అన్వేషించండి

Andhrapradesh Pensions: అర్హత ఉండి పింఛన్ అందడం లేదా? - సింపుల్‌గా ఇలా అప్లై చేసుకోండి

Andhrapradesh News: ఏపీలో అర్హత ఉండి పెన్షన్లు అందని వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేస్తే పరిశీలన అనంతరం అర్హత ఉంటే పింఛన్ అందిస్తామన్నారు.

How To Apply Pension Scheme In Ap: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పండుగ ప్రారంభమైంది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే సీఎం చంద్రబాబు 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పింఛన్ల పంపిణీని సోమవారం (జులై 1) ప్రారంభించారు. మంగళగిరిలోని పెనుమాకలో లబ్ధిదారుని ఇంటికి వెళ్లి స్వయంగా అందజేశారు. అటు, రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందజేశారు. సోమవారమే పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ పూర్తయ్యేలా ఉద్యోగులు చర్యలు చేపట్టారు. అయితే, రాష్ట్రంలో అర్హత ఉన్నా కొంతమందికి ఇంకా పింఛన్లు అందడం లేదు. మరి అలాంటి వారు ఆఫ్ లైన్, ఆన్ లైన్‌లోనూ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు పరిశీలన అనంతరం వెంటనే పింఛన్ వచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.

అర్హులు వీరే

'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ పథకం కింద.. వృద్ధులు, వితంతువులు, నేత కార్మికులు, చెప్పులు కుట్టేవారు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్స్, హెచ్ఐవీ బాధితులు, చేతి వృత్తుల వారు పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కాగా, సాధారణ లబ్ధిదారులకు నెలకు రూ.4000, వికలాంగులకు నెలకు రూ.6000 , పూర్తిగా వికలాంగులకు నెలకు రూ.15,000, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి నెలకు రూ.10,000 పింఛన్ నగదు అందజేస్తారు. 

ఆన్ లైన్‌లో దరఖాస్తు ఇలా..

  • పెన్షన్లకు సంబంధించి అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index కు వెళ్లి కుడివైపున ఉన్న లాగిన్‌పై క్లిక్ చేయాలి.
  • క్రెడిన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 'గెట్ OTP' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 
  • అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుకు OTP వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత దరఖాస్తు ఓపెన్ అవుతుంది.
  • అనంతరం అక్కడ ఇచ్చిన సూచనల ఆధారంగా మీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు స్క్రూటినీ అనంతరం అధికారులు పెన్షన్ అందిస్తారు.

ఆఫ్ లైన్‍‌లో ఇలా..

  • ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index కు వెళ్లి 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ యోజన దరఖాస్తును డౌన్ లోడ్ చేయాలి.
  • ఆ ఫారం ప్రింట్ అవుట్ తీసుకుని మీ పూర్తి వివరాలను నింపాలి. పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇలా అన్ని వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా నింపాలి. 
  • ఆ దరఖాస్తు ఫారానికి అడ్రస్ ఫ్రూఫ్, తెల్లరేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఇంకా అవసరమైన పత్రాలు జత చేయాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, సంబంధిత పత్రాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తు పరిశీలన అనంతరం పింఛన్ మంజూరు చేస్తారు.

పింఛన్లకు సంబంధించి మరిన్ని వివరాలు లేదా సహాయం కోసం 0866 - 2410017 నెంబరుకు కాల్ చెయ్యొచ్చు. లేదా Society for eradication of rural provety, 2nd floor, Dr.N.T.R Administrative Block, Pandit Nehru RTC Bus Complex, Vijawada, Andhrapradesh - 520001 చిరునామాలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget