అన్వేషించండి

JC Prabhakar Reddy : ఈడీ ముందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, మనిలాండరింగ్ ఆరోపణలపై విచారణ!

JC Prabhakar Reddy : బీఎస్-3 వాహనాల ఫోర్జరీ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.

JC Prabhakar Reddy : బీఎస్-3 వాహనాలను బీఎస్-4 పేరిట విక్రయించిన కేసులో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఈడీ ముందు హాజరయ్యారు. ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఈడీ విచారణకు వచ్చారు.  వాహనాల కొనుగోలు కుంభకోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. 126 బస్సులను స్క్రాప్ కింద అశోక్ లైలాండ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కొనుగోలు చేశారు. నాగలాండ్ లో కొనుగోలు చేసిన ఈ వాహనాలను ఏపీలో ఫేక్ రిజిస్ట్రేషన్ చేశారని సమాచారం. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి. భారీగా నగదు బదిలీ, మనిలాండరింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తుంది. జేసీ కంపెనీ BS-3 వాహనాలను BS-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జేసీ కంపెనీపై కేసు నమోదు చేసిన ఈడీ, తాజాగా విచారణకు హాజరవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అశ్విత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఇవాళ వారిద్దరూ విచారణకు హాజరయ్యారు.  

అసలేం జరిగింది? 

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి ఫేక్ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. గడువు తీరి విక్రయం కాకుండా ఉండిపోయిన 154 లారీలను నాగాలాండ్ లో స్క్రాప్ కింద జేసీ కంపెనీ కోనుగోలు చేసింది. 2018లో  నాగాలాండ్ లో 154 లారీలను  రిజిస్ట్రేషన్ చేశారు. వీటిలో కొన్నింటిని విక్రయించగా, మరికొన్నింటిని  జేసీ కంపెనీ సొంతంగా నిర్వహిస్తుంది. ఈ వాహనాల కొనుగోలు చేసిన వ్యక్తులు నకిలీ పత్రాలతో వాహనాలను కట్టబెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదైంది.  ఈ కేసు విషయంలో ఇటీవల ఈడీ అధికారులు జేసీ ఇంటిలో సోదాలు నిర్వహించారు.  ఈడీ నోటీసులతో ఇవాళ జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారణకు హాజరయ్యారు. ఐదు గంటల పాటు ఈడీ  అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డిని విచారించారు.

రాజకీయ కక్షతో తప్పుడు కేసు 

తనపై  ఉద్దేశ పూర్వకంగానే  కేసు నమోదు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయిస్తామని జేసీ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదుచేశారని జేసీ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు.  ఈ కేసు దొంగ కేసు అనే విషయం ఈడీ అధికారులకు ఏం తెలుసని జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలు అన్నారు. అలాంటి తాను ఎందుకు భయపడాలని జేసీ తెలిపారు. ఈడీ అధికారులు పిలిస్తే విచారణకు వచ్చామన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసు అని జేసీ ప్రభాకర్ రెడ్డి  మీడియాతో అన్నారు.  

Also Read : Adilabad News : కూతురికి పైలెట్ ఉద్యోగం, కార్మికులను విమానం ఎక్కించిన యజమాని

Also Read : Tadipatri News :తాడిపత్రిలో జేసీ వర్సెస్ పోలీసులు, ఉద్రిక్తతల మధ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు భూమి పూజ

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget