అన్వేషించండి

Konijeti Rosaiah : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?

కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్ వ్యతిరేకిగా పేరు పడిన రోశయ్య.. తర్వాత ఆయనకు ఆత్మబంధువు అయ్యారు. ఎలా సాధ్యమయింది ?

రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైంది. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపు తగాదాలు ఉన్న , ఎన్ని వర్గాలు ఉన్న ఆ ప్రభావం వై.యస్.ఆర్ , రోశయ్య మధ్య ఉన్న బంధంపై పడలేదు. నిజానికి వై.ఎస్.ఆర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఓ సారి పీవీ నరసింహారావుకు రోశయ్య ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఘటనను వై.ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. రోశయ్య స్వభావం తెలిసిన వై.ఎస్ ఎప్పుడూ ఆయనను దూరం పెట్టలేదు. కోట్ల విజయభాస్కర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ అసమ్మతినేతగా గుర్తింపు పొందారు. దీంతో విజయభాస్కరరెడ్డి ప్రోత్సాహంతో రోశయ్య పీవీకి .. వైఎస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. అప్పట్లోఆ విషయం సంచలనాత్మకమమయింది. కానీ తర్వాత కాలంలో రోశయ్య వైఎస్‌కు అత్యంత ఆత్మీయుడయ్యారు. 

Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !

1999లో ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు శాసన సభలో చర్చించాల్సిన అనేక అంశాలపై రోశయ్యపైనే ఎక్కువగా ఆధారపడేవారు వైఎస్.  2004లో వై.ఎస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి విజయం సాధించిన రోశయ్య వై.ఎస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా  మాత్రమే కాదు శాసనసభా వ్యవహారాలు కూడా చూసుకునేవారు. శాసన సభలో నెంబర్ 2గా వ్యవహరించారు. తన వాగ్దాటితో ప్రతిపక్షానికి చమటలు పట్టించిన నేర్పరిగా గుర్తింపు పొందారు.

Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !

2009లో రోశయ్య అసెంబ్లీకి పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడంతో మంత్రి పదవికి శాసన సభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాదించాక రోశయ్యను వై.యస్ యదావిధిగా ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు వైఎస్.  చాలా సందర్భాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనా శైలిని పొగిడేవారు. అదే సమయంలో సుతిమెత్తగా హెచ్చరికలు కూడా జారీ చేసేవారు. 

Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్‌ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలు ప్రవేశ పెట్టడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ క్రమంమలో ఆయన ఎక్కడ సభలో మాట్లాడినా ఆయన పథకాలు ప్రవేశపెడుతూంటారు. అయితే ఆర్థిక మంత్రిగా వాటికి నిధులు సర్దుబాటు చేయాల్సింది రోశయ్యనే. అందుకే  ఆయన ఎప్పుడు పథకాలు ప్రకటిస్తారోనని ఆందోళనతో కంట్రోల్ చేసేందుకు .. ప్రయత్నించేవాడినని చెప్పేవారు. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఎలా ఉన్నా... చివరి వరకూ ఆత్మీయంగా ఉన్నది రోశయ్యనే. చివరికి వైఎస్ మరణవార్తను అధికారికంగా చెప్పింది కేబినెట్‌లోఅత్యంత సీనియర్‌గా ఉన్న రోశయ్యనే. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
Valentines Day Spots: ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్నారా ? అద్భుతమైన ప్రదేశాలు ఇవే
ఈ వాలెంటైన్స్ డే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటున్నారా ? అద్భుతమైన ప్రదేశాలు ఇవే
Pushpa 2: 'పుష్ప 2', 'దంగల్' కలెక్షన్లను దాటేసి థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ... 9 రోజుల్లో 700 కోట్ల సామి
'పుష్ప 2', 'దంగల్' కలెక్షన్లను దాటేసి థియేటర్లలో దుమ్మురేపుతున్న మూవీ... 9 రోజుల్లో 700 కోట్ల సామి
Kiran Royal: కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్, అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం
కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలపై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్, అప్పటివరకూ పార్టీ కార్యక్రమాలకు దూరం
Embed widget