహించారు.  ఈడీ నోటీసులతో ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారణకు హాజరయ్యారు. ఐదు గంటల పాటు ఈడీ  అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డిని విచారించారు.

రాజకీయ కక్షతో తప్పుడు కేసు 

తనపై  ఉద్దేశ పూర్వకంగానే  కేసు నమోదు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయిస్తామని జేసీ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదుచేశారని జేసీ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.  ఈ కేసు దొంగ కేసు అనే విషయం ఈడీ అధికారులకు ఏం తెలుసని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలు అన్నారు. అలాంటి తాను ఎందుకు భయపడాలని జేసీ తెలిపారు. ఈడీ అధికారులు పిలిస్తే విచారణకు వచ్చామన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసు అని జేసీ ప్రభాకర్ రెడ్డి  మీడియాతో అన్నారు.  

Also Read : Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని

Also Read : Tadipatri News :తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు, ఉద్రిక్తతల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు భూమి పూజ

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Lionel Messi In Kolkata: కేవలం 22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
22 నిమిషాల్లో స్టేడియాన్ని వీడిన లియోనెల్ మెస్సీ, 10 వేలు వేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్!
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
New MG Hector : హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
హారియర్ and XUV700లకు పోటీగా వస్తున్న న్యూ MG హెక్టర్! ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోండి!
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Embed widget